తెదేపాతోనే అన్ని వర్గాలకు న్యాయం
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గద్దె దించాలని ఎన్డీఏ కడప పార్లమెంట్ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి అన్నారు.
మైలవరంలో పార్టీలో చేరిన వారితో కడప ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డి. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి
మైలవరం, ప్రొద్దుటూరు వైద్యం, రాజుపాళెం, దువ్వూరు, మైదుకూరు, బి.కోడూరు, న్యూస్టుడే: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గద్దె దించాలని ఎన్డీఏ కడప పార్లమెంట్ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మైలవరం మండలంలోని దొమ్మర నంద్యాల, తొర్రివేముల, నక్కొనిపల్లె, బుచ్చంపల్లె, సి.కొత్తపల్లె, చిన్నకొమెర్ల గ్రామాల్లో వైకాపా చెందిన 150 కుటుంబాలు తెదేపాలో చేరాయి. జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరులోని వెంకటేశ్వర్లు రిషి అపార్ట్మెంట్ వద్ద శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులు మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వంలోనే బీసీల అభివృద్ధి జరిగిందన్నారు. అనంతరం శ్రీనివాసనగర్లో ప్రచారం చేశారు. రాజుపాళెం మండలంలోని పొట్టిపాడు, చిన్నశెట్టిపల్లె గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. దువ్వూరు మండలంలోని వెంకుపల్లె గ్రామంలో సర్పంచు బోదనపు రోజరమణి, నాగభూషణం, నాగరాజు, దస్తగిరి, సుబ్బయ్య, పెద్దజొన్నవరం గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి, మహేశ్వరరెడ్డి, రమేష్రెడ్డి, ఎస్సీ కాలనీకి చెందిన కోటి అంకల్, రామలక్షుమయ్య, తదితరులు ఆధ్వర్యంలో వైకాపా నుంచి మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్యాదవ్ సమక్షంలో అనేకమంది తెదేపాలో చేరారు. అనంతరం పుట్టా మాట్లాడుతూ వైకాపా ఆరాచక, దౌర్జన్య, సైకో పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తెదేపాలో చేరుతున్నారన్నారు. మైదుకూరు పట్టణంలోని 9వ వార్డులో పుట్టా ప్రచారం చేశారు. అనంతరం బడి పెద్దనరసింహులు, చిన్న నరసింహులు, యారాల ప్రసాద్, సాయినరేంద్ర తదితరులు పార్టీలో చేరారు. బి.కోడూరు మండలంలోని సిద్దుగారిపల్లె, పాత ప్రభలవీడు, నరసయ్య కొట్టాలు గ్రామాల్లో బద్వేలు భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న ఇంటింటి ప్రచారం చేశారు.
ప్రొద్దుటూరులో మాట్లాడుతున్న వరదరాజులురెడ్డి, పక్కన బచ్చల పుల్లయ్య, నాగరాజు, రాజగోపాల్ యాదవ్ తదితరులు
దువ్వూరులో పార్టీలో చేరిన వారికి కండువా వేసి ఆహ్వానిస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్
బి.కోడూరు మండలం సిద్దుగారిపల్లెలో ప్రచారం చేస్తున్న బోజ్జా రోశన్న, ఎన్డీఏ నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
[ 29-04-2024]
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. -
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
[ 29-04-2024]
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. -
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
[ 29-04-2024]
కడప నగర కార్పొరేటర్లపై వైకాపా అభ్యర్థి అంజాద్బాషాకు అనుమానాలు వెంటాడుతున్నాయి. తన గెలుపునకు అంకితభావంతో సహాయపడడంలేదనే సంకోచంతో తరచూ వారితో భేటీకి ప్రయత్నిస్తున్నారు. -
రైల్వేలైను మారుస్తుంటే ఎంపీ మిథున్రెడ్డి ఏం చేశారు?
[ 29-04-2024]
కడప-బెంగళూరు రైల్వేలైను మారుస్తుంటే రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి చూస్తూ ఎందుకు ఉండిపోయారని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. రాయచోటి పట్టణంలోని ఓ కల్యాణమండపంలో ఆదివారం వివిధ వర్గాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
పీహెచ్సీలన్నావ్... చేతులెత్తేశావ్..!
[ 29-04-2024]
‘గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తాం... పల్లె ముంగిట్లోకి అధునాతన వైద్య సేవలు విస్తరిస్తాం... ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నాం... ప్రతి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాం’ అని సీఎం జగన్ ప్రచారార్భాటంగా చేశారు. -
2న రాయచోటి, కడపలో చంద్రబాబు సభలు
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల 2న రాయచోటి, కడపకు రానున్నారు. -
తెదేపా ప్రచార రథంపై దాడి
[ 29-04-2024]
తెదేపా కడప అసెంబ్లీ ప్రచార రథంపై అల్లరిమూక దాడికి పాల్పడింది. పార్టీ అభ్యర్థి మాధవి ప్రచార రథం కడప నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని రామాంజనేయపురంలో ఆదివారం వెళ్తుండగా వైకాపాకు చెందిన కొందరు అడ్డుకున్నారు. -
అతివలే అధికం!
[ 29-04-2024]
జిల్లా అధికార యంత్రాంగం ఓటర్ల తుది జాబితా ప్రచురించింది. నాలుగు నెలల్లోనే 22 వేల మందికిపైగా ఓటర్లు పెరిగారు. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,16,509 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 22,557 మంది కొత్తగా నమోదైనవారితో కలిపి 16,39,066గా నమోదైంది. -
జగన్ సర్కారు నిర్వాకం... పంచాయతీలు నిర్వీర్యం..!
[ 29-04-2024]
గ్రామాల్లో అభివృద్ధే ధ్యేయమని చెప్పిన సీఎం జగన్ చివరకు పంచాయతీల్లోని నిధులను సైతం మళ్లించేసి పూర్తిగా నిర్వీర్యం చేశారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చేశారు. -
మహిళలే అధికం!
[ 29-04-2024]
జిల్లాలో నూతనంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. గత జనవరి 5న విడుదల చేసిన ముసాయిదా జాబితా కంటే తాజాగా ఓటర్లు పెరిగారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14,24,629 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 6,99,309 మంది పురుషులు, 7,25,193 మంది మహిళలు, 127 మంది ఇతరులు ఉన్నారు. -
నీరందించాలని నిరసన
[ 29-04-2024]
‘ఎన్నికలొస్తేనే నాయకులు ఇళ్ల వద్దకు వస్తారు.. ఆ తర్వాత అయిదేళ్లయినా కనిపించరు.. మూడు నెలలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం... ప్రజాప్రతినిధులు పెడచెవిన పెడు తున్నారు... అధికారులు పట్టించుకోరు.. -
పెద్దిరెడ్డి ప్రోద్బలంతోనే తెదేపా నేతలపై కేసులు
[ 29-04-2024]
మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యంతోనే పోలీసులు తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు పేర్కొన్నారు. -
ఏపీసెట్కు 2,047 మంది హాజరు
[ 29-04-2024]
ఆంధ్రప్రదేశ్ స్టేట్ఎలిజిబిలిటీ టెస్ట్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. యోగివేమన విశ్వవిద్యాలయంతోపాటు మరో ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. -
దళితులకు బురిడీ.. జగనన్న దోపిడీ
[ 29-04-2024]
జగనన్న మైకు అందుకుంటే చాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటుంటారు... ఆ మాటలు విన్న వారంతా ఆహా సీఎం గారికి మామీద ఎంత ప్రేమ అనుకున్నారు... తీరా గద్దెనెక్కిన తర్వాత వారి సంక్షేమంపై ఇనుప పాదం వేసి అణగదొక్కారు. -
వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు
[ 29-04-2024]
వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు పడ్డాయని మదనపల్లె కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా విమర్శించారు. రామసముద్రం మండలం ఆర్.నడింపల్లె గ్రామ పంచాయతీలో తెదేపా మండల అధ్యక్షుడు విజయ్కుమార్గౌడు ఆధ్వర్యంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం