నేటి నుంచి దళితబంధు లబ్ధిదారుల ఎంపిక
దళితబంధు పథకానికి 1500 మంది లబ్ధిదారులను ఈ నెల 28వ తేదీ నుంచి జులై 10 వరకు ఎంపిక చేసి 11న లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించనున్నట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
మంత్రి గంగుల కమలాకర్
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి
గంగుల కమలాకర్, చిత్రంలో ఎమ్మెల్యేలు బాలకిషన్, రవిశంకర్, సతీష్బాబు,
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ విజయ, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్
కరీంనగర్ సంక్షేమ విభాగం, న్యూస్టుడే: దళితబంధు పథకానికి 1500 మంది లబ్ధిదారులను ఈ నెల 28వ తేదీ నుంచి జులై 10 వరకు ఎంపిక చేసి 11న లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించనున్నట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ ఛైర్పర్సన్తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 13,359 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 10,202మందికి యూనిట్లు మంజూరు చేశామని ఇంకా 3,357మందికి యూనిట్లు మంజూరు చేయాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. దళితబంధు పథకంతో భవిష్యత్తు తరాలు ఉన్నత వర్గాలకు దీటుగా ఎదుగుతారని తెలిపారు. పథకం పారదర్శకంగా అమలు చేసినందుకు జిల్లా పాలనాధికారి ఆర్వీ.కర్ణన్ను మంత్రి అభినందించారు. జిల్లా పాలనాధికారి ఆర్వీ. కర్ణన్ మాట్లాడుతూ..హుజురాబాద్ నియోజకవర్గంలో 17,554 మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు చెప్పారు.
యూనిట్లను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్ రెడ్డిని జిల్లా పాలనాధికారి అభినందించారు. జడ్పీ ఛైర్పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ... డెయిరీ యూనిట్ల లబ్ధిదారుల కోసం గేదెలను తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకురావాలన్నారు.
రెండు పడక గదుల ఇళ్ల పథకంపై సమీక్ష
మంత్రి గంగుల కమలాకర్ రెండు పడక గదుల ఇళ్ల పథకంపై సమీక్షించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 3వేలు, కరీంనగర్లో 1400, మానకొండూర్లో 891, చొప్పదండి నియోజకవర్గంలో 707 రెండు పడక గదుల ఇళ్లు మంజూరు కాగా 789 నిర్మాణాలు పూర్తయినట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్లో ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో సమావేశం ఉందని జిల్లాలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులకు సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను త్వరితగతిన లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో 707 ఇళ్లు మంజూరయ్యాయని ఇళ్ల నిర్మాణం మొదలైన వాటిని పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. గంగాధర ఎక్స్రోడ్ వద్ద ఆర్అండ్బీ రోడ్లను బాగు చేయాలని కోరారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్బాబు మాట్లాడుతూ.. సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో 247 రెండు పడక గదుల ఇళ్లకు 243 పూర్తయినట్లు చెప్పారు. సైదాపూర్లో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలో 30వేల రెండు పడక గదుల ఇళ్లు మంజూరు కాగా పట్టణంలో 1214, జమ్మికుంటలో 500 వీణవంక మండలంలో 59, ఇల్లందకుంటలో 50 రెండు పడక గదుల ఇళ్లు నిర్మించాల్సి ఉందన్నారు. సమావేశంలో కరీంనగర్ మేయర్ సునీల్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, సుడా ఛైర్మన్ జీవీ.రామకృష్ణా రావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, జిల్లా అదనపు పాలనాధికారులు గరిమాఅగ్రవల్, శ్యాంప్రసాద్లాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు
[ 20-05-2024]
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం స్వామివారికి లక్ష తులసి అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
కనిపిస్తే కరుస్తున్నాయ్!
[ 20-05-2024]
జిల్లాలో వీధి కుక్కలు బెంబేలేత్తిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చేవారిపై దాడికి పాల్పడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వీధుల్లో గుంపులుగా తిరుగుతూ బయట ఆడుకునే చిన్నారులతో పాటు వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. రాయికల్ పట్టణంలోని ఓ కాలనీలో ఒకే రోజు 11 మందిపై కుక్కలు దాడి చేశాయి. -
సా..గుతున్న అభివృద్ధి పనులు
[ 20-05-2024]
రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ను గత ప్రభుత్వం పురపాలక సంఘం హోదా కల్పించి అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లోంచి పెద్ద చెరువుపై మినీ ట్యాంక్బండ్, సమీపంలో ఉద్యానవనం ఏర్పాటుకు రూ.1.5 కోట్లు కేటాయించింది. -
పాఠ్య పుస్తకాలు వస్తున్నాయ్!
[ 20-05-2024]
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు త్వరగా అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతేడాది పంపిణీలో కొంత జాప్యం జరిగింది. -
పెరిగిన మామిడి దిగుబడి.. తగ్గిన ధర
[ 20-05-2024]
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడి ధర తగ్గింది. ఏడాది పొడవునా కంటికి రెప్పలా చూసుకునే చెట్లు... సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కాతకు సైతం ధర పడిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. -
పేరుకే పెద్ద ఆసుపత్రి!
[ 20-05-2024]
వైద్య విధాన పరిషత్లో నడుస్తున్న కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుసంధానం చేసి ఆరు నెలలైంది. ఇప్పటికీ బడ్జెట్ మంజూరు చేయకపోవడంతో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
[ 20-05-2024]
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 20-05-2024]
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సమయం సమీపిస్తున్నా ఏర్పాట్లేవీ!
[ 20-05-2024]
కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 1న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు. -
మహిళలకు రక్షణ... వేధింపులకు అడ్డుకట్ట
[ 20-05-2024]
‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. -
మహాలక్ష్ములతో ఆర్టీసీ కళకళ
[ 20-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులన్నీ కళకళలాడుతుండటంతో ఆదాయమూ పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అయిదు నెలల పరిస్థితిపై ‘న్యూస్టుడే’ కథనం. -
కొత్త రేషన్ కార్డులపై ఆశలు
[ 20-05-2024]
‘రేషన్ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరలకే అందిస్తాం. రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సహ ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాం. -
ప్రధాన రహదారి.. ప్రమాదాలకు నెలవు
[ 20-05-2024]
గౌతమినగర్ నుంచి రాజీవ్ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. -
అర్బన్ బ్యాంక్ ఎన్నికల సన్నాహక సమావేశం
[ 20-05-2024]
సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ బ్యాంక్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన నాయకులు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం అంతంతే
[ 20-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం