తప్పటడుగు వేస్తే... తప్పదు వేటు!
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది.. అభ్యర్థుల తరఫున పార్టీల వారీగా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల వేళ.. ఉద్యోగులూ జాగ్రత్త
న్యూస్టుడే, భూపాలపల్లి కలెక్టరేట్
లోక్సభ ఎన్నికల్లో శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఉద్యోగులకు సూచనలు చేస్తున్న భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది.. అభ్యర్థుల తరఫున పార్టీల వారీగా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించాలి. ఎన్నికల సభలు, సమావేశాలు, రాజకీయ పార్టీలకు మద్దతు తెలపడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి ఉద్యోగులు పనిచేయాలి.. ఆరు జిల్లాల్లో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 70 వేల మందికి పైగా శాశ్వత, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.
నిబంధనలు ఇవే..
- ఉద్యోగులు రాజకీయ సభలు, సమావేశాల్ల్లో పాల్గొని ప్రచారం చేయడం, రాజకీయ పార్టీలు, నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడటం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం వంటి పనులు చేయొద్దు. సెక్షన్ 23 ప్రకారం ఎన్నికల కోడ్ ఉన్నన్ని రోజులు ఈ నిబంధన అమల్లో ఉంటుంది.
- ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అసెంబ్లీ, లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే ఉద్యోగానికి రాజీనామా చేయాలి.
- ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి సహకరిస్తున్నారనే చిన్నపాటి ఆధారం దొరికినా చాలు సంబంధిత ఉద్యోగిపై వేటు తప్పదు.
- ఉద్యోగి కింది స్థాయి సిబ్బందికి ఫలానా అభ్యర్థికి మద్దతు తెలపాలని, లేదా సహకరించాలని, ఓటేయాలని సూచించినా శాఖాపరమైన చర్యలు తప్పవు.
సామాజిక మాధ్యమాల్లోనూ జాగ్రత్తలు అవసరం
- తమకు నచ్చిన నాయకుల కోసం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తుంటారు. వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ ఇలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే త్వరగా దొరికిపోవడం ఖాయం.
- ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఉద్యోగులు సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్టును గమనిస్తుంది.
- ఉద్యోగులు రాజకీయ పార్టీలు, నాయకులకు అనుకూలంగా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపైనా ఎవరైనా ఫిర్యాదు చేసినా వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటారు.
గ్రూప్ అడ్మిన్ సైతం బాధ్యులే..
ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు పలు సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులపై పోస్టులు పెడుతుంటారు. అలాంటి వాటిపై సంబంధిత గ్రూప్ అడ్మిన్ ప్రభుత్వ ఉద్యోగి అయినా జాగ్రత్తగా ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా గ్రూపులో పోస్టులు పెట్టే సభ్యులను తొలగించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఎవరైనా తప్పుడు పోస్టు చేసిన వ్యక్తితో పాటు అడ్మిన్పైనా కేసు నమోదు చేస్తారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో..
- భారాస అధినేత కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నందున భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న సాంస్కృతిక సారథి కళాకారిణిని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
- పెద్దపల్లి జిల్లా రామగుండంలో భారాస ఎమ్మెల్యే అభ్యర్థి నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్న భూపాలపల్లి జిల్లాలోని మరొక సాంస్కృతిక సారథి కళాకారుడు కూడా సస్పెండ్కు గురయ్యారు.
- ములుగు జిల్లా ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద సస్పెండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరి గీశారు.. గురి ఎవరిదో..!
[ 30-04-2024]
‘నోటాతో కలిపి ఒక్కో బ్యాలెట్ యూనిట్పై 16 మంది అభ్యర్థుల గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వరంగల్ నియోజకవర్గం పరిధిలో మూడేసి బ్యాలెట్ యూనిట్లు, మహబూబాబాద్ పరిధిలో రెండేసి బ్యాలెట్ యూనిట్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.’ -
పరీక్షే జీవితం కాదు.. తప్పితే మళ్లీ రాద్దాం!
[ 30-04-2024]
జీవితం అంటే మంచి-చెడు, తీపి-చేదు, ఆనందం-విషాదం. ఎంతటి వారికైనా ఆటుపోట్లు తప్పవు. ఆవేశంలో తీసుకునే నిర్ణయం సరైంది కాదనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పరీక్షల్లో తప్పిన వారు బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగించే విషయం. -
ఓటేయడానికైనా ఎలా రావాలి...!
[ 30-04-2024]
తలపైన గ్రాసం.. సంకలో పసికూన.. మరో చేతిని పట్టుకున్న చిన్నారి. పక్కనే పండు ముసలి తల్లితో వందల మందిని తోసుకుంటూ జనరల్ బోగిలోకి ఎక్కాలంటే ఎంత కష్టామో ఊహించండి. కష్టపడి ఎలాగోలా లోనికి వెళ్లినా కాలు పెట్ట వీలుండదు -
వరంగల్ ప్రధాన న్యాయమూర్తిగా నిర్మలాగీతాంబ
[ 30-04-2024]
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వలగూడం బడిగేలి నిర్మలాగీతాంబ సోమవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్లోని సిటీ స్మాల్ కాజెస్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఈమె బదిలీపై జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. -
‘భారాస, భాజపాలు తోడు దొంగలు’
[ 30-04-2024]
కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాసలు తోడుదొంగ పార్టీలని, అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న రెండు పార్టీలకు ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు -
‘లోక్సభ ఎన్నికల తర్వాత భారాస దుకాణం మూత’
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస దుకాణం మూతపడడం ఖాయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. -
కొడకండ్లకు మినీ టెక్స్టైల్ పార్క్ తెస్తా
[ 30-04-2024]
చేనేత కార్మికులు అధికంగా ఉన్న కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి... పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ హామీ ఇచ్చారు. కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో సోమవారం నిర్వహించిన రోడ్షో కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. -
భువనగిరి బరిలో 39 మంది
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా భువనగిరి స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఎందరో అధికారులు వివరాలు వెల్లడించారు. -
నీటి కుంట.. తీరును తంటా!
[ 30-04-2024]
మానవుడి అవసరాలకు మించి అడవులను నరికివేయడంతో వాతావరణ సమతౌల్యం దెబ్బతిని కరవు పరిస్థితులు ఎదురవుతున్నాయి. -
‘ఈ’ సైకిల్ భళా..!
[ 30-04-2024]
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థి. మండలంలోని గోపాలపురానికి చెందిన కాముని హరీష్ గార్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో ప్రథమ సంవత్సరం పూర్తిచేశారు. -
రాత్రిపూటా నిప్పుల కుంపటే!
[ 30-04-2024]
ములుగు జిల్లా భానుడి ప్రతాపానికి అట్టుడికిపోతోంది. రాత్రిపూట సాధారణంగా 25-30 డిగ్రీల మధ్య ఉండాల్సిన ఉష్ణోగ్రత 33.7-36.8 డిగ్రీలు నమోదవుతోంది -
రాతియుగం నాటి కంకణ శిల లభ్యం
[ 30-04-2024]
సుమారు ఆరు వేల ఏళ్ల నాటి అపురూపమైన కొత్త రాతియుగం పనిముట్టు కంకణ శిలను ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని భూపతిపురం గ్రామంలో కనుగొన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్, పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, చిడం రవి తెలిపారు -
మరోసారి మోదీ ప్రభుత్వం ఖాయం
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్లో సోమవారం నిర్వహించిన భాజపా జనసభ విజయవంతమైంది. ఎండను సైతం లెక్కచేయకుండా లోక్సభ నియోజకర్గం పరిధిలోని ప్రజలు భారీగా తరలొచ్చారు. -
అయిదుశాతం రాయితీకి చివరి అవకాశం
[ 30-04-2024]
ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపులకు వరంగల్ నగర ప్రజల నుంచి స్పందన లభించింది. సోమవారం సాయంత్రం వరకు సుమారు రూ.18 కోట్ల పైన వసూలైనట్లు బల్దియా పన్నుల విభాగం అధికారులు తెలిపారు. -
తాగునీటి ఎద్దడి రాకుండా అప్రమత్తత అవసరం
[ 30-04-2024]
వరంగల్ నగరంలో తాగునీటి ఎద్దడి రావొద్దు, రెండునెలల పాటు అధికారులందరూ అప్రమత్తంగా పనిచేయాలని ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వరంగల్ ఉమ్మడి జిల్లా నీటి సరఫరా ప్రత్యేకాధికారి బి.గోపి సూచించారు. -
కెప్టెన్ ఇంటి నుంచి ఖమ్మం ప్రచారానికి కేసీఆర్
[ 30-04-2024]
వరంగల్లో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించి హంటర్రోడ్లోని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో బస చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద