అన్నంత పనిచేశావ్... అంతం చేసేశావ్..!
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు... శత్రువైనా సరే ఆకలితో వస్తే కడుపు నిండా భోజనం పెట్టడం ధర్మం. అలాంటి అన్నాన్నే పేదలకు దూరం చేసి జగన్ ప్రభుత్వం పాపం మూటగట్టుకుంది. పేదలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ సమకూర్చడం ప్రభుత్వాల బాధ్యత.
పేదల పొట్టకొట్టిన జగన్ ప్రభుత్వం
రూ.5కే భోజనం లభించే అన్నక్యాంటీన్ల మూసివేత
అన్నక్యాంటీన్లో భోజనం చేస్తున్న ప్రజలు (పాత చిత్రం)
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు... శత్రువైనా సరే ఆకలితో వస్తే కడుపు నిండా భోజనం పెట్టడం ధర్మం. అలాంటి అన్నాన్నే పేదలకు దూరం చేసి జగన్ ప్రభుత్వం పాపం మూటగట్టుకుంది. పేదలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ సమకూర్చడం ప్రభుత్వాల బాధ్యత. గత ప్రభుత్వాలు వివిధ పథకాల కింద తక్కువ ధరకే భోజనం అందించాయి. ఈ సదాశయంతోనే గత తెదేపా ప్రభుత్వం రూ.5కే అల్పాహారం, రూ.5కే భోజనం పేదలకు అందించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ‘అన్న క్యాంటీన్లు’ ఏర్పాటు చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టు బట్టి నామరూపాల్లేకుండా అంతం చేసేసింది. పేదల కడుపు కొట్టి సీఎం జగన్ తన కడుపు మంట చల్లార్చుకున్నారు.
బువ్వకు దూరం చేశారు
పేదల ఆకలి తీర్చేందుకు జమ్మలమడుగులో 2018, అక్టోబరు 2న అన్నక్యాంటీన్ ఏర్పాటైంది. ప్రభుత్వాసుపత్రి సమీపంలోనే ఉండడంతో రోగుల సహాయకులు, కూలీలు. యాచకులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే శ్రామికులు రూ.5 కే భోజనం చేసేవారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో మూతపడడంతో భోజనానికి రూ.100 వెచ్చించాల్సి వస్తోందని వారంతా వాపోతున్నారు. అన్నక్యాంటీన్ స్థానంలో 19, 20 వార్డు సచివాలయంగా నడుస్తోంది.
న్యూస్టుడే, జమ్మలమడుగు
గాలికొదిలేశారు
ఇది బద్వేలులో రూ.40 లక్షలతో నిర్మించిన అన్నక్యాంటీన్ భవనం. ఇక్కడ ప్రతిరోజూ సుమారు 500 మందికిపైగా రూ.5 చొప్పున అల్పాహారం. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసేవారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూతపడడంతో పేదలు, కూలీలు, యాచకులు, వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
న్యూస్టుడే, బద్వేలు
వార్డు సచివాలయంగా మారి...
అన్నక్యాంటీన్లో భోజనానికి బారులు తీరిన పేదలు
ప్రొద్దుటూరు పట్టణంలో 2018, జులైలో అన్న క్యాంటీన్ ప్రారంభమైంది. రూ.32 లక్షలతో నిర్మించిన భవనంలో రూ.5 చొప్పున ప్రతి రోజు ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి కల్పించింది. అల్ఫాహారానికి 300, భోజనానికి 500 మంది పేదలు వచ్చేవారు. ఏడాది పాటు విజయవంతంగా సాగింది. అనంతరం వైకాపా అధికారంలోకి రాగానే రద్దు చేయడంతో ప్రస్తుతం వార్డు సచివాలయం ఏర్పాటైంది.
న్యూస్టుడే, ప్రొద్దుటూరు
పేదల కడుపు కొట్టారు...!
జడ్పీ కార్యాలయ ఆవరణలో అల్పాహారశాలను తొలగించిన అనంతరం
కడప నగరంలోని పాతరిమ్స్, పాతబస్టాండు, జిల్లా పరిషత్తు కార్యాలయాల వద్ద అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్యాంటీన్ వద్ద రోజుకు 600 మంది వరకు భోజనం చేసేవారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసేశారు. క్యాంటీన్ ఆనవాళ్లు కూడా ఉండకూడదని పాతరిమ్స్ వద్ద ఉన్న క్యాంటీన్ను రాత్రికి రాత్రి కూల్చి పెట్రోల్ బంకు ఏర్పాటు చేశారు. పాతబస్టాండు క్యాంటీన్ను సచివాలయంగా మార్చారు. జడ్పీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న అన్న క్యాంటీన్ను ఏకంగా ప్రైవేటు హోటల్గా మార్చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రైవేటు హోటల్ను మూసివేసి స్వాధీనం చేసుకున్నారు. అన్న క్యాంటీన్కు నెలకు రూ.30 వేలు చెల్లించేలా నామినేషన్పై ఓ వ్యక్తికి అప్పగించేశారు. ఇష్టారాజ్యంగా అప్పగింతతో ప్రైవేటు వ్యక్తి సైతం మోసపోయారు.
కడప పాతరిమ్స్ వద్ద అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్న జనం (పాత చిత్రం)
పాతబస్టాండు వద్ద సచివాలయంగా మారిన అన్న క్యాంటీన్
న్యూస్టుడే, కడప నగరపాలక, బిల్టప్
క్యాంటీన్ పోయె....కార్యాలయం వచ్చె
పులివెందులలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లో ఎస్పీడీసీఎల్ డీఈ కార్యాలయంగా ఏర్పాటైంది. తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన అన్న క్యాంటీన్లో ప్రతి రోజూ 300 మంది అనాథలు, పేదలు, యాచకులు భోజనం చేసేవారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే మూతపడింది. ఈ క్రమంలో ఆర్టీసీˆ బస్టాండును కూల్చినప్పుడు బస్సుల రాక పోకల వివరాలను తెలిపే కేంద్రంగా, ప్రయాణికుల వస్తువుల నిల్వ చేసేందుకు ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ఎసీˆ్పడీసీˆఎల్ డీఈ కార్యాలయంగా మారింది.
న్యూస్టుడే, పులివెందుల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలాపురంలో యువకుడి దారుణ హత్య
[ 30-04-2024]
పట్టణంలోని పకీర్ వీధిలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతుడిని మహమ్మద్ ఘనీ (26)గా గుర్తించారు. -
అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
[ 30-04-2024]
ఆ తల్లి ఎన్ని కష్టాలు అనుభవించిందో కొడుకు, కూతురితో కలిసి చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించింది. ‘అన్నా క్షమించు జీవితంలో తొలిసారి నీకు చెప్పకుండా తప్పు చేస్తున్నా.. నాతో పాటు నా బిడ్డల్ని తీసుకెళ్తున్నా.. తల్లికన్నా ఎక్కువగా చూసుకున్నావు, ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా జీవితాన్ని బాగు చేయాలని ఎంతో శ్రమించావు. -
జగన్ అరాచక కేళి.. జనం కావాలా బలి..!
[ 30-04-2024]
అబద్ధాలు వల్లె వేయడం, కుయుక్తులు పన్నడం, అవకాశాలు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైకాపాది అందె వేసిన చేయి. దేన్నీ వదిలిపెట్టకుండా రాజకీయంగా మలుచుకోవడానికి కాచుకు కూర్చున్న వైకాపా సర్కారు ప్రజల ప్రాణాలతో మరోసారి ఆటలాడుకుంటోంది. -
జగనాసుర.. ఎప్పుడైనా ఇటుకేసీ చూశావా?
[ 30-04-2024]
జగన్ అరాచక పాలనలో పుడమి పుత్రులకు కన్నీళ్లే మిగిలాయి. జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుల్లో ఒకటైన కేసీ కాలువ వైపు సీఎం జగన్ తన అయిదేళ్ల పాలనలో కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. రైతు ప్రయోజనాలను కాపాడేవిధంగా నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
నామపత్రాల ఉప సంహరణలు
[ 30-04-2024]
ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి దాఖలు చేసిన 21 మంది అభ్యర్థుల్లో ఆరుగురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలోని ఆర్వో కౌసర్ బాను వద్దకు వెళ్లి ఆరుగురు పోటీ నుంచి వైదొలుగుతున్నామని సంతకాలు చేశారు. -
వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం
[ 30-04-2024]
రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు సూపర్ సిక్స్ పథకాలు అమలవుతాయని తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డి, బద్వేలు భాజపా అభ్యర్థి బొజ్జ రోశన్న పిలుపునిచ్చారు. -
ట్రయల్రన్ పేరుతో పట్టణం దిగ్బంధం
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారం కోసం సీఎం జగన్ మోహన్రెడ్డి మంగళవారం మైదుకూరు పర్యటనతో సోమవారం సాయంత్రం పోలీసులు ట్రయల్రన్ నిర్వహించారు. పట్టణంలోని నాలుగురోడ్లను దిగ్బంధనం చేశారు. లోపలి వాహనాలను బయటకు పంపండం తప్పితే పట్టణంలోకి వాహనాలు ప్రవేశించకుండా అడ్డుకున్నారు. -
ప్రచారం... చేరికలు
[ 30-04-2024]
పురపాలకలోని చిన్నయ్యగారిపల్లెలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటింటి ప్రచారం చేశారు. మైదుకూరు పురపాలకకు చెందిన ఆరీఫ్, రెహ్మాన్, అస్యాక్, షేక్ ఆరీఫ్, చందు, అబ్దుల్లా, బాషా, హుస్సేన్, అబ్దుల్, బ్రహ్మంగారిమఠం జౌకుపల్లె ఎస్సీకాలనీకి చెందిన వైకాపా నాయకులు నాగులారపు కొమ్మయ్య, బత్తల శివ, సంసోను, ఫిలమెంట్, దినకర్, భాస్కర్, ఏసోబు, డేవిడ్ తెదేపాలో చేరారు. -
సీఎం పర్యటనతో విభాజికం ధ్వంసం
[ 30-04-2024]
ముఖ్యమంత్రి పర్యటన అంటే ప్రజలు విస్తుపోయే పరిస్థితి. ఇది ఒక్ల మైదుకూరు పట్టణంలోనే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా ఆ ప్రాంత వాసులకు ఎదురయ్యే దుస్థితి. -
రోడ్డుపైనే సీఎం సభ... ప్రయాణాలు మానుకోండి!
[ 30-04-2024]
ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల వైపు నుంచి మైదుకూరు మీదుగా బద్వేలు, కడప మార్గంలో మంగళవారం రాకపోకలు సాగించే ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార సభను మైదుకూరు వద్ద కృష్ణపట్నం-హుబ్లీ జాతీయ రహదారిపై నిర్వహించనున్నారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ
[ 30-04-2024]
రాజంపేట ఎంపీ స్థానంతోపాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. రాజంపేట ఎంపీ స్థానంలో 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, పోటీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో 18 మంది బరిలో నిలిచారు. -
కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం
[ 30-04-2024]
వైకాపా పాలనపై విరక్తి చెందిన ప్రజలు కూటమి వైపు చూస్తున్నారని తెదేపా పీలేరు అసెంబ్లీ అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని సొరకాయలపేట, గోరంట్లపల్లె, మారెళ్ల, వగళ్ల గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని బెదిరింపు
[ 30-04-2024]
తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి బెదించారని ఆ పార్టీ నాయకుడు సిద్దవరం వెంకటేశ్వర రెడ్డి పెనగలూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. -
బంగ్లామిట్ట... తాగునీటికి కటకట!
[ 30-04-2024]
రైల్వేకోడూరు మండలం బొజ్జావారిపల్లె పంచాయతీ బంగ్లామిట్ట కాలనీ వాసులు గత కొన్ని రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని డైరెక్ట్ పంపింగ్ మోటారు మరమ్మతులకు గురికావడంతో తాగునీటి ఎద్దడి నెలకొంది. -
వైకాపాకు యువజన రాష్ట్ర కార్యదర్శి రాజీనామా
[ 30-04-2024]
మైదుకూరుకు చెందిన వైకాపా యువజన రాష్ట్ర కార్యదర్శి తప్పెట శశిధర్రెడ్డి పార్టీ పదవితోపాటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు సోమవారం విలేకరులకు తెలిపారు. -
నేడు కలికిరికి సీఎం జగన్ రాక
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మంగళవారం సాయంత్రం కలికిరికి రానున్నారు. ఈ నేపథ్యంలో కలికిరి-కలకడ మార్గంలోని అంకాలమ్మ గుడి ఎదురుగా ఉన్న స్థలాన్ని హెలీప్యాడ్కు పరిశీలించి చదును చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ మంత్రి
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా