పరిశోధనలో ముందంజ
మనిషి నిప్పును కనుగొన్న నాటి నుంచి నేటి వరకు జీవన ప్రమాణాలు ఎంతగానో మార్పు చెందాయి. విస్తృత స్థాయిలో పరిశోధనలు వాటి ద్వారా పుట్టుకొచ్చే ఆవిష్కరణలే ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్నాయి.
జాతీయ స్థాయిలో గుర్తింపు
ఏపీ నిట్
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే: మనిషి నిప్పును కనుగొన్న నాటి నుంచి నేటి వరకు జీవన ప్రమాణాలు ఎంతగానో మార్పు చెందాయి. విస్తృత స్థాయిలో పరిశోధనలు వాటి ద్వారా పుట్టుకొచ్చే ఆవిష్కరణలే ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. రానున్న రోజుల్లో దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టేందుకు శాస్త్రవేత్తలు చేపడుతున్న పలు పరిశోధనలు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం ఏపీ నిట్కు చెందిన ఆచార్యులు, పరిశోధన విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు చేస్తున్నారు. వీరు చేపట్టిన ప్రాజెక్టులకు జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు తమ పరిశోధనలలో పురోగతి సాధించేందుకు ప్రోత్సాహకాలు సైతం అందుతుండటం విశేషం.
అయస్కాంత లక్షణాలపై శోధన
ఏపీ నిట్లో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా విధులు నిర్వహిస్తున్న మాచవరపు రాముడు స్పింట్రోనిక్స్ అనువర్తనాలకు మాంగనీస్ ఆధారిత యాంటీఫెరో మ్యాగ్నెట్ హ్యూస్లర్ పదార్థాల అభివృద్ధిపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా పదార్థాల అయస్కాంత లక్షణాలను, స్పింట్రోనిక్స్లో సాధ్యమయ్యే అనువర్తనాలు మెరుగుపరిచేందుకు ప్రతి మూలకం పాత్రను క్షుణ్ణంగా పరిశోధిస్తున్నారు. ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో భారత ప్రభుత్వ ఆధీనంలోని సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డు రూ.25 లక్షల నిధులు కేటాయించింది. వీటిని వినియోగించి, స్పింట్రోనిక్స్ అప్లికేషన్లకు అనువైన కొత్త హ్యూస్లర్ యాంటీఫెరో మాగ్నెటిక్ మెటీరియల్ రూపొందించాల్సి ఉంది.
పేపర్ ప్రజెంటేషన్కు నగదు ప్రోత్సాహకం
మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థి పార్థసారథి పదార్థాల(మెటీరియల్స్)పై నిర్వహిస్తున్న పరిశోధనలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మెటలర్జికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ విద్యార్థి పేపర్ ప్రజెంటేషన్ మెచ్చి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. మెకానికల్ ఎల్లోయింగ్ ఆఫ్ హై ఎంట్రోపి ఎల్లాయిస్పై ఇతను పరిశోధనలు చేస్తున్నారు. 1500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తట్టుకునే విధంగా పదార్థాల రూపకల్పనకు కృషి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తాడేపల్లిగూడెంలో జనసేనాని సభ
[ 28-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లిగూడెం గొల్లగూడెం సెంటర్ వద్ద జనసేన అధినేత పవన్కల్యాణ్ బహిరంగ సభ నిర్వహించనున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. -
జిల్లా ఓటర్లు 16,37,430
[ 28-04-2024]
జిల్లాలో ఇప్పటి వరకు 16,37,430 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో పురుషులు 7,99,241 మంది, మహిళలు 8,38,063, ఇతరులు 126 మంది ఉన్నారు. -
జగన్ ఏలుబడి.. బాగుపడని బాలబడి!
[ 28-04-2024]
ఒక్కటంటే ఒక కేంద్రం బాగుందని చెప్పలేం. చిన్నారుల సంక్షేమానికి భరోసా మాది. వారికి మావయ్యనంటూ సీఎం జగన్ ప్రకటనలిస్తున్నా..అవన్నీ ఉత్తమాటలే. -
కాలయాపన చేసి అప్పుల్లో ముంచారు
[ 28-04-2024]
సొంతింటి కల సాకారమే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేసింది. ఈ లబ్ధిదారులకు నేటికీ బిల్లులు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. -
వైకాపా నాయకులవి చిల్లర రాజకీయాలు
[ 28-04-2024]
వైకాపా నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ.. మళ్లీ గద్దె నెక్కాలని చూస్తున్నారని.. ఈసారి ప్రజలెవరూ నమ్మరని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. -
జగనన్నా... అన్నింటికీ ఎగనామమే!
[ 28-04-2024]
మాది రైతు ప్రభుత్వం.. మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం.. ఆర్బీకేల ద్వారా రైతుపరమైన కార్యకలాపాలతో సమూల మార్పులకు నాంది పలికాం.. సీఎం జగన్మోహన్రెడ్డి మాటలివి. -
వైకాపా నాయకులవి చిల్లర రాజకీయాలు : చింతమనేని
[ 28-04-2024]
వైకాపా నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ.. మళ్లీ గద్దె నెక్కాలని చూస్తున్నారని.. ఈసారి ప్రజలెవరూ నమ్మరని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. -
అధికార పార్టీ ప్రలోభాల పర్వం
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార వైకాపా ముందుగానే ప్రలోభాలకు తెరలేపింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక పోలింగ్కు ఎక్కువ సమయం ఉండటంతో అభ్యర్థులు గ్రామాల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, పరామర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. -
దొరికినకాడికి దోచుకోవడమే!
[ 28-04-2024]
ఆయనదో ప్రత్యేక శైలి. మాటలు సంస్కరణల మైలురాళ్లు దాటుతాయి. చేతల్లోకి వస్తే ఆయనంత అవినీతిపరుడు మరొకరు ఉండరని చెబుతుంటారు. పురపాలక సంఘంలో ఎన్ని విధాలా అక్రమాలకు పాల్పడవచ్చో ఆయనకు తెలిసిన విధంగా మరొకరికి తెలియదు. -
పశ్చిమ ఓటర్లు 14,72,923
[ 28-04-2024]
పశ్చిమ గోదావరిలో ఓటర్ల సంఖ్య 14,72,923కు చేరింది. సవరణల అనంతరం గత జనవరిలో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం 14,61,338 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రజల పక్షాన పోరాడితే 25 కేసులు పెట్టారు: నిమ్మల
[ 28-04-2024]
జగన్ ప్రభుత్వంలో ప్రజల పక్షాన సమస్యలపై పోరాడినందుకు తనపై 25 కేసులు పెట్టారని, కక్షసాధింపునకు ఇదే నిదర్శనమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
విలీనం..బతుకు ‘చక్ర’బంధం!
[ 28-04-2024]
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే తమ కష్టాలు తీరి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ప్రయోజనాలు అందుతాయని ఆశ పడ్డారు ఆర్టీసీ సిబ్బంది. -
మూడేళ్లూ మందగమనమే
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వం స్థానిక సంస్థలను నామమాత్రంగా మార్చేసింది. రాజ్యాంగం ద్వారా లభించిన అధికారాలకూ సంకెళ్లు వేసింది. ఫలితంగా మూడున్నర సంవత్సరాల్లోనే జడ్పీ, ఇతర స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. -
జగన్ అరాచక పాలనపై ఎన్డీయే తరఫున ఛార్జిషీట్ వేస్తాం: పితాని
[ 28-04-2024]
అయిదేళ్ల అవినీతి, అరాచక పాలనపై ఎన్టీయే తరఫున ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నామని కూటమి ఆచంట అసెంబ్లీ అభ్యర్థి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ అన్నారు. కొమ్ముచిక్కాలలో శనివారం తెదేపా, జనసేన, భాజపా ముఖ్యనాయకులతో కలిసి జగన్ అరాచక పాలన అంతం.. ఎన్టీయే పంతం అని జగనాసురుని రక్తచరిత్ర కరపత్రాలను ఆవిష్కరించి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
అంకుర సంస్థలు పదేళ్లలో 300రెట్లు పెరిగాయ్: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
-
హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు