ఉక్రోషంతోనే రాళ్లు వేయిస్తున్నారు..
‘ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నారు. అయ్యా.. మీరు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా, ధైర్యంగా వస్తున్నా.
నన్ను ఎదుర్కోలేక కూటమిగా వస్తున్నారు
నేను లేకపోతే పథకాలు ఆగిపోతాయి.. వాలంటీర్లు ఇంటికి రారు
అనకాపల్లి జిల్లా సిద్ధం సభలో సీఎం జగన్
ఈనాడు, అనకాపల్లి: ‘ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నారు. అయ్యా.. మీరు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా, ధైర్యంగా వస్తున్నా. మూడుసార్లు సీఎంగా చేసి ఈ బచ్చాను చూసి భయపడి పొత్తులతో వస్తున్న మిమ్మల్ని ఏమనాలి? కుట్రలు పన్ని పది మందిని పోగేసుకుని కూటములు కట్టి నా ఒక్కడిపైకి వస్తున్నారు. బాబుకు తోడుగా దత్తపుత్రుడు, భాజపా, కాంగ్రెస్ కలిసి ఎగబడుతున్నాయి..’ అని సీఎం జగన్ విమర్శించారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం గొబ్బూరు వద్ద శనివారం ‘సిద్ధం’ సభలో ఆయన మాట్లాడారు. ‘బాబు బచ్చా అంటే నాకు కొన్ని కథలు గుర్తుకొస్తున్నాయి. కృష్ణుడిని బచ్చాగా అనుకున్న కంసుడి పరిస్థితేంటి? రాముణ్ని బచ్చా అనుకున్న మారీచుడు, హనుమంతుణ్ని బచ్చా అనుకున్న రావణుడు గుర్తుకొస్తున్నారు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు విలన్లు అందరికీ అటువైపు హీరోలందరూ బచ్చాల్లాగే కనిపిస్తారు..’ అని తనను తాను హీరోగా జగన్ ప్రకటించుకున్నారు.
నేను చేసినంత అభివృద్ధి చేశారా?
‘గతంలో ఏ ప్రభుత్వం చేయని పనులన్నీ 58 నెలల్లోనే చేసి చూపించా. వచ్చే 60 నెలలు పేదల తలరాతలు నిర్ణయించే ఎన్నికలివి. ప్రజల మనసు గెలిచి మనం.. మోసం, కుట్రల పొత్తులతో వస్తున్న వాళ్లతో తలపడబోతున్నాం. దీనికి మీరంతా సిద్ధమేనా?’ అని ప్రశ్నించారు. ‘మన ఈ సిద్ధం సభలు చూసి వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉక్రోషం, కడుపుమంటతో చంద్రబాబు నాపై రాళ్లు వేయమంటున్నారు. జగన్కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, పంచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలట. ఓ బాబూ.. ఎప్పుడైనా నేను చేసినంత అభివృద్ధి, సంక్షేమం చేశారా?’ అంటూ ప్రశ్నించారు.
జగన్ లేకపోతే పథకాలన్నింటికీ ముగింపే..
‘ఈ ఎన్నికలు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి కావు. పేదల భవిష్యత్తును నిర్ణయించేవి. జగన్ లేకపోతే ప్రజలు మోసపోతారు. పథకాలన్నింటికీ ముగింపే. వాలంటీర్లు ఇంటికి రారు. మోసపూరిత వాగ్దానాలు చూసి ఓట్లేయకండి’ అని జగన్ హితవు పలికారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేశారు. అనకాపల్లి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర తుస్సుమంది. నక్కపల్లి మండలం గొడిచర్ల నుంచి ఉదయం బయలుదేరిన జగన్కు ఎక్కడా ఆదరణ కనిపించలేదు. నక్కపల్లి, ఎస్.రాయవరం కూడళ్లలో కొంతమేర జనాలను కూడబెట్టి జేజేలు పలికించినా మిగతా చోట్ల ఎవరూ లేరు. ఎలమంచిలి వై జంక్షన్లో కనీసం 30 మంది లేరు.
జాతీయ రహదారి దిగ్బంధం
జగన్ బస్సు యాత్ర మొత్తం జాతీయ రహదారిపైనే సాగింది. గంటల తరబడి ట్రాఫిక్ నిలిపేయడంతో ప్రయాణికులంతా ఎండల్లో ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం జాతీయ రహదారిని ఆనుకుని సభ నిర్వహించడంతో మధ్యాహ్నంనుంచే వాహనాలను 50 కి.మీ. ముందు నుంచే మళ్లించేశారు. ఈ సభ కోసం ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలనుంచి వెయ్యికిపైగా బస్సులు తరలించారు. ఈ వాహనాలు 4 కి.మీ.మేర జాతీయ రహదారిపై నిలిచిపోవడంతో చాలా మంది బస్సులు దిగకుండానే వెనుదిరిగారు. సిద్ధం సభను చిన్న మైదానంలో నిర్వహించారు. వెయ్యికిపైగా బస్సుల్లో జనాలను తరలించడంతో సభా ప్రాంగణంలో నిల్చోడానికి చోటు లేకుండాపోయింది. దీంతో సభకు రాకముందే చాలామంది వెనక్కుమళ్లారు.
సమస్యలపై సీఎంకు వినతులు
నక్కపల్లి, పాయకరావుపేట, న్యూస్టుడే: సీఎం జగన్మోహన్రెడ్డికి బస్సు యాత్రలో పలువురు సమస్యలపై విన్నపాలనిచ్చారు. గ్రూప్1 అభ్యర్థులు ఆయన్ని కలిసి మాట్లాడారు. ప్రిలిమ్స్లో గ్రూప్-2 అభ్యర్థులకు 1:100 నిష్పత్తిలో అర్హత కల్పించినట్లే.. గ్రూప్-1 వారికి ఇవ్వాలన్నారు. తాండవ చక్కెర కర్మాగారం మూతపడటంతో రావాల్సిన వేతన బకాయిలను ఇప్పించాలని కార్మికులు కోరారు. నక్కపల్లి వద్ద హెటెరో మందుల పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని విన్నవించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు