పంచదార అరకొర
జిల్లాలోని బియ్యం కార్డుదారులకు రాయితీతో కూడిన నిత్యావసరాల సరకులు పంపిణీ ప్రారంభించారు. గతంలో పలు రకాలు పంపిణీ చేసేవారు. కొంతకాలం నుంచి మూడు రకాలే ఇస్తుండగా.. అవీ అరకొరగానే అందిస్తున్నారు.
నాసిరకంగా కందిపప్పు
ఏలూరు అర్బన్, న్యూస్టుడే
ఎండీయూ వాహనం వద్ద సరకులు పొందుతున్న కార్డుదారులు
జిల్లాలోని బియ్యం కార్డుదారులకు రాయితీతో కూడిన నిత్యావసరాల సరకులు పంపిణీ ప్రారంభించారు. గతంలో పలు రకాలు పంపిణీ చేసేవారు. కొంతకాలం నుంచి మూడు రకాలే ఇస్తుండగా.. అవీ అరకొరగానే అందిస్తున్నారు.
ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం, కందిపపు, పంచదార సరఫరా చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 6.39 లక్షల బియ్యం కార్డుదారులు ఉన్నారు. కార్డులోని ఒక్కో సభ్యునికి ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఒక్కో కార్డుపై కిలో కందిపప్పు, అరకిలో పంచదార అందజేస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ డీలర్లకు బియ్యాన్ని సరిపడా సరఫరా చేయగలిగారు. కానీ పంచదార సగం కూడా సరఫరా కాలేదు. స్టాకు తగినంత అందుబాటులో లేకపోవడం ఒక కారణం కాగా, ఎక్కువ శాతం మంది డీలర్లు ఆర్థిక పరిస్థితుల కారణంగా డీడీలను చెల్లించలేకపోయారు. ఫలితంగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు అరకొరగా సరఫరా అయింది. బయట మార్కెట్లో కిలో పంచదార రూ.40 నుంచి రూ.45 వరకు విక్రయిస్తుండగా ఎండీయూ వాహనాల్లో కార్డుదారులకు అర కిలో రూ.17కు పంపిణీ చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది పంచదార కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తుండగా ఒక్కో కార్డుపై నెలకు అరకిలో మాత్రమే అందజేస్తున్నారు.
* బియ్యం కార్డుదారులకు రాగులు, జొన్నలు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో వీటి సరఫరాకు అనువైన పరిస్థితుల గురించి సర్వే కూడా చేశారు. ఎక్కువ శాతం మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచినా కొన్ని జిల్లాలకు మాత్రమే వీటిని పరిమితం చేశారు.
రుచీపచీ ఉండటం లేదు
పౌరసరఫరాల సంస్థ ద్వారా సరఫరా చేసే కందిపప్పు నాసిరకంగా ఉండటంతో కొనేందుకు కార్డుదారులు ఆసక్తి చూపడం లేదు. కొన్ని నెలల క్రితమే టెండర్ల ద్వారా ప్రభుత్వం కంది పప్పు కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ ఉంచింది. అదికాస్తా పాడైపోయింది. ఇటువంటి పప్పును కొనుగోలు చేసి పొయ్యిపై పెడితే ఉడకడానికి గంటలకొద్దీ సమయం పడుతోందని, తీరా ఉడికిన తర్వాత రుచీపచీ ఉండటం లేదని పలువురు కార్డుదారులు ఆరోపిస్తున్నారు. కొద్దిమంది మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో ధర రూ.128 నుంచి రూ.135 వరకు ఉండగా.. ఎండీయూ వాహనాల ద్వారా కార్డు దారులకు కిలో రూ.67 లకు పంపిణీ చేస్తున్నారు.
తూకాల్లో తేడాలు
ప్రతినెలా కార్డుదారులకు నిత్యావసరాలు పంపిణీ జరిగేటప్పుడల్లా ఎంఎల్ఎస్ పాయింట్లలో తూకాల్లో తేడాలు రావడం షరామామూలైంది. ఒక్కో బియ్యం బస్తాలో అరకిలో నుంచి కిలో వరకు తగ్గుతోంది. దీనిపై రేషన్ డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద పలుమార్లు ధర్నాలు చేశారు. ఇటువంటివి జరిగినప్పుడు అధికారులు సమస్యకు తగిన పరిష్కార చర్యలు చేపడతామని అంటున్నారేతప్ప పరిష్కారం చూపడం లేదు.
అన్ని సరకులు పంపిణీ చేస్తాం
‘జిల్లాలోని కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు, పంచదార సరకులను పంపిణీ చేస్తాం. ప్రస్తుతానికి పంచదార 30 శాతమే జిల్లాకు దిగుమతి అయింది. ఒకటి రెండు రోజుల్లో దశల వారీగా సరఫరా అవుతుంది. వచ్చిన సరకు వచ్చినట్లుగా డీలర్లకు పంపిస్తున్నాం. అంగన్వాడీ బాలలకు, ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రాగిపిండి సరఫరా చేస్తున్నాం. రాగులు, జొన్నలు కొన్ని జిల్లాలకు మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది’ అని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు మంజుభార్గవి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..