మంచి చేస్తానని ముంచేసి..
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10,500, ఆయా, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ.7,500 చెల్లించే వారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం కన్నా రూ.1000 అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నమ్మబలికారు.
అయిదేళ్లలో ఒక్క సమస్యా తీర్చని జగన్
అంగన్ వాడీ సిబ్బంది ఆవేదన
ఏలూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ సిబ్బంది నిరసన
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10,500, ఆయా, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ.7,500 చెల్లించే వారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం కన్నా రూ.1000 అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలో మాత్రమే రూ.వెయ్యి పెంచి, మిన్నకున్నారు. తెలంగాణలో రూ.13,650 ఇస్తున్నారు.
ఏలూరు నగరం, కుక్కునూరు, న్యూస్టుడే: ‘‘మీ అన్నొస్తాడు.. మీకు మంచే చేస్తాడు’’ అంటూ అంగన్వాడీ కార్యకర్తలకు చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వారిని నిండా ముంచారు. కొత్తగా చేసింది లేకపోగా, జీతభత్యాలు మెరుగ్గా ఉన్నాయంటూ అప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాల వర్తింపును నిలిపేశారు. ఎన్నికలకు ముందు మంచి చేస్తానని చెప్పిన పెద్దమనిషి.. ఏరు దాటాక ముంచేశాడంటూ అంగన్వాడీ సిబ్బంది లబోదిబోమంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కంటే రూ.వెయ్యి అదనంగా వేతనం పెంచడమే కాదు, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానంటూ 2019 ఎన్నికలకు ముందు అంగన్వాడీ కార్యకర్తలను జగన్ నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క సమస్య పరిష్కరించక పోగా రకరకాల యాప్లు, సర్వేల పేరుతో పని భారం మోపారు. నాలుగున్నరేళ్లు ఓపికగా ఎదురు చూసినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విధిలేక రోడ్డెక్కి నిరసన గళం విప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎస్మా, ఉద్యోగాల నుంచి తొలగింపు వంటి అస్త్రాలతో బెదిరించి విధుల్లో చేరేలా చేసిందే తప్ప, చిరుద్యోగుల సమస్య ఒక్కటైనా తీర్చుదామన్న మానవత్వం చూపలేదు.
సమ్మె వేతనం ఏదీ?
నిర్దేశిత పదకొండు డిమాండ్ల సాధన కోసం గతేడాది డిసెంబరు 12 నుంచి ఈ ఏడాది జనవరి 22 వరకు అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేశారు. ప్రభుత్వ చర్చల్లో భాగంగా సమ్మెకాలానికి వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది. ఏలూరు జిల్లాకు చెందిన వారికి వారం రోజుల కిందట సమ్మె వేతనాలు అందగా.. పశ్చిమగోదావరి వారికి అందలేదు. 3,165 మంది కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.
ఊసే లేని మెనూ ఛార్జీలు
గత అయిదేళ్లలో టీఏ, డీఏలు కూరగాయలు, నిత్యావసర సరకుల బిల్లులు చెల్లించలేదు. గ్యాస్, నిత్యావసర వస్తువులకు సంబంధించి అంగన్వాడీలు సొంత డబ్బులే చెల్లించే దుస్థితి నెలకొంది. ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వేతనం పెంపు, గ్రాట్యుటీ, మినీ కేంద్రాల సిబ్బందిని ప్రధాన కార్యకర్తలుగా గుర్తింపు, ఆయాలకు అంగన్వాడీలుగా పదోన్నతి, పదవీ విరమణ వయసు పెంపు, కేంద్రాల అద్దె బకాయిలు చెల్లింపు.. ఇలా ఏ ఒక్కటీ పరిష్కారానికి చొరవ చూపలేదు.
పథకాలన్నీ గోవిందా
అంగన్వాడీలకు అమ్మఒడి, విద్యా, వసతి దీవెనలు, చేయూత, ఒంటరి, వితంతు, దివ్యాంగులకు సామాజిక పింఛన్ పథకాలకు అనర్హులను చేసింది.
ఎన్నో చెప్పారు.. ఒక్కటీ అమలు కాలేదు
‘ఎన్నికల ముందు అంగన్వాడీల కార్యకర్తలకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ ఎన్నో చెప్పారు. కానీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. పదకొండు డిమాండ్లతో దాదాపు 42 రోజులు నిరవధిక సమ్మె చేస్తే.. ప్రభుత్వం ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. ప్రభుత్వం పట్టుదలగా వ్యవహరించిందే తప్ప, మానవతా ద]ృక్పథంతో వ్యవహరించలేదు’అని అంగన్వాడీ వర్కర్స్ ,హెల్పర్స్ యూనియన్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్లు.. ఇదీ వైకాపా పాలన: పవన్ కల్యాణ్
[ 05-05-2024]
వైకాపా పాలన మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్లుగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. -
వైకాపా అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 05-05-2024]
‘వైకాపా అసమర్థతతో చింతలపూడి ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేసి నాగార్జున సాగర్ నీరు తీసుకొచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా. -
‘నిషా’దం వెనుక జగన్
[ 05-05-2024]
మద్యపానం నిషేధం విషయంలో జగన్ తీరు చూసి జనాలు ‘చెప్పేది శ్రీరంగనీతులు’.. అనే సామెత గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు మద్యాన్నే లేకుండా చేస్తానని నటనా చాతుర్యాన్ని ప్రదర్శించిన జగన్.. పీఠం ఎక్కాక మాట మార్చి.. -
50 ఏళ్లకే రూ.4 వేల పింఛను
[ 05-05-2024]
అభివృద్ధి- సంక్షేమం అంటే ఏంటో అమలు చేసి చూపిస్తామని తెదేపా, జనసేన, భాజపా కూటమి ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాలపై ఆయన ‘న్యూస్టుడే’తో మాట్లాడారు. -
రేపటి నుంచి తపాలా బ్యాలెట్ ఓటింగ్
[ 05-05-2024]
పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 6, 7 తేదీల్లో తపాలా బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి, అత్యవసర సేవల ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పించారు. -
ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులకు తీవ్ర నష్టం
[ 05-05-2024]
ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని పలు ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. నగరంలోని ఒక హోటల్లో శనివారం సాయంత్రం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. -
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యం
[ 05-05-2024]
దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని భాజపా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. -
నేడు ఏలూరుకు లోకేశ్.. యువతతో ముఖాముఖి
[ 05-05-2024]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం ఏలూరు రానున్నారు. క్రాంతి కల్యాణ మండపం సమీపంలోని స్థలంలో ‘హలో లోకేశ్’ పేరిట ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని తెదేపా వర్గాలు తెలిపాయి. -
అంతా గందరగోళం
[ 05-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని.. అర్హులందరూ నిర్భయంగా, ఇబ్బంది లేకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పించామని అధికారులు ఊదరగొడుతున్నారు. -
18 నుంచి శ్రీవారి వైశాఖ మాస తిరుకల్యాణోత్సవాలు
[ 05-05-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి వైశాఖ మాస తిరుకల్యాణోత్సవాలు ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
కుప్పకూలి ఉపాధి కూలీ మృతి
[ 05-05-2024]
ఉపాధి పనికి వెళ్లిన కూలీ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ఘటన వీరవాసరంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వీరవాసరం గ్రామానికి చెందిన మామిడిశెట్టి వాసు (44) శనివారం ఉపాధి పనికి వెళ్లారు. -
కూటమి పథకాలతో అన్ని వర్గాలకు లబ్ధి
[ 05-05-2024]
ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెదేపా అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఉండి మండలం చెరుకువాడ, అర్తమూరు గ్రామాల్లో తెదేపా మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, -
ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టి రూ.5 లక్షలు స్వాహా
[ 05-05-2024]
ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టి రూ.5 లక్షలు కాజేసిన తండ్రి, ఇద్దరు కుమారులపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. -
కూటమితోనే ప్రగతి పథం
[ 05-05-2024]
రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు పేర్కొన్నారు. తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి,
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్