ఉద్యోగాల పేరిట వల
సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు కల్పించేందుకు దళారులు దందా మొదలుపెట్టారు. సింగరేణి విస్తరించిన ఉన్న ఆరు జిల్లాల్లో దళారులు నిరుద్యోగుల నుంచి భారీగా దండుకోవడానికి పైరవీలు చేస్తామంటూ నమ్మిస్తున్నారు..
* మా కుమారుడు డిగ్రీ చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఎలాగైనా ఫర్వాలేదు.. ఉద్యోగం ఇప్పిస్తే చాలు.. రూ.లక్షలైనా అప్పజెప్పుతా.. పక్కాగా ఉద్యోగం కావాలి. ఆ గ్యారంటీ ఇచ్చేవారి వద్ద మాట్లాడు. పైసలు ఎక్కువైనా ఇచ్చుకుంటా.. ఓ దళారి వద్ద మాటామంతి ఇదీ..
* ఉద్యోగానికి ఎంపిక చేసేందుకు ఓ దళారికి రూ.5 లక్షల అడ్వాన్స్ కింద అప్పగించారు. పని పూర్తయిన తర్వాత మిగతా డబ్బులు చెల్లిస్తానని నిరుద్యోగి అంగీకారం కుదుర్చుకున్నాడు. ఉద్యోగం మాత్రం కావాలంటూ గ్యారంటీ తీసుకున్నాడు. ఎవరితో పనిచేయిస్తావన్నది అనవసరం. ఉద్యోగం ఇప్పించాలని చెప్పాడు.
సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు కల్పించేందుకు దళారులు దందా మొదలుపెట్టారు. సింగరేణి విస్తరించిన ఉన్న ఆరు జిల్లాల్లో దళారులు నిరుద్యోగుల నుంచి భారీగా దండుకోవడానికి పైరవీలు చేస్తామంటూ నమ్మిస్తున్నారు.. సింగరేణివ్యాప్తంగా కొంతమంది దళారులు నిరుద్యోగుల బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి మాయమాటలతో నమ్మిస్తున్నారు. ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగం ఆశతో ఇప్పటికే కొంతమంది నిరుద్యోగులు దళారులకు అడ్వాన్స్ కింద కొంత సమర్పించుకున్నారు. సింగరేణిలో అంతర్గత 155, ఎక్స్టర్నల్ ద్వారా 117 మంది జూనియర్ అసిస్టెంట్ గ్రేడు-2 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతర్గత ఖాళీలను మే 19న, ఎక్స్టర్నల్ ఖాళీలకు జూన్ 16న నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతర్గత అభ్యర్థులు మే 25 నుంచి జూన్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి గడువు విధించింది. ఎక్స్టర్నల్ అభ్యర్థులకు జూన్ 20 నుంచి జులై 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుతం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడు-2 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో దళారులు రంగంలోకి దిగారు. దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులను నమ్మించేందుకు తమకు పైవారితో పరిచయాలున్నాయని డబ్బులు దండుకుంటున్నారు. ముందే అడ్వాన్స్ కింద కొంతమొత్తం తీసుకుంటున్న దళారులు పరీక్షలు పూర్తయి ఉద్యోగానికి ఎంపికైన తర్వాత మిగతా మొత్తం చెల్లించాలని వారితో మాట తీసుకుంటున్నారు.
మళ్లీ అదే కథ..
సింగరేణిలో 2015లో 450 జూనియర్ అసిస్టెంట్ గ్రేడు-2 ఉద్యోగ నియామకాల సమయంలోనూ పరీక్షల్లో గందరగోళం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. పైరవీలు చేసుకున్న వారే ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రచారం జరిగింది. ఆ సమయంలోనూ పైరవీకారులు, దళారులు భారీగా త్తున నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత మళ్లీ తాజాగా జూనియర్ అసిస్టెంట్ గ్రేడు-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలవడంతో మళ్లీ పైరవీల దందా మొదలైంది. 2015లో నిర్వహించిన ఉద్యోగ ఎంపికలో ఒకే ఇంట్లో ఇద్దరికి, ఒకే ప్రాంతానికి చెందినవారు ఎంపికయ్యారని ఆరోపణలు వచ్చాయి. మళ్లీ అదేవిధంగా ఈసారి ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలవడంతో దళారులు డబ్బులు దండుకునే పనిలో పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థలో ఉద్యోగం దొరికితే భద్రత ఉంటుందన్న ఆశతో నిరుద్యోగులు ఎంత డబ్బులు చెల్లించడానికైనా ఆసక్తి చూపుతున్నారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్న పైరవీకారులు సొమ్ము చేసుకుంటున్నారు.
కార్మికుల విగ్రహం
అత్యధికంగా దరఖాస్తులు
సింగరేణిలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ గ్రేడు-2 ఖాళీల కోసం నిరుద్యోగులైన అభ్యర్థులు భారీ మొత్తంలో దరఖాస్తు చేసుకున్నారు. అంతర్గత ఖాళీలతో పాటు ఎక్స్టర్నల్ ఖాళీలకు అత్యధికంగా దరఖాస్తులు చేసుకున్నారు. ఎక్స్టర్నల్ ఖాళీలు 117 ఉద్యోగాలకు 1,03,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అంతర్గత ఖాళీలకు అర్హులైన ఉద్యోగులు 10 వేల వరకు దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబరు 4న రాత పరీక్షలకు సింగరేణి ఏర్పాట్లు చేస్తోంది. గతంలో జేఎన్టీయూ పరీక్షల బాధ్యతను అప్పగించింది. అప్పట్లో దీనిపై వివాదం తలెత్తింది. ఈసారి సింగరేణి యాజమాన్యమే స్వయంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పారదర్శకంగా ఎంపిక - బలరాం, సింగరేణి సంచాలకులు
సింగరేణి ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది. దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దు. దళారులు వచ్చి అడిగితే సమాచారం ఇవ్వండి. వారిపై క్రిమినల్ కేసులు పెట్టిస్తాం. దళారులు మాటలు నమ్మి ఎవరూ డబ్బులు నష్టపోవద్దు. జూనియర్ అసిస్టెంట్ గ్రేడు-2 ఉద్యోగాల ఎంపికపై ఎలాంటి అపోహలకు తావులేదు. ప్రతిభకే అవకాశం ఉంటుంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తాం. పైరవీకారులు చెప్పే మాయమాటలను నమ్మవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు
[ 20-05-2024]
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం స్వామివారికి లక్ష తులసి అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
కనిపిస్తే కరుస్తున్నాయ్!
[ 20-05-2024]
జిల్లాలో వీధి కుక్కలు బెంబేలేత్తిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చేవారిపై దాడికి పాల్పడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వీధుల్లో గుంపులుగా తిరుగుతూ బయట ఆడుకునే చిన్నారులతో పాటు వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. రాయికల్ పట్టణంలోని ఓ కాలనీలో ఒకే రోజు 11 మందిపై కుక్కలు దాడి చేశాయి. -
సా..గుతున్న అభివృద్ధి పనులు
[ 20-05-2024]
రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ను గత ప్రభుత్వం పురపాలక సంఘం హోదా కల్పించి అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లోంచి పెద్ద చెరువుపై మినీ ట్యాంక్బండ్, సమీపంలో ఉద్యానవనం ఏర్పాటుకు రూ.1.5 కోట్లు కేటాయించింది. -
పాఠ్య పుస్తకాలు వస్తున్నాయ్!
[ 20-05-2024]
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు త్వరగా అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతేడాది పంపిణీలో కొంత జాప్యం జరిగింది. -
పెరిగిన మామిడి దిగుబడి.. తగ్గిన ధర
[ 20-05-2024]
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడి ధర తగ్గింది. ఏడాది పొడవునా కంటికి రెప్పలా చూసుకునే చెట్లు... సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కాతకు సైతం ధర పడిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. -
పేరుకే పెద్ద ఆసుపత్రి!
[ 20-05-2024]
వైద్య విధాన పరిషత్లో నడుస్తున్న కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుసంధానం చేసి ఆరు నెలలైంది. ఇప్పటికీ బడ్జెట్ మంజూరు చేయకపోవడంతో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
[ 20-05-2024]
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 20-05-2024]
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సమయం సమీపిస్తున్నా ఏర్పాట్లేవీ!
[ 20-05-2024]
కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 1న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు. -
మహిళలకు రక్షణ... వేధింపులకు అడ్డుకట్ట
[ 20-05-2024]
‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. -
మహాలక్ష్ములతో ఆర్టీసీ కళకళ
[ 20-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులన్నీ కళకళలాడుతుండటంతో ఆదాయమూ పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అయిదు నెలల పరిస్థితిపై ‘న్యూస్టుడే’ కథనం. -
కొత్త రేషన్ కార్డులపై ఆశలు
[ 20-05-2024]
‘రేషన్ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరలకే అందిస్తాం. రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సహ ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాం. -
ప్రధాన రహదారి.. ప్రమాదాలకు నెలవు
[ 20-05-2024]
గౌతమినగర్ నుంచి రాజీవ్ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. -
అర్బన్ బ్యాంక్ ఎన్నికల సన్నాహక సమావేశం
[ 20-05-2024]
సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ బ్యాంక్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన నాయకులు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం అంతంతే
[ 20-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక