ఒక్కసారి ఇచ్చారంటే వందేళ్లు రాసిచ్చినట్టే!
లీజు ద్వారా పొందినా, ఆక్రమించినా ఒక్కసారి నగరపాలకసంస్థకు చెందిన గదులు చేజిక్కితే అవి వారి సొంతమైనట్టే ! లీజు ద్వారా పొందిన గదులకు అద్దె కట్టినా కట్టకపోయినా ఎవ్వరూ పట్టించుకోరు.
వివాదాస్పదంగా మారిన నగరపాలక సంస్థ లీజులు
కాలపరిమితి ముగిసినా ఖాళీ చేయించని అధికారులు
న్యూస్టుడే, కడప నగరపాలక
లీజు ద్వారా పొందినా, ఆక్రమించినా ఒక్కసారి నగరపాలకసంస్థకు చెందిన గదులు చేజిక్కితే అవి వారి సొంతమైనట్టే ! లీజు ద్వారా పొందిన గదులకు అద్దె కట్టినా కట్టకపోయినా ఎవ్వరూ పట్టించుకోరు. నిర్ణీత కాలవ్యవధిలో అద్దె పెంచమని అడిగేవారే ఉండరు. లీజు కాలపరిమితి ముగిసినా ఆ గదులను ఖాళీ చేయాల్సిన అవసరం ఉండదు. లీజు ద్వారా పొందిన గదులను ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరికైనా సబ్ లీజులకు ఇచ్చుకోవచ్చు. ఇలాంటి వెసులుబాటు ఉండడంతోనే నగరపాలక, పురపాలక, పంచాయతీ, జిల్లా పరిషత్తు, రెవెన్యూ స్థలాలు గదులకు అంత గిరాకీ ! ఇలాంటి ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదని 25 ఏళ్ల కాలపరిమితి ముగిసిన గదులను లీజుదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. కడప నగరపాలక సంస్థకు చెందిన దాదాపు 65 వాణిజ్య గదుల లీజు కాలపరిమితి ముగిసి దాదాపు పదేళ్లు అవుతోంది. అయినా వాటిని స్వాధీనం చేసుకుని కొత్తగా వేలంపాట నిర్వహించడానికి నగరపాలక సంస్థ యంత్రాంగం ఆసక్తి చూపడంలేదు. లీజు కాలపరిమితి ముగిసిన గదుల నుంచి వసూలు చేయాల్సిన అద్దె వ్యత్యాసమే రూ.3,25,60,389 ఉండడం గమనార్హం.
అధికారుల ప్రయత్నాలు విఫలం : కడప నగరపాలక సంస్థ పరిధిలో వైవీస్ట్రీట్ వాణిజ్య సముదాయం (పాతమార్కెట్ కాంప్లెక్స్), మద్రాసురోడ్డు కాప్లెక్సు, దేవునికడప రోడ్డు వాణిజ్య సముదాయం, పాత యునాని స్టాల్స్, వన్టౌన్ కూడలిలోని ఖాళీ స్థలాల లీజు కాలపరిమితి 2012-14 మధ్య ముగిసింది. ఈ గదులను ఖాళీ చేయించడానికి అప్పట్లో నగరపాలక సంస్థ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.అప్పటి నుంచి 2023 వరకు 25 ఏళ్ల కాలపరిమితి ముగిసిన గదులను ఖాళీ చేయించడానికి వివిధ సందర్భాల్లో ప్రజాప్రతినిధులు అధికారులతో కూడిన కమిటీలను నియమించారు. ఆ కమిటీలు ఏమయ్యాయో ... వాణిజ్య గదులను స్వాధీనం చేసుకోవడానికి ఎలాంటి ప్రతిపాదనలు ఇచ్చారో ఎవరికీ తెలియదు. వాణిజ్య గదుల లీజు అంశం రచ్చకెక్కిన ప్రతిసారి ఒక కమిటీని వేయడం పరిపాటిగా మారింది. కొందరు ప్రజాప్రతినిధులు లీజుదారులకు పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా నగరపాలక సంస్థకు చెందిన గదుల అద్దెను ప్రతి మూడేళ్లకొకసారి 33.33 శాతం పెంచుతారు. 2014 నుంచి లీజు ముగిసిన గదుల నుంచి పాత అద్దెలనే వసూలు చేస్తున్నారు. ఈ అంశం గతేడాది కమిషనర్ దృష్టికి వెళ్లింది. 2014 నుంచి 2017 వరకు, 2017 నుంచి 2020 వరకు, 2020 నుంచి 2023 వరకు వాణిజ్య గదుల అద్దెలను మూడు సార్లు సవరించి వసూలు చేయాలని వారు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అద్దె పెంపునకు ముందు పెంచిన అనంతరం దాని వ్యత్యాసం రూ.3.25 కోట్లకు చేరింది. లీజుదారులు ముందు ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని కమిషనర్ స్పష్టం చేయడంతో వసూళ్లు మొదలయ్యాయి. లీజు గడువు ముగిసిన గదులను ఖాళీ చేయించడంలో మాత్రం జాప్యం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి లీజుదారులకే గదులను తిరిగి అద్దెకిస్తారన్న ప్రచారం సాగుతోంది. లీజు కాలపరిమితి ముగిసిన గదులను ఖాళీ చేయించి కొత్తగా వేలం పాట నిర్వహిస్తే గుడ్విల్ రూపంలో కనీసం రూ.6 కోట్లు నుంచి రూ.8 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తంతో నగపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలను నిర్మించడానికి ఆస్కారం ఉంటుంది.
చర్యలు తీసుకుంటాం
- రమణారెడ్డి ఉపకమిషనర్, కడప నగరపాలక సంస్థ
లీజు కాలపరిమితి ముగిసిన గదుల లీజుదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 25 ఏళ్ల లీజు ముగిసినందున అద్దె గదులను ఖాళీ చేయించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సమస్య పరిష్కారమైన వెంటనే పునర్నిర్మాణం లేదా వేలంపాటపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యమే ఉండదన్నావ్.. మధ్యలోనే చంపేస్తున్నావ్..!
[ 08-05-2024]
దశల వారీగా మద్యనిషేధం చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం జగన్ అధికార పీఠం ఎక్కాక మోసం చేశారు. కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు.. బార్లు తెరిచి లెక్కకు మించిన విక్రయాలతో పేదలను పిండేస్తూ జేబులు నింపుకొంటున్నారు. -
కొనసాగిన పోస్టల్ బ్యాలట్ పోలింగ్
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలట్ పోలింగ్ మూడోరోజు మంగళవారం కొనసాగింది. కడప ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఉద్యోగులు భారీ సంఖ్యలోనే తరలివచ్చారు. -
పట్టపగలు కాదు...అర్ధరాత్రి మెరుపుల వెలుగు
[ 08-05-2024]
ఈ చిత్రం చూస్తే ఇదేదో పట్టపగలు తీసిందని అనుకుంటారు... కానీ చిమ్మచీకట్లో తీసిన చిత్రమిది... మెరుపు తీగలు నగరానికి నగలా మారగా ఆ వెలుగులు పట్టపగలును తలపించాయి. -
నేడు కలికిరిలో ప్రధాని మోదీ సభ
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచార నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ జిల్లాకు తొలిసారిగా బుధవారం రానున్నారు. పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగసభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. -
కొలువుదీరావు... కొంప ముంచావు!
[ 08-05-2024]
నగరపాలక, పుర, నగర పంచాయతీల్లో మీకు సొంత ఇల్లుందా? పోనీ ఇంటి నిర్మాణానికి సెంటు స్థలమైనా ఉందా? వైకాపా ప్రభుత్వం విధించే ఆస్తిపన్నులు చెల్లించడానికి మీ ఆస్తులు సరిపోక పోవచ్చు. అద్దె ఇంట్లో ఉంటున్నామని సంబరపడే వారికి సంకటం తప్పదు. -
ఎన్డీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం
[ 08-05-2024]
తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి పనులే ముద్దనూరులో కనిపిస్తున్నాయని, వైకాపా ప్రభుత్వం చేపట్టింది ఏమీ కనిపించడంలేదని ఎన్డీఏ కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్రెడ్డి అన్నారు. -
మైనార్టీల హక్కులు కాపాడేది చంద్రబాబునాయుడే
[ 08-05-2024]
మైనార్టీల మతపరమైన సంరక్షణ, వారి హక్కులు కాపాడేది చంద్రబాబునాయుడే అని ముస్లిం సోదరులు అపోహలు వీడి నిశ్చింతగా ఉండాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. -
14 హామీలతో ప్రొద్దుటూరు తెదేపా మేనిఫెస్టో విడుదల
[ 08-05-2024]
ప్రొద్దుటూరు అభివృద్ధి కోరుతూ 14 రకాల ప్రధాన హామీలతో తెదేపా మేనిఫెస్టోను మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశారు. -
గెలిపిస్తే.. ఉక్కు కర్మాగారం కోసం పోరాడుతాం
[ 08-05-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే కడప ఉక్కు కర్మాగారం సాధన కోసం కృషి చేస్తానని కడప తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డి అన్నారు. -
అక్రమంగా దాచిన మద్యం స్వాధీనం
[ 08-05-2024]
మండల పరిధిలోని యాదవనగర్ సమీపంలో పంటపొలాల్లో దాచిన తెలంగాణా రాష్ట్రానికి చెందిన 2016 మద్యం సీసాలను సెబ్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
దివ్యాంగ ఓటర్లకు చక్రాల కుర్చీలు
[ 08-05-2024]
రానున్న ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే దివ్యాంగుల కోసం అధికారులు చక్రాల కుర్చీలు అందుబాటులోకి తీసుకురానున్నారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 08-05-2024]
మైదుకూరు మండలం టి.కొత్తపల్లెకు చెందిన వైకాపా నాయకులు మంగళవారం ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
తెదేపాతో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
[ 08-05-2024]
తెదేపా ప్రభుత్వంలోనే కురబ సామాజిక వర్గానికి భరోసా లభిస్తుందని వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా అన్నారు. -
1950కు ఎస్ఎంఎస్ చేస్తే పోలింగ్ కేంద్రం వివరాలు
[ 08-05-2024]
మీ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం స్లిప్పుల కోసం ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఎన్నికల కమిషన్. -
యజమాని వేధింపులతో చేనేత కార్మికుడి బలవన్మరణం
[ 08-05-2024]
మగ్గాల యజమాని వేధింపులు భరించలేక ఓ చేనేత కార్మికుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. -
వడగండ్లు... రైతులకు కడగండ్లు
[ 08-05-2024]
మండలంలోని బూడిదవేడులో సోమవారం రాత్రి భారీ గాలులతో కూడిన వడగండ్ల వానకు పంటలన్నీ నేలమట్టమయ్యాయి. దాదాపు 30 ఎకరాల్లో బొప్పాయి, టమాట, వరి తదితర పంటలన్నీ నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు