గెలుపు మలుపులై... లక్ష్యసాధనకు సిదం
గత నెలలో తిరుపతిలో నిర్వహించిన మహిళా వాలీబాల్ సీఎం కప్ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఇందులో కెప్టెన్తో సహా తొమ్మిది మంది క్రీడాకారిణులు జంగారెడ్డిగూడెం ప్రాంతం వారే.
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో జంగారెడ్డిగూడెం ప్రాంత క్రీడాకారిణుల ప్రతిభ
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే
గత నెలలో తిరుపతిలో నిర్వహించిన మహిళా వాలీబాల్ సీఎం కప్ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఇందులో కెప్టెన్తో సహా తొమ్మిది మంది క్రీడాకారిణులు జంగారెడ్డిగూడెం ప్రాంతం వారే. వీరంతా పట్టణంలోని మొటపర్తి శివరామ వరప్రసాద్ క్రీడా ప్రాంగణంలో విశ్రాంత పీడీ ముదునూరి నరసింహరాజు వద్ద శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారి క్రీడా ప్రస్థానం.. భవిష్యత్తు లక్ష్యాలను ఇలా వివరించారు.
పోలీస్ ఉద్యోగం సాధిస్తా..
‘సీఎం కప్ గెలుపొందిన జట్టుకు నాయకత్వం వహించడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు జాతీయ స్థాయి పోటీల్లో 13 సార్లు పాల్గొన్నా. 2017లో బంగారు పతకం సాధించా. స్కూల్ గేమ్స్ అండర్-17 విభాగంలో కాంస్య పతకం దక్కింది. పోలీసు ఉద్యోగం సాధిస్తాను’ అని తగరం దేవి తెలిపారు.
జాతీయ స్థాయిలో రాణించాలని..
‘వాలీబాల్ క్రీడలో ఇప్పటి వరకు ఒక బంగారు, రెండు వెండి, కాంస్య పతకాలు సాధించా. మూడు సార్లు రాష్ట్ర జట్టు తరఫున ఆడా. నన్నయ్య విశ్వవిద్యాలయం జట్టు క్రీడాకారిణిగా ఉన్నా. జాతీయ క్రీడాకారిణిగా రాణించాలన్నది నా లక్ష్యం’అని బలగా ఢిల్లేశ్వరి చెప్పారు.
రాష్ట్ర జట్టుకు మూడు సార్లు ప్రాతినిధ్యం
‘సీఎం కప్ సాధించిన జట్టులో సభ్యురాలినవడం సంతోషంగా ఉంది. అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదగాలన్నది నా ఆశయం. ఇప్పటి వరకు మూడు పర్యాయాలు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాను’ అని కలగర జయశ్రీ పేర్కొన్నారు.
జట్టులో కీలకంగా..
‘సీఎం కప్ గెలుపొందిన జట్టులో కీలక సభ్యురాలిని. ఇప్పటి వరకు ఐదు సార్లు జాతీయ స్థాయి, మూడు సీఎం కప్ పోటీల్లో ఆడా. ఎనిమిదో తరగతి నుంచే వాలీబాల్ ఆడటం ప్రారంభించా. జాతీయ క్రీడాకారిణిగా రాణించాలన్నది నా లక్ష్యం’ అని ఎం.శేషభువనేశ్వరి పేర్కొన్నారు.
ఐపీఎస్ సాధిస్తా
‘క్రీడలతో పాటు చదువులోనూ రాణించి ఐపీఎస్ అవ్వాలన్నది నా లక్ష్యం. 2018 నుంచి వాలీబాల్ ఆడుతున్నా. నాలుగు సార్లు జూనియర్ నేషనల్స్, మూడు సీఎం కప్లు, మూడు యూత్ నేషనల్స్, రెండు సార్లు సీనియర్ నేషనల్స్లో ఆడా. ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాను’ అని ఎస్.స్టెల్లా చెప్పారు.
మంచి వేదిక
‘జంగారెడ్డిగూడెంలో క్షత్రియ సేవా సమితి సహకారంతో అందిస్తున్న శిక్షణ మాకు మంచి వేదికగా ఉంది. ఒక క్రీడా మైదానం నుంచి రాష్ట్ర స్థాయి క్రీడాకారిణులు తొమ్మిది మంది ఉండటం ఆనందంగా ఉంది. బీపీఈడీ చదువుతున్నా. రెండు నేషనల్స్, మూడు సార్లు యూనివర్సిటీ జట్టు తరఫున ఆడాను’ అని కె.నాగమల్లేశ్వరి వెల్లడించారు.
రోజూ ఐదు గంటలకు పైగా సాధన
‘క్రీడా కోటాలో పోలీసు ఉద్యోగం సాధించాలన్నది నా ప్రధాన ఆశయం. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆరు పర్యాయాలు పాల్గొన్నా. రోజూ ఐదు గంటలకుపైగా సాధన చేస్తా. అప్ల్యాండ్ క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు ఇస్తున్న సహకారం వల్లే రాణించగలుగుతున్నాను’ అని గుడివాక జయశ్రీ వివరించారు.
ఆర్మీలో చేరతా..
‘సీఎం కప్ గెలుపొందిన జట్టు క్రీడాకారిణి అయినందుకు గర్వపడుతున్నా. ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనేది నా లక్ష్యం’అని మానికల సుధారాణి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..