కొత్త నంబరేసి.. కట్టబెట్టేసి
స్థిరాస్తి ధరలకు రెక్కలు రావడంతో భూదందా కొత్తపుంతలు తొక్కుతోంది. ఉభయ జిల్లాల్లో ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు మార్చి స్వాహా చేస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. అసలు సర్వే నంబర్కు
అక్రమ రిజిస్ట్రేషన్లతో సర్కారు భూముల స్వాహా పర్వం
తాడేపల్లిగూడెం, న్యూస్టుడే
స్థిరాస్తి ధరలకు రెక్కలు రావడంతో భూదందా కొత్తపుంతలు తొక్కుతోంది. ఉభయ జిల్లాల్లో ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు మార్చి స్వాహా చేస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. అసలు సర్వే నంబర్కు సబ్ డివిజన్ నంబరు సృష్టించి ఇతరుల పేరున రిజిస్ట్రేషన్లు చేసి ప్రభుత్వ భూములను కాజేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన కొందరు అధికారుల ప్రమేయం ఉన్న ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల భూదందా ఆలస్యంగా వెలుగు చూసింది.
తణుకు(సజ్జాపురం), పాలకొల్లు, ఆచంట, ఆకివీడు, మొగల్తూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రూ.కోట్లు విలువ చేసే 11.42 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఏటా కలెక్టర్ 22(ఎ) రిజిస్టర్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపుతారు. అందులో నిషేధిత జాబితాలోని ప్రభుత్వ భూముల వివరాలు ఉంటాయి. అలాగే 2020లో అప్పటి కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా అలాంటి వివరాలతో పుస్తకరూపంలో విడుదల చేశారు. ఆయా సర్వే నెంబర్లతో ఎలాంటి క్రయవిక్రయాలు జరగడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు. వాటికి సబ్డివిజన్ నంబర్లు వేసినా రిజిస్ట్రేషన్లు చేయకూడదు. ఈ పుస్తకంలో ఉన్న భూమి రిజిస్ట్రేషన్కు వెళ్తే ఆన్లైన్లో తిరస్కరణ చూపుతుంది. ఈ నేపథ్యంలో కొందరు రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల అండతో బైనంబరు వేసి రిజిస్ట్రేషన్లు చేసేశారు. వీటిపై అప్పట్లో సత్యమేవ జయతే సంస్థ ఉన్నతాధికారులకు పక్కా ఆధారాలతో ఫిర్యాదులు చేసింది. వీటిపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కనీసం శాఖాపరమైన విచారణ కూడా చేపట్టలేదు.
ఐదు కార్యాలయాల్లో... తణుకు (సజ్జాపురం) సబ్రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని ప్రభుత్వ భూమిని ఐదు దస్తావేజులుగా సృష్టించి విక్రయించారు. ఐదింటికీ బైనంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేశారు. 809/2020 దస్తావేజుకు సంబంధించి మండపాక గ్రామంలో 454/2 నిషేధిత భూమి జాబితాలో ఉంది. దీనిని 454/2(ఎ)గా మార్పుచేసి రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇలా ఐదు డాక్యుమెంట్లుగా ఈ గ్రామంలో ప్రభుత్వ భూమిని ఇతరులు సొంతం చేసుకున్నారు. ఈ తరహాలోనే ఉభయ జిల్లాలోని ఐదు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోనూ చేశారు. వీటి పరిధిలోని 24 గ్రామాల్లో 24 సర్వే నంబర్లలో సుమారు 53 దస్తావేజులుగా వీటిని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు.
చర్యలు తీసుకుంటాం.. గతంలో 22(ఎ) జాబితాలపై విచారణ జరిగింది. కొందరిని సస్పెండ్ చేశారు. సర్వేనంబర్లు, ఇతర వివరాలు అందిస్తే విచారించి చర్యలు తీసుకుంటాం. - నాగమల్లేశ్వరరావు, ఇన్ఛార్జి జిల్లా రిజిస్ట్రార్ పశ్చిమగోదావరి.
మొగల్తూరులో చర్యలు..
నిషేధిత భూములను రిజిస్ట్రేషన్లు చేసినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు విచారణ నిర్వహించి వాస్తవాలని ధ్రువీకరించారు. గత ఏడాది ఆగస్టులో మొగల్తూరు సబ్రిజిస్ట్రార్ సత్యనారాయణపై అభియోగం రుజువు కావడంతో సస్పెండ్ చేశారు. ఛార్జిషీటు కూడా నమోదు చేశారు. అయితే అతనిని మళ్లీ సర్వీసులోకి తీసుకున్నారు.
సిబ్బంది పాత్ర కీలకం
రిజిస్ట్రేషన్ సమయంలో దస్త్రాలను దాఖలు చేసినప్పుడు వాటి పరిశీలనకు డేటా ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్లు చెక్ స్లిప్లను కొడతారు. అవి రెడ్మార్క్తో చూపిస్తూ కర్సర్ ముందుకు వెళ్లకుండా ఆగి ఉంటుంది. ఈ సమయంలో సిబ్బంది సాఫ్టువేర్లో అంకెలను మార్చి నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు వెళ్లేలా సహకరిస్తున్నారు. ఈ రకంగా ఆక్రమించిన భూములను మరొకరికి అమ్మినట్లు దస్తావేజులు సృష్టిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..