వ్యూహకర్తను వరించిన పదవి
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని మారుమూల గ్రామం అర్పన పల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డికి రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవి వరించింది.
వేం నరేందర్రెడ్డి
మహబూబాబాద్, న్యూస్టుడే: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని మారుమూల గ్రామం అర్పన పల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డికి రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవి వరించింది. కేబినెట్ హోదాలో ముఖ్యమంత్రి సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రికి సలహాదారుగా రాష్ట్ర స్థాయిలో పదవి లభించడం గర్వకారణంగా ఉందని మానుకోట జిల్లావాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 2004లో తెదేపా నుంచి మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గ సభ్యుడిగా విజయం సాధించిన వేం నరేందర్ రెడ్డి యువనేతగా పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేశారు. జనరల్ స్థానమైన మహబూబాబాద్ శాసనసభ టికెట్ను ఆశిస్తూ 1999లో ప్రయత్నించినా అవకాశం లభించకపోవడంతో పార్టీలో చురుకుగా వ్యవహరించారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగు రైతు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. 2004లో మహబూబాబాద్ శాసనసభ టికెట్ పొంది ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై పోరాడారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2009లో నియోజకవర్గం గిరిజనులకు రిజర్వు అయింది. ఈ సందర్భంగా అప్పట్లో శాసనసభ ఎన్నికల కోసం షెడ్యూల్ వెలువడే రోజే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఒకే రోజు రూ. వంద కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబాబాద్లో ఆర్వోబీ, కేసముద్రంలో ఆర్వోబీ, మున్నేరు, పాకాల వాగుపై హైలెవల్ వంతెనలు, ప్రధాన బీటీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రస్తుత ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, దనసరి అనసూయ సీతక్క, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు తదితర నేతలకు స్నేహితుడు. 2016లో రేవంత్రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నరేందర్రెడ్డి ఆయనకు సన్నిహితుడిగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా అవకాశం రాకపోయినా ఈ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకతను చాటారు. తన అనుచరులకు వివిధ రకాలుగా సాయపడుతూ పార్టీ పదవులు ఇప్పించడం, ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు వ్యూహరచన చేస్తూ సఫలీకృతుడవుతున్నట్లు ఆయనకు పేరు ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ముఖ్య నాయకులు, కార్యకర్తలను సమన్వయపరుస్తూ క్రియాశీలకంగా వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటళ్లకు వినూత్న పేర్లు.. రుచుల విందు
[ 29-04-2024]
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే భిన్నంగా ఆలోచించాలి.. రెస్టారెంట్ల వ్యాపారంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. -
ఉద్యమ నేతను చూసి ఉప్పొంగిన ఆనందం
[ 29-04-2024]
గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర హనుమకొండ నగరంలో ఆదివారం విజయవంతమైంది. నక్కలగుట్టలో సాయంత్రం 4 గంటల నుంచి వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో భారాస నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
విపణిలో ధర లేదు.. గిడ్డంగిలో జాగ లేదు!
[ 29-04-2024]
ఉమ్మడి వరంగల్వ్యాప్తంగా ఎర్ర బంగారం పండించిన రైతులు ఈసారి నష్టాల ఘాటులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
ఓరుగల్లు ముద్ర ఉండాల్సిందే..!
[ 29-04-2024]
వారంతా ఇప్పుడు లోక్సభ పోరులో హోరాహోరీగా తలపడుతున్నారు. పార్లమెంటులో అడుగుపెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. -
భాజపాతోనే మాదిగలకు న్యాయం
[ 29-04-2024]
భాజపాతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
బడుల మరమ్మతులకు సన్నద్ధం
[ 29-04-2024]
వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-04-2024]
జిల్లాలో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారమైంది. కొంత కాలంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. -
‘హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్’
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలిచ్చి.. ఒకటి రెండే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
నిప్పుల కుంపటి
[ 29-04-2024]
జిల్లాలో ఎండలవేడి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు తీవ్రమై రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. -
17 నెలలు 17 కి.మీ!
[ 29-04-2024]
జాతీయ రహదారి 353సీˆ మన రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి మొదలై హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వరకు 101 కిలోమీటర్లు సాగుతుంది. -
డంపర్లకు టైర్ల కొరత
[ 29-04-2024]
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి కేంద్రాలైన ఉపరితల గనుల్లో నడిచే డంపర్లకు టైర్ల కొరత ఏర్పడింది. -
అటకెక్కిన ఆధునికీకరణ
[ 29-04-2024]
మంగపేట మండలం నర్సింహసాగర్ సమీపంలో వర్షాధారంగా నిర్మించిన మల్లూరు వాగు ప్రాజెక్ట్ను ఆధునికీకరించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
ఫలితాలు మెరుగుపడాలి..!
[ 29-04-2024]
ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం అనుకున్నంతగా ఆశాజనకంగా లేదు. -
తండా ఒక్కటే ‘లోక్సభ’ నియోజకవర్గాలే వేరు
[ 29-04-2024]
ఒక పల్లె ప్రజలంతా పంచాయతీ, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం సాధారణం.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్