icon icon icon
icon icon icon

వైకాపా నేత రాజమోహన్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

సామాజికవర్గం పేరుతో దూషించారంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఛైర్‌పర్సన్‌ వెంకటరమణమ్మ  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 21 Apr 2024 05:54 IST

ఆత్మకూరు, న్యూస్‌టుడే: సామాజికవర్గం పేరుతో దూషించారంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఛైర్‌పర్సన్‌ వెంకటరమణమ్మ  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఈ నెల 17న రచ్చబండలో రాజమోహన్‌రెడ్డి నన్ను కులం పేరుతో దూషించారు. ఈ విషయం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకొని మానసిక వేదనకు గురయ్యాను. నాకు రక్షణ కల్పించడంతో పాటు మేకపాటిపై చర్యలు తీసుకోవాలి’ అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img