కంటికి వెలుగు
సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం అన్నారు.. అవయవాల్లో కంటికి అంతటి ప్రాధాన్యం ఉంది. మరి కళ్లకు జబ్బు చేస్తే వైద్యం చేయించుకోవడం పేదలకు భారమే.
శిబిరాల ఏర్పాటు, బాధితుల గుర్తింపునకు కసరత్తు
సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం అన్నారు.. అవయవాల్లో కంటికి అంతటి ప్రాధాన్యం ఉంది. మరి కళ్లకు జబ్బు చేస్తే వైద్యం చేయించుకోవడం పేదలకు భారమే. దీనిని దృష్టిలో పెట్టుకున్న సర్కారు 2018 ఆగస్టు 15న కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టింది. ఊరూరా నేత్ర పరీక్షలు చేయించింది.. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించడంతో పాటు అద్దాలు అందించింది. తర్వాత 2019 మార్చిలో కొన్ని కారణాలతో పథకాన్ని నిలిపివేసింది. కరోనా అనంతరం చాలా మందిలో కంటి సమస్యలు వెలుగుచూశాయి. ఈ క్రమంలో మళ్లీ పథకాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించింది.
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే: కరోనా అనంతరం అత్యధికంగా పెరిగిన సమస్యలో కంటిచూపు ఒకటి. ఆన్లైన్ చదువులతో పిల్లల్లో ఎక్కువ కనిపించగా, పెద్దల్లో బ్లాక్ ఫంగస్ కారణంగా కంటి జబ్బులు ఏర్పడ్డాయి. ఈ కారణాన్నే చూపుతూ ప్రభుత్వం 2023 జనవరి 18న రెండోవిడత కంటివెలుగు వైద్యశిబిరాలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్యశిబిరాలు నిర్వహించడానికి అవసరమైన ప్రతిపాదనలను ఇప్పటికే వైద్యాధికారులు పంపించారు. వరంగల్లోని ప్రాంతీయ నేత్ర వైద్యశాలకు నిత్యం 300 మందిపైగా వస్తున్నారు. ప్రతిరోజూ 30 శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 15 లక్షల మందికిపైగా కంటి సమస్యతో బాధపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో నేత్ర శిబిరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బృందంలో నలుగురు సిబ్బంది ఉంటారు. ఒక ఆప్తాల్మిక్ అధికారి, ఇద్దరు ఆప్టోమేట్రిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. స్థానికంగా పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఒక బృందం ప్రతి రోజు కనీసం 200 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదనలు తయారు చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత నిర్వహించిన కంటివెలుగులో 19,07,005 మందికి పరీక్షలు చేశారు. 2,55,413 మందికి అద్దాలు పంపిణీ చేశారు.
సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారిలో దగ్గర, దూరపు చూపు కనిపించదు. అదేవిధంగా కండ్లకలక, చత్వారం, ట్రకోమా గ్లకోమాతో పాటు విటమిన్-ఏ లోపంతో వచ్చే రేచీకటి, చూపుమందగించేలా చేసే శుక్లం(కంటిపొర) వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి వారిని కంటివెలుగు శిబిరాలలో గుర్తిస్తారు. గ్లకోమా, కంటిపొరలున్న వారికి శస్త్రచికిత్సలు చేయడానికి జిల్లా ఆసుపత్రులకు సిఫారసు చేస్తారు. దూరం, దగ్గర చూపు సమస్య ఉన్నవారికి అద్దాలు ఇస్తారు. వచ్చే ఏడాదిలో నిర్వహించే శిబిరాలలో మెరుగైన చికిత్సలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.ప్రజల్లో విశ్వాసం పెంచాలి.
సిద్ధంగా ఉన్నాం:
డాక్టర్ సాంబశివరావు, డీఎంహెచ్వో, హనుమకొండ
ప్రభుత్వ ఆదేశం మేరకు కంటి శిబిరాల నిర్వహణకు ప్రత్యేక వైద్యబృందాలను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో కంటి వెలుగు శిబిరాల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సిబ్బందికి శిక్షణ అందిస్తాం. వైద్యపరికరాలు, అద్దాలు, ఇతర సౌకర్యాలను సమకూర్చుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
[ 08-05-2024]
సిద్ధార్థ ఆఫీసుకు ఆలస్యమవుతుంటే.. చకచకా బైక్ తీసి రయ్యిమని వెళుతున్నారు. కొంతదూరం వెళ్లేసరికి ఫోన్ రింగైనట్లు అనిపించింది. -
రేవంత్ ప్రసంగం.. కాంగ్రెస్లో ఉత్తేజం
[ 08-05-2024]
వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని కోరుతూ మంగళవారం రాత్రి హనుమకొండ చౌరస్తాలో కాంగ్రెస్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ విజయవంతమైంది. -
మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి మధ్య వాగ్వాదం
[ 08-05-2024]
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. -
హామీలు నెరవేర్చేందుకే పార్టీ మారా..
[ 08-05-2024]
‘గత అసెంబ్లీ ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేసి, అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకే కాంగ్రెస్లో చేరాను తప్ప.. పదవులకు ఆశపడి కాదని’ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మండలంలోని తాటికొండ గ్రామంలో మంగళవారం నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన సింగపురం ఇందిరతో కలిసి పాల్గొని మాట్లాడారు -
మెరుగైన విద్యుత్తు సరఫరాకు చర్యలు
[ 08-05-2024]
వేసవి ఎండల తాపానికి జిల్లాలో విద్యుత్తు వినియోగం పెరిగింది. డిమాండ్కు అనుకూలంగా ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో అధికారులు మెరుగైన సరఫరాకు గత నాలుగు నెలలుగా చర్యలు చేపట్టారు. -
మేడిగడ్డలో.. మూడు గంటలు
[ 08-05-2024]
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీలో మూడు గంటల పాటు పరిశీలన చేపట్టారు. -
అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం
[ 08-05-2024]
మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. గాలిదుమారంతో మెరుపులు, ఉరుములతో కుండపోత వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ మార్కెట్లో ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. -
అధిక స్థానాల్లో కాంగ్రెస్దే విజయం
[ 08-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే ఐదు అమలు చేసింది..రైతుబంధు ద్వారా నిధులు జమచేసింది రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. -
‘మోదీనే దేశానికి పెద్ద దిక్కు’
[ 08-05-2024]
దేశానికి మోదీనే పెద్ద దిక్కు అని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు అన్నారు -
రోడ్డుపై చెట్టు విరిగిపడి యువకుడి దుర్మరణం
[ 08-05-2024]
ఈదురుగాలుల బీభత్సానికి యువకుడు బలైన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. -
ఓటేద్దామని మాటిద్దాం..!
[ 08-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. భారత రాజ్యాంగం కల్పించిన మహºన్నత అవకాశాన్ని నగరంలో చాలా మంది ఓటర్లు వినియోగించుకోవడం లేదు. పోలింగ్ రోజు నాయకులను ఎన్నుకోవడానికి ఆసక్తి చూపడం లేదు -
‘కడియం, అరూరికి ఓటుతో బుద్ధిచెప్పాలి’
[ 08-05-2024]
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్లు అడిగే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలని భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలకు సూచించారు. -
వన ప్రేమికుడు... వేలుపుల సారయ్య
[ 08-05-2024]
ఆయన వయస్సు 70 ఏళ్లు.. మొక్కల సంరక్షణకు తనదైన శ్రద్ధతో పనిచేసే నిత్య శ్రామికుడు.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన వేలుపుల సారయ్యకు మొక్కల పెంపకమంటే ఎంతో మక్కువ. ప్రస్తుతం రామన్నగూడెం పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్లకిరువైపులా హరితహారం పథకం కింద పెంపకం చేపట్టిన మొక్కలను సంరక్షించే బాధ్యతను చేపట్టారు. -
ఎంపీ ల్యాడ్స్ కేటాయింపు ఇలా..
[ 08-05-2024]
దేశ అభ్యున్నతికి పార్లమెంటు ఒక దిక్సూచి.. ప్రగతికి నాంది అక్కడి నుంచే మొదలవుతుంది.. లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ.. కేటాయించే నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
కమలదళం.. గెలుపు వ్యూహం
[ 08-05-2024]
వరంగల్ లక్ష్మీపురలో బుధవారం భాజపా నిర్వహిస్తున్న భారీగా బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభను కాషాయ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
-
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
-
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్లో పూర్’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM