రైతు బజార్లకు పైసా విదల్చని జగన్
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది.
నిర్వహణ గాలికొదిలిన వైకాపా సర్కారు
కొత్త నిర్మాణాలపై తాత్సారం
తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన మినీ బజార్లకు గ్రహణం
ఈనాడు, భీమవరం, న్యూస్టుడే, మొగల్తూరు
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. కొత్తవి నిర్మించక పోగా ఉన్నవాటి నిర్వహణ గాలికొదిలేయటంతో కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయి. చివరకు తెదేపా హయాంలో మొదలు పెట్టి తుది దశకు వచ్చిన నిర్మాణాలను అయిదేళ్లుగా పూర్తి చేయకుండా తాత్సారం చేసింది.
అధికారులు కళ్లు మూసుకున్నారా
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు బజార్లలో నాణ్యత అరకొరగానే ఉంటోంది. ఉల్లి, క్యారెట్, టమాట, బంగాళాదుంప, చిక్కుడు, బీట్రూటు ఇలా ఏ కూరగాయలైనా నాసిరకంగానే ఉంటున్నాయి. ధరలు తగ్గినా బోర్డుల్లో మాత్రం తగ్గించకుండా మాయ చేస్తున్నారు. ఇటీవల ఏలూరు పత్తేబాద రైతు బజార్లో మార్కెట్ ధరల కంటే ఎక్కువగా విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందాయి.
నిధులు ఇస్తే ఒట్టు: ఉమ్మడి జిల్లాలో వైకాపా అధికారం చేపట్టాక రైతు బజార్లకు పైసా నిధులు కూడా ఇవ్వలేదు. తెదేపా నిర్మాణం చేపట్టిన రైతు బజార్లను మొదలు పెట్టేందుకు కూడా వైకాపా సర్కారుకు మనసు రాలేదు. కలిదిండిలో రూ.36 లక్షలతో నిర్మాణం 80 శాతం పూర్తయింది. తెదేపా చేపట్టిందన్న అక్కసుతో గాలికొదిలేశారు.
చిన్నపాటి వర్షానికే నీట మునిగి పోయే ఏలూరు పత్తేబాద రైతు బజారు ఇది. మెరక చేసేందుకు టెండర్లు పిలిచినా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. వైకాపా ప్రభుత్వంపై గుత్తేదార్లకు ఉన్న నమ్మకమిది.
అవస్థలు ఇవి
- నిత్యం వందలాది మంది వచ్చే ఏలూరులోని పత్తేబాద రైతు బజారుకు కనీస సౌకర్యాలు లేవు. స్థలం ఇరుకు. పార్కింగ్ సౌకర్యం లేక రహదారిపై వాహనాలునిలిపేస్తున్నారు.
- ఏ రైతు బజారులోనూ డిజిటల్ ధరల పట్టికలు వినియోగంలో లేవు. ఆర్వో ప్లాంట్లు పని చేయటం లేదు. మరుగుదొడ్ల ఊసే లేదు.
గత తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన మొగల్తూరులోని మినీ రైతుబజారుని వైకాపా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాకుండా ఇలా వదిలేసింది.
తెదేపా ప్రారంభించిందని అక్కసా..
తెదేపా హయాంలో మండలానికొకటి చొప్పున ఉమ్మడి జిల్లాలో 33 మినీ రైతు బజార్లను నిర్మిస్తే.. వైకాపా ప్రభుత్వ అసమర్థతో వాటిలో ప్రస్తుతం ఎలాంటి విక్రయాలు జరగటం లేదు. తెదేపా ప్రారంభించిన వాటిని వినియోగంలోకి తీసుకురావటం ఎందుకు అని వీటిని నిరుపయోగంగా మిగిల్చింది.
ఉమ్మడి జిల్లాలోని తణుకు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం వంటి కీలక పట్టణాల్లో అసలు రైతు బజార్లే లేవంటే ఇంతకన్నా దైన్యం ఏముంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?
[ 02-05-2024]
పాలకొల్లు నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్కు 10 రోజులు మాత్రమే ఉండటంతో ఆయా కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
జగన్ జమానాలో దగా పడ్డ కౌలురైతు
[ 02-05-2024]
విపత్తులకు పంట దెబ్బతిన్నా అందని పరిహారంః ప్రతి రైతుకూ చెబుతున్నా. అధికారంలోకి రాగానే గుర్తింపు కార్డులు ఇస్తాం. వడ్డీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా చేస్తాం. వారికి అన్ని రకాలుగా తోడుంటాం. -
జగనొస్తే నరకం చూడాల్సిందే!
[ 02-05-2024]
ముఖ్యమంత్రి జగన్ బుధవారం ఏలూరు లో నిర్వహించిన సిద్ధం సభ నగర ప్రజలకు నరకం చూపించింది. -
నీకు కప్పం తప్ప ఇల్లు కట్టలేకపోయాం!
[ 02-05-2024]
ఇనుముతో సమానంగా ఇసుక ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు భవన నిర్మాణానికి వెనకడుగు వేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 12 ఇసుక రీచ్లు ఉన్నాయి. -
ఈసురోమంటూ... ఏమిటి మాకీ బాధ
[ 02-05-2024]
ఒకదాని తర్వాత ఒకటిగా ఆకాశాన్నంటిన ధరల్లో నదుల్లో ఉండే ఇసుకను తీసుకెళ్లి కొండమీద కూర్చోబెట్టిన జగన్ ప్రభుత్వంలో సొంతిల్లు అయ్యేపనికాదని మా ఇంటి నిర్మాణాన్ని సగంలో నిలిపివేశాం. -
రైల్వే గేటును ఢీకొన్న లారీ
[ 02-05-2024]
ఉంగుటూరు రైల్వే గేటును బుధవారం ఊక లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో పుణె నుంచి భువనేశ్వర్ వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు కొద్ది సేపు ఉంగుటూరులో నిలిచాయి. -
కల్యాణం.. వైభోగం
[ 02-05-2024]
పారిజాతగిరి ఆలయంలో బుధవారం పద్మావతి, గోదాదేవి సమేత శ్రీనివాసుని కల్యాణం వైభవంగా నిర్వహించారు. -
హామీల మోత.. కొర్రీలతో కోత!
[ 02-05-2024]
‘చదువు భారంగా మారకూడదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందినీ బడికి పంపండి. అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తాం.’ ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ ఇది. -
ఉప్పు రైతు బతుకు చేదు
[ 02-05-2024]
ఎలాంటి వంటకమైనా ఉప్పు లేనిదే రుచి ఉండదు. అది సాగు చేసే రైతు బతుకు మాత్రం చప్పగా మారింది. తరతరాలుగా దాన్నే నమ్ముకున్న వారి జీవితాలు కన్నీటి కడలిలో కరిగిపోతున్నాయి -
పథకాల బాకానే.. ప్రగతి ఊసేది
[ 02-05-2024]
సీఎం ఏలూరు సభలో పథకాల గురించి బాకాలుదటం తప్ప..జిల్లాకు చేసిన అభివృద్ధి గురించి నోరెత్తలేదు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం సాయంత్రం ఏలూరు అగ్నిమాపక కూడలిలో నిర్వహించిన ఈ సభంలో ఆయన చేసిన 40 నిమిషాల ప్రసంగంలో జిల్లా, నియోజకవర్గం గురించి నాలుగు మాటల్లేవు. -
అప్పు తీర్చే విషయంలో ఘర్షణ.. భర్త చేతిలో హతం
[ 02-05-2024]
తన మాట కాదన్నందుకు కట్టుకున్న భార్యను కడతేర్చిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో చోటుచేసుకుంది. -
ఓటర్లకు బిర్యానీ గాలం
[ 02-05-2024]
ఆచంట నియోజకవర్గంలో వైకాపా ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలతోపాటు ఓటర్లను కూడా రకరకాల ప్రలోభాలకు గురి చేస్తోంది. ఆచంట పరిధిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం ఆచంటలోని చినపేట, కొత్తూరు సెంటర్, కాపులపాలెం, బొంతువారిపాలెం, కోనపోతుగుంట, మానేవారిపాలెం, రావిగుంట, బాలంవారిపాలెం, కసరత్తుగుంట తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం
[ 02-05-2024]
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఉంటుందని భాజపా నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు -
జగన్ పాలనలో నిర్మాణ రంగం కుదేలు
[ 02-05-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని జనసేన భీమవరం నియోజకవర్గ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM