logo

అమ్మ మందలించిందని తనువు చాలించాడు

ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంటి పట్టున ఉండకుండా తిరుగుతూనే ఉన్నావని తల్లి మందలించినందుకు ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ  సంఘటన షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని నందిగామ

Published : 19 Jan 2022 03:59 IST


జంగిళి ఉదయ్‌

నందిగామ, న్యూస్‌టుడే: ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంటి పట్టున ఉండకుండా తిరుగుతూనే ఉన్నావని తల్లి మందలించినందుకు ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ  సంఘటన షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని నందిగామ మండలం నర్సప్పగూడలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జంగిళి మల్లేష్‌కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉంది. పెద్ద కుమారుడు ఉదయ్‌(21) నగరంలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం  చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఎక్కువగా బయట తిరగుతుండటంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఉదయ్‌ 16న ద్విచక్ర వాహనంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. నందిగామ ఠాణాలో 17న ఫిర్యాదు చేశారు. మంగళవారం స్థానిక చెరువులో శవమై తేలాడు. మృతుడి తండ్రి మల్లేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని