ఇంకా అంతుచిక్కలేదు!
2020 డిసెంబరు 5.. ఏలూరు నగర వాసులు ఎప్పటిలాగే దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోయారు.
రెండేళ్లయినా వెలుగుచూడని కారణాలు
ఆ 14 రోజులూ నగరవాసులకు ఆందోళనే
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు (పాత చిత్రం)
2020 డిసెంబరు 5.. ఏలూరు నగర వాసులు ఎప్పటిలాగే దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇంతలో ఒక్కసారిగా కలవరం. ఉన్నట్టుండి కిందపడిపోతున్నారంట.. కాళ్లూ చేతులూ కొట్టుకుంటున్నారంట.. నోటి వెంట నురగలు వస్తున్నాయంట.. ఎవరి నోటి వెంట విన్నా ఇవే మాటలు. మొదటి విడత కరోనా కోరల్లో చిక్కుకుని అప్పుడప్పుడే కోలుకుంటున్న నగర ప్రజలకిది మళ్లీ అశనిపాతం. మొదట తూర్పువీధిలో ఇద్దరు ముగ్గురు పడిపోయారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మరికొద్ది నిమిషాల్లో నగరంలోని పలుచోట్ల ఇళ్ల వద్ద, వీధుల్లో ఉన్నట్టుండి కిందపడిపోవడం చూసి ప్రజల గుండె ఘొల్లుమంది. అసలేం జరుగుతోంది.. ఎందుకు పడిపోతున్నారో తెలియక ఉక్కిరి బిక్కిరయ్యారు. ఈ ఘటన జరిగి రెండేళ్లు పూర్తవుతోంది. అయినా ఆ అంతు చిక్కని వ్యాధికి అధికార యంత్రాంగం సరైన కారణాలను కనిపెట్టలేకపోయింది. నీటి కలుషితం వల్లే ఈ విధంగా జరిగిందని దిల్లీ ఎయిమ్స్ నివేదిక అందజేసింది. కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు కనుగొన్నామని.. అందుకే ఇలా జరిగి ఉంటుందని పుణేకు చెందిన అధ్యయన సంస్థ నివేదించింది. అంతిమంగా ఇదీ కారణమని ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించకపోవడం గమనార్హం.
ఇతర ప్రాంతాల్లోనూ.. నగరంలో కనిపించిన వ్యాధి లక్షణాలు ఆ తరువాత ఇతర ప్రాంతాల్లోనూ వెలుగు చూడటంతో నీటి కాలుష్యం కారణంగా జరిగిందని అంతా అనుకున్నారు. డిసెంబరు 5 నుంచి 14 రోజులు వరుసగా నగరంలో కేసులు నమోదు కాగా.. నెల వ్యవధిలో దెందులూరు మండలం కొమరేపల్లిలో 30 మంది ఇవే లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. భీమడోలు మండలం పూళ్లలో 20 మంది అవస్థలుపడ్డారు.
ప్రభుత్వాసుపత్రి కిటకిట.. అంతుచిక్కని వ్యాధి ఒక్క రోజు వ్యవధిలో నగరాన్ని చుట్టేసింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రి కిటకిటలాడింది. డీసీహెచ్ఎస్ ఏవీఆర్ మోహన్ ఆధ్వర్యంలో సీనియర్ వైద్య నిపుణుడు పోతుమూడి శ్రీనివాసరావు తదితర వైద్యులు సేవలు అందించారు. బాధితులకు ప్రత్యేక వార్డు కేటాయించారు. నగరంలోని 64 ప్రాంతాల్లో 615 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. విద్యానగర్కు చెందిన ఒకరు మృతి చెందారు.
ఉన్నట్టుండి పడిపోయా.. ‘ఆ రోజు సాయంత్రం డాబాపై ఉన్నా. ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయా. ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు మూడు గంటల వరకు ఏం జరిగిందో తెలియలేదు. మూర్ఛ మాదిరి వచ్చి కొట్టుకున్నానని.. నోటి వెంట నురగ వచ్చిందని మా అమ్మ చెప్పింది. ఇప్పుడు బాగానే ఉంది’ అని దక్షిణపు వీధికి చెందిన కల్లపల్లి వినయ్ తెలిపారు.
నీరు కలుషితంగా వచ్చేది.. ‘అప్పట్లో తాగునీరు కలుషితంగా వచ్చేది. మా ఇంట్లో అద్దెకు ఉంటున్నవారు ఆ నీటినే తాగేవారు. ఒకామె కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స అందించారు. అలా అందరికీ అవుతుందేమోనని ఆందోళన చెందాం’ అని దక్షిణపు వీధికి చెందిన సీహెచ్ మూర్తి రాజు వివరించారు.
ఎప్పటికప్పుడు సర్వే.. ‘నగర పరిధిలో ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తున్నాం. ఫిట్స్, కడుపునొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో ఎవరూ బాధ పడటం లేదు. అప్పుడు సేకరించిన నమూనాలకు సంబంధించి ఆయా సంస్థలు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి’ అని డీఎంహెచ్వో డాక్టరు బి.రవి వివరించారు.
ఇంకా నేర్చుకోని పాఠాలు
అంతు చిక్కని వ్యాధి ప్రబలిన సమయంలో శ్యాంపిల్స్ సేకరించి మనకు ల్యాబ్లు అందుబాటులో లేనందున దిల్లీ, హైదరాబాద్లకు పంపించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లాకొక ప్రయోగశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రెండేళ్లయినా ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు సరికదా ఆ ఊసే లేకుండాపోయింది. దిల్లీ, మంగళగిరి ఎయిమ్స్, హైదరాబాద్ ఎన్ఐఎన్.. ఇలా ఐదు ప్రధాన సంస్థలకు చెందిన ప్రతినిధులు ఇక్కడికి వచ్చి నమూనాలను సేకరించారు. ఆసుపత్రిలో బాధితుల వద్ద నుంచి, ప్రభావిత ప్రాంతాల్లో కూరగాయలు, నీరు.. ఆ ప్రాంతాల్లోని ఇతర వ్యక్తుల నుంచీ కొన్ని నమూనాలను సేకరించారు.
అంతంత మాత్రంగానే పారిశుద్ధ్యం
నగరంలో నేటికీ పారిశుద్ధ్య పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అంతుచిక్కని వ్యాధి వచ్చిన ప్రాంతాల్లోనూ కొన్నిసార్లు డ్రెయిన్లు, పూడిక తీత పనులు సక్రమంగా జరగడంలేదని స్థానికులు చెబుతున్నారు. చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయని అంటున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కృష్ణా కాలువ ప్రక్షాళన, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు వంటి కార్యక్రమాలు చేపట్టినా పూర్తి స్థాయిలో జరగలేదు. వ్యాధి బారిన పడిన నగర వాసులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా.. అప్పట్లో హడావుడి చేసి తరువాత పట్టించుకోకుండా వదిలేశారని పలువురు పెదవి విరుస్తున్నారు. కాగా, తాగునీటి సరఫరాలో మాత్రం ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోడల్ పోలింగ్ కేంద్రం పరిశీలన
[ 26-04-2024]
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 227 పోలింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ఎస్. ఏ శ్రీరామన్ శుక్రవారం పరిశీలించారు. -
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ