ఆగని మోసాలు.. తేలని లెక్కలు!
కైకలూరు మండలం శృంగవరప్పాడులో 20 సంఘాలకు చెందిన రుణ వాయిదాల సొమ్ము రూ.20 లక్షలను స్థానిక వీవోఏ పక్కదారి పట్టించిన వ్యవహారం ఇటీవల వెలుగు చూసింది.
మహిళల సొమ్ము అక్రమార్కుల పాలు
* కైకలూరు మండలం శృంగవరప్పాడులో 20 సంఘాలకు చెందిన రుణ వాయిదాల సొమ్ము రూ.20 లక్షలను స్థానిక వీవోఏ పక్కదారి పట్టించిన వ్యవహారం ఇటీవల వెలుగు చూసింది. కొత్త రుణం కోసం ఓ బృందం సభ్యులు బ్యాంకుకు వెళ్లిన సందర్భంలో ఈ అక్రమం బయటపడింది.
* వీరవాసరం మండలంలో ఓ గ్రామానికి చెందిన స్వయంసహాయక బృందం నాయకురాలు వాయిదాల సొమ్ము చెల్లింపుల్లో చేతివాటం ప్రదర్శించారు. సొమ్మును బ్యాంకులో జమచేయకుండా సుమారు రూ. 3.80 లక్షలు స్వాహా చేయడంతో సంఘ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల ఆమె రూ.లక్ష తిరిగి జమ చేసినట్లు సమాచారం.
* పాలకోడేరు మండలం గరగపర్రులో ఓ గ్రామ సంఘానికి చెందిన నగదు నిల్వల్లో అవకతవకలు జరిగాయి. సుమారు రూ.31 లక్షల మేర నగదు నిల్వల్లో కొంత మొత్తాన్ని సంబంధిత వీవోఏ, ఓబీలు కాజేసినట్లు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టారు.
వీరవాసరం, చింతలపూడి, న్యూస్టుడే: మహిళా స్వయం సహాయక సంఘాల లావాదేవీల్లో తరచూ మోసాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ గ్రామ సంఘం నిధులను వీవోఏ కాజేసిన వ్యవహారం పాలకోడేరు మండలంలో వెలుగుచూసింది. వాయిదాల సొమ్ము బ్యాంకులో జమచేయకుండా స్వాహా చేయడం, స్త్రీ నిధి రుణాల మళ్లింపు వంటి వ్యవహారాలపై ఇరు జిల్లాల్లో తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి.
గ్రామాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీల నిర్వహణకు గ్రామ సంఘ సహాయకులను(వీవోఏ) నియమించారు. 30 నుంచి 50 సంఘాల బాధ్యతను ఒక వీవోఏకు అప్పగించారు. ఆయా సంఘాలపై పర్యవేక్షణ, అర్హులకు రుణాలు అందించే బాధ్యతవారిపై ఉంటుంది. దీనికి ప్రతి నెలా ప్రభుత్వం రూ.8 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తోంది. గ్రామ సమాఖ్య ఆర్థిక లావాదేవీలు బాగుంటే దాని నుంచి అదనంగా మరో రూ.2 వేలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. సంఘాల సభ్యులు ప్రతి నెలా సమావేశాలకు హాజరు కాకపోవడం.. వచ్చినా నగదు నిల్వలపై ఆరా తీయకపోవడంతో మోసాలకు తావిచ్చినట్లవుతోంది. మహిళా బృందాలు కొత్త రుణాలు పొందేటప్పుడు వీవోఏలు కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంటారు. గ్రామ సంఘాల సభ్యులు పొదుపు చేసిన నగదు నుంచి రుణం పొందాలంటే వారి అనుమతి తీసుకోవాల్సిందే. ఇలాంటి సందర్భాల్లోనూ వారికి కొంత మొత్తాన్ని ముట్టజెప్పక తప్పని పరిస్థితి. ఒక్కో గ్రామ సంఘానికి ముగ్గురు ఓబీలు ఉంటారు. నగదు చెల్లింపులు, చెక్కులు, రికార్డుల నిర్వహణ బాధ్యత వారిపై ఉంటుంది. వీవోఏలు కొందరు ఓబీలతో కుమ్మక్కవ్వడం, లేదా ఓబీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అంతా తామై వ్యవహరిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
బ్యాంకు సిబ్బంది పాత్రపై సందేహాలు
బ్యాంకు అధికారుల సహకారంతో వీవోఏలు బృందాల సభ్యులతో సంబంధం లేకుండా వారి ఖాతాల్లో నగదు మాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సభ్యుల సంతకాలు లేకుండానే సీఏ, వీవోఏలు నగదు డ్రా చేస్తుంటే బ్యాంకు సిబ్బంది ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రశ్నార్థంగా మారింది.
పర్యవేక్షణ లేమే కారణం
వివిధ సంఘాల్లో నగదు అవకతవకలపై విచారణ జరుగుతోంది. వీరవాసరంలో బృంద నాయకురాలు నగదు దుర్వినియోగానికి పాల్పడినట్లు సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గరగపర్రు గ్రామ సంఘంలో వీవోఏ అవకతవకలకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. ఆ సంఘానికి సంబంధించి రూ.4.8 లక్షలను సంబంధిత వీవోఏ సొంతానికి వాడుకున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఓబీల పర్యవేక్షణ లేకపోవడం వల్లే నిధులు దుర్వినియోగమవుతున్నాయి.
వేణుగోపాల్, డీఆర్డీఏ పీడీ, భీమవరం
గరగపర్రులో మొత్తం నాలుగు గ్రామ సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 104 మహిళా బృందాలు ఉన్నాయి. వీటికి సంబంధించి సుమారు రూ. 43.50 లక్షలు నగదు నిల్వలు ఉన్నట్లు సభ్యులు తెలిపారు. వీటిలో రెండు సంఘాల నగదు నిల్వల్లో తేడాలు ఉన్నట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోడల్ పోలింగ్ కేంద్రం పరిశీలన
[ 26-04-2024]
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 227 పోలింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ఎస్. ఏ శ్రీరామన్ శుక్రవారం పరిశీలించారు. -
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్