అరకిలో అదనం.. అన్నదాతకు అన్యాయం!
జిల్లాలో తూకాలు ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలన్నింటిలోనూ అరకిలో అదనంగా తూకం వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్
మడుపుగల్ కొనుగోలు కేంద్రంలో కాంటాలు వేస్తున్న హమాలీలు
జిల్లాలో తూకాలు ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలన్నింటిలోనూ అరకిలో అదనంగా తూకం వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మిల్లర్ల ప్రయోజనం కోసం అదనంగా కాంటా వేస్తున్నారు. ఫలితంగా ఎంతో శ్రమించి పంట పండించిన కర్షకులు దగాపడుతున్నారు. తరుగు పేరిట ప్రతి బస్తాకు అర కిలో చొప్పున అదనంగా తూకం వేస్తున్నారు. ఖాళీ బస్తాతో కలిపి 40.600కిలోల చొప్పున తూకం వేయాలి. నిర్వాహకులు అరకిలో అదనంగా 41.200గా వేస్తున్నారు. ఈ లెక్కన 200 బస్తాలు పండిన రైతులకు బస్తాకు అరకిలో చొప్పున క్వింటాలు ధాన్యం నష్టపోతున్నారు. జిల్లాలో 1.32 లక్షల మంది రైతులు 2.12 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు.3.17 లక్షల టన్నులు దిగుబడులు వస్తాయని వ్యవసాయాధికారులు అంచనాలు రూపొందించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించే వారందరికీ నష్టం వాటిల్లుతోందని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అదనంగా తూకానికి అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మహబూబాబాద్ మండలం ముడుపుగల్లు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఇది. ఇక్కడ 41.200 కిలోలు చూపిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40.600 కిలోల చొప్పున బస్తా కాంటా వేయాలి. నిర్వాహకులు అదనంగా అరకిలో తూకమేస్తున్నారు. కేంద్రంలో మూడు చోట్ల కాంటాలు నిర్వహిస్తుండగా అన్ని చోట్ల ఇదే విధంగా జరుగుతోంది. ఎక్కువ కాంటా ఎందుకు వేస్తున్నారని నిర్వాహకులను ప్రశ్నిస్తే మిల్లర్లు బరువు తక్కువగా వస్తుందని దిగుమతి చేసుకోవడం లేదని.. దీంతో అదనంగా తూకమేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో తాము నష్టపోతున్నామని నిబంధనల ప్రకారమే కాంటాలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
208 కేంద్రాలు
ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీ, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మెప్మా ద్వారా జిల్లాలో 239 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. 208 ప్రారంభించి కొనుగోలు చేస్తుండగా ఇప్పటి వరకు 2265 టన్నుల ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ లెక్కన తరుగు రూపంలో క్వింటాళ్ల కొద్ది నష్టపోయి ఉంటామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్వాహకులు ఏమంటున్నారంటే
కేంద్రాల్లో తూకం వేసి నిల్వ చేసిన బస్తాలను మిల్లులకు పంపినప్పుడు బరువు తగ్గిందని మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో అదనంగా తూకం వేస్తున్నామంటున్నారు. అప్పుడప్పుడు తేమ శాతం అధికంగా ఉందని దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారన్నారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తున్నట్లు చెబుతున్నారు. ముడుపుగల్ కేంద్రం నుంచి పంపించిన సుమారు మూడు లారీల ధాన్యాన్ని బరువు తక్కువగా ఉందని తీసుకోవడానికి నిరాకరిస్తే గోనె సంచులకు చిల్లులు పడడం వల్ల తరగు వచ్చిందని చెప్పామన్నారు.
నిబంధనల ప్రకారమే తూకాలు
కృష్ణవేణి, జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్
కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులను నిబంధనల ప్రకారం తాలు, దుమ్ము లేకుండా, 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని తూకం వేయాలని చెప్పాం. అలా కాకుండా వారికి నచ్చినట్లుగా..అదనంగా తూకం వేస్తూ అన్నదాతలను నష్టపరిచడం సరికాదు. అలాంటివి ఉంటే నిర్వాహకులను హెచ్చరించి నిబంధనల ప్రకారం కాంటాలు చేయాలని సూచిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవినీతిపరుల అడ్డా కాంగ్రెస్
[ 10-05-2024]
దోపిడీలో కాంగ్రెస్ నెంబర్వన్గా మారిందని.. అవినీతి, కుటుంబ పాలనలో కూరుకుపోయిన ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో వాతలు పెట్టాల్సిన అవసరం ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ధ్వజమెత్తారు. -
ఐటీడీఏలు ఎదగాలి.. గిరిజనం మురవాలి
[ 10-05-2024]
ఐటీడీఏ.. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ. కొన్నేళ్లుగా గాడితప్పింది. వీటి ఫలాలు గిరి పుత్రులకు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇప్పుడు పూర్వవైభవం చూడాలని గిరిపుత్రులు ఆశిస్తున్నారు. -
విదేశాల్లో ఓటుకు పట్టం.. వేయకుంటే ఊరుకోదు చట్టం!
[ 10-05-2024]
దేశం ప్రగతి దిశగా సాగాలంటే సమర్థులనే పాలకులుగా ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన అందించే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. -
పైపైన పూడికతీత..ఇలాగైతే ముంచుతుంది నాలా!
[ 10-05-2024]
నగరంలో నాలాల పూడికతీత పనులు పైపైన జరుగుతున్నాయి. పర్యవేక్షించేవారు లేకపోవడంతో అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి(సిల్ట్), ఇతర వ్యర్థాలు ముట్టుకోవడం లేదు. -
కాంగ్రెస్, భాజపా దొందూ దొందే..
[ 10-05-2024]
ఇన్నాళ్లు దేశాన్ని పాలించిన జాతీయ పార్టీలు పేదలకు చేసిందేమీ లేదని, ప్రజా వ్యతిరేకతలో కాంగ్రెస్, భాజపా దొందూ దొందేనని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆరోపించారు. -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు అశీర్వదించి గెలిపిస్తే ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్య అన్నారు. -
భారాస హయాంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం
[ 10-05-2024]
పరకాల, గీసుకొండ, న్యూస్టుడే: రాష్ట్రంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ భారాస అని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. -
మరో అయిదు బడుల్లో పీఎంశ్రీ శ్రీకారం
[ 10-05-2024]
విద్యార్థుల సంఖ్య, పాఠశాలల్లో మౌలిక వసతులను గమనంలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈయేడాది జిల్లాలో మరో అయిదు పాఠశాలలను పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్) పథకానికి ఎంపిక చేసింది. -
‘ఏ పార్టీలో ఉన్నా.. క్రమశిక్షణకు కట్టుబడి ఉంటా’
[ 10-05-2024]
నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణకు కట్టుబడి కార్యకర్తలను కాపాడుకుంటానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. -
దేశ సంపద అంబానీ, అదానీల చెంత..
[ 10-05-2024]
దేశ సంపదను కేంద్రంలోని భాజపా అంబానీ, అదానీలకు దోచిపెట్టి, పన్నులను ప్రజలపై మోపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. -
మహిళలకు తోడూనీడ.. సఖి
[ 10-05-2024]
బాధిత బాలికలకు, మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ అండగా ఉంటుంది ఈ సంస్థ. -
రాహుల్గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. -
‘దేవుళ్లపై ఒట్లు వేస్తే ఓట్లు రాలవు’
[ 10-05-2024]
ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళితే అక్కడ స్థానిక దేవుళ్ల మీద ఒట్టేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారని, కానీ ఈసారి ఓట్లు రాలవని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. -
కేయూ వీసీ పదవి ఎవరిని వరించునో..!
[ 10-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉప కులపతి, సామాజిక శాస్త్రం సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ మూడేళ్ల పదవీకాలం ఈ నెల 21తో ముగియనుంది. -
శ్రీభద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 10-05-2024]
ఓరుగల్లు నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీభద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. -
సిరా చుక్క పెట్టే వేలు లేకపోతే..?
[ 10-05-2024]
ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ఓటు వేశావా? -
కాంగ్రెస్ ప్రచారంలో అపశ్రుతి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం చేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం -
హవాలా కేసులో ఇద్దరి అరెస్టు
[ 10-05-2024]
వరంగల్ నగరంలో జరిగిన ఆర్థిక మోసం(హవాలా) కేసులో మట్టెవాడ ఠాణా పోలీసులు గురువారం ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!