Andhra News: సినీఫక్కీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అపహరణ
తెర్లాం మండలం కునాయవలసకు చెందిన తెర్లి ఈశ్వరరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. కొవిడ్ కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈయన శుక్రవారం ఉదయపు నడక కోసం గ్రామ శివారులోని రాయిపల్లివారి చెరువు వద్దకు వచ్చారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు
పోలీసులకు వివరాలు చెబుతున్న బాధితుడు ఈశ్వరరావు
‘మీ ఇంటికి ఫోన్ చేసి రూ.50 లక్షలు తెమ్మని చెప్పాలంటూ తీవ్రంగా కొట్టారు. సొమ్ము తేకుంటే మా పెద్ద సారుకు అప్పగిస్తామని, ఆయన నీ శరీర అవయవాలు అమ్మేస్తాడని భయపెట్టారు.’ ఇంతలో ఉద్యోగి కేకలు వేయడంతో స్థానికులు విని దుండగులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఎస్.కోటలో చోటుచేసుకుంది.
శృంగవరపుకోట, తెర్లాం, న్యూస్టుడే తెర్లాం మండలం కునాయవలసకు చెందిన తెర్లి ఈశ్వరరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. కొవిడ్ కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈయన శుక్రవారం ఉదయపు నడక కోసం గ్రామ శివారులోని రాయిపల్లివారి చెరువు వద్దకు వచ్చారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి కారు ఆగిపోయింది, సహకరించాలని కోరగా వెనుక నుంచి కారు నెడుతున్న ఈశ్వరరావుపై కర్రతో దాడి చేసి, కాళ్లు, చేతులు కట్టేశారు. నలుగురిలో ఒకరు అక్కడ ఉండిపోయి ముగ్గురు వ్యక్తులు అదే కారులో ఎస్.కోట మండలం ధర్మవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణం పక్కన ఉన్న వాటర్ ప్లాంటు వద్దకు తీసుకొచ్చారు. లోపలికి ఈశ్వరరావును తీసుకెళ్తుండగా రక్షించండంటూ కేకలు వేశాడు. స్థానికులు చేరుకుని ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఒకరు పరారయ్యాడు. పారిపోయిన వ్యక్తి వాటర్ ప్లాంటు నిర్వహిస్తున్న ఎస్.కోట మండలం రేవళ్లపాలేనికి చెందిన రాజశేఖర్గా, పట్టుబడిన వారు ఇతని వద్ద వాహన చోదకులు రేవళ్లపాలేనికి చెందిన గేదెల సత్యనారాయణ, ఎస్.కోటకు చెందిన అంబటి మోహనరావుగా గుర్తించామని ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.
అపహరణకు వినియోగించిన కారు
డబ్బుల కోసమే...
కునాయవలసలో తన ఇంటికి సమీపంలో ఉంటున్న కరుణాకర్ స్నేహితులతో కలసి డబ్బుల కోసమే ఈ పథకం పన్నాడని బాధితుడు చెప్పినట్లు ఎస్సై తెలిపారు. తీవ్ర గాయాలైన ఈశ్వరరావును ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స చేయించగా వైద్యులు విజయనగరం రిఫర్ చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఘటన తెర్లాం పోలీసు స్టేషను పరిధిలో జరగడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్కడికి కేసు బదిలీ చేయాలా, లేక ఇక్కడే దర్యాప్తు చేయాలా అన్నది నిర్ణయిస్తామని ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెప్పటమే నేరమా..?
[ 05-05-2024]
ఉపాధ్యాయులు నిజం చెప్పడమే రాష్ట్రంలో నేరమైంది. అడ్డదారులు తొక్కకుండా తమ పాఠశాలల్లో సమస్యలను నమోదు చేసిన ఉపాధ్యాయులకు రాష్ట్ర ఉన్నతాధికారులు నోటీసులు పంపించడం చర్చనీయాంశమైంది. -
జనసేనలోకి చేరికలు
[ 05-05-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధోగతి పాల్జేశారని పాలకొండ కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. -
జనం భూముల్లో జగన్ భూతం
[ 05-05-2024]
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన ఈశ్వరరావుకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పాస్బుక్, టైటిల్ పత్రాలు తన వద్దే ఉన్నాయి. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
[ 05-05-2024]
జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ కేంద్రాల్లో ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభంకానుంది. -
‘అమ్మేసిన స్థలంలో వైకాపా కార్యాలయమా?’
[ 05-05-2024]
విజయనగరం ఎమ్మెల్యే, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఆక్రమణలతో పాటు ఆయన వద్ద స్థలాలు కొనుక్కున్నవారినీ వేధిస్తున్నారని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు -
40 ఏళ్ల నాటి ప్లాట్లు మాయం
[ 05-05-2024]
విజయనగరం జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే పెద్దఎత్తున చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆగు..ఆగు..దేవుడి మాన్యం డబ్బులేవీ?
[ 05-05-2024]
అధికారం.. ఆపై ఎమ్మెల్యే.. ఇంకేముందు ఎక్కడ భూములు కనిపించినా కొనేస్తున్నారు బొత్స అప్పలనర్సయ్య. ఈ క్రమంలోనే దత్తిరాజేరు మండలం కె.కొత్తవలసలో దేవుడి మాన్యం కొన్నారు. -
అవ్వాతాతలతో సర్కారు చెలగాటం
[ 05-05-2024]
సామాజిక పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్లను జమ చేసి వైకాపా ప్రభుత్వం అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. -
జనం భూమిలో.. జగన్ చిచ్చు
[ 05-05-2024]
వైకాపా సర్కార్ కుట్రపూరితంగా తీసుకొస్తున్న ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటిలింగ్ యాక్ట్-2022) ప్రజల భూముల పాలిటి ముప్పులా మారింది. -
తెదేపా విజయం ఖాయం
[ 05-05-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని గజపతినగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.