logo

మెయిన్స్‌లో శశి విజయ దుందుభి

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలతో విజయ దుందుభి మోగించారని శశి విద్యా సంస్థల ఛైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ తెలిపారు.

Published : 10 Aug 2022 04:52 IST

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలతో విజయ దుందుభి మోగించారని శశి విద్యా సంస్థల ఛైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ తెలిపారు. జి.ఎం.ఎం. ప్రభాష్‌ 99.8 పర్సంటైల్‌, ఆర్‌.ఎస్‌.ఎన్‌ హర్షవర్థన్‌ 99.7 పర్సంటైల్‌, కె.భరత్‌కుమార్‌ 99.67, టి.హేమకార్తికేయ 99.66, కె.తారక్‌శ్రీరామ్‌ 99.64 పర్సంటైల్‌ కైవసం చేసుకున్నారన్నారు. 20 మంది 99 పర్సంటైల్‌ పైన సాధించారన్నారు. వివిధ ఆలిండియా కేటగిరీల్లో 500లోపు 5 ర్యాంకులు, వెయ్యిలోపు 14 ర్యాంకులు, రెండువేల లోపు 30 ర్యాంకులు, అయిదు వేలలోపు 69 ర్యాంకులు, 10వేల లోపు 115 ర్యాంకులు, 20 వేల లోపు 209 ర్యాంకులు పొందారన్నారు. సుమారు 400 పైగా విద్యార్థులు నిట్‌, ఐఐఐటీ, జీఎఫ్‌టీఐలో సీట్లు సాధించగలరన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయనతో పాటు శశి విద్యా సంస్థల వైస్‌ ఛైర్మన్‌ బూరుగుపల్లి లక్ష్మీసుప్రియ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని