ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరు
‘ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరందించడటమే తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళతాం.
ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యం
జగన్.. మీ చిల్లర వ్యవహారాలు ఆపాలి
చిరంజీవి జోలికొస్తే సహించేది లేదు..
నరసాపురం, భీమవరం వారాహి సభల్లో జనసేనాని పవన్ కల్యాణ్
ఈనాడు, భీమవరం: ‘ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరందించడటమే తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళతాం. నదులను అనుసంధానిస్తాం. వీలైనంత త్వరగా పోలవరం పూర్తి చేసి వలసలు, పస్తులు లేని రాష్ట్రాన్ని నిర్మిస్తాం. చేతివృత్తులను ఆదుకుంటాం. భవన నిర్మాణ కార్మికులను కాపాడుకుంటాం..’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, భీమవరంలలో ఆదివారం నిర్వహించిన వారాహి విజయభేరి సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు కీలకమని రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రంతో మాట్లాడి పొత్తు కోసం చాలా విషయాల్లో తగ్గానని అన్నారు. అన్న క్యాంటీన్లతోపాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లనూ నడిపిస్తామన్నారు. వశిష్ట వారధి పూర్తి చేయకుండా ఓట్లు అడగబోనని చెప్పిన జగన్కు ఈ ఎన్నికల్లో ప్రచారానికే అర్హత లేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతమున్న బీసీ రిజర్వేషన్లను 24 శాతం చేసి రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేశారని, రిజర్వేషన్ను తమ కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని తెలిపారు. కోనసీమలో రైలు కూత నరసాపురం వరకు వినిపించేలా చేస్తామని హామీనిచ్చారు.
‘ఆక్వా రైతులు కష్టాలు చెప్పి జగన్ను సాయం కోరితే వారికి గుదిబండలా మారారు. తెదేపా ప్రభుత్వం యూనిట్ విద్యుత్తు రూపాయిన్నర రాయితీతో ఇస్తే జగన్ రూ.5 చేసి నిండా ముంచారు. ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కడుతున్న జగన్కు హార్బర్, జెట్టి కట్టడం చేత కాలేదు. 70 లక్షల మత్స్యకార కుటుంబాలను దోచేందుకు 217 జీవో తెచ్చారు. దాన్ని మన ప్రభుత్వం రాగానే రద్దు చేస్తాం. మత్స్యకారులకు రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపజేస్తాం’ అని పేర్కొన్నారు. శెట్టి బలిజలపై తప్పుడు ఎక్సైజ్ కేసులు తొలగిస్తామని అన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలు కావు..
‘నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు. అన్ని కులాలు బాగుపడాలని కోరుకునేవాణ్ని. ఓటుబ్యాంకు రాజకీయాలు చేయను. జగన్కు కాపు ఓట్లు కావాలి. వారితో నన్ను తిట్టించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. మీరు శివశివాని స్కూల్లో పేపర్లు లీక్ చేసే కాలంలోనే చేగువేరా గురించి చదువుతున్నా. మీకు, నాకు అంత వ్యత్యాసముంది. నేను ఎమ్మెల్యే ప్రసాదరాజును తిడితే ఆయన్ని మాత్రమే తిట్టినట్లు. ఆయన కులాన్ని కాదు. నరసాపురంలో కక్షకట్టి ఒకే కులానికి చెందిన 40 మంది అధికారులను అన్యాయంగా బదిలీ చేయించారు. జగన్.. మీరు కులాలను విడగొడితే నేను ఏకం చేస్తా. వైకాపా గూండాలకు ఇదే హెచ్చరిస్తున్నా..’ అని పవన్ పేర్కొన్నారు.
సజ్జలా.. మా అన్న జోలికి రావద్దు
‘మా అన్నయ్య వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్కు ఇద్దరికి మద్దతు తెలుపుతున్నానని అన్నయ్య అనగానే చిరంజీవి వచ్చినా ఎవరొచ్చినా సింహం సింగిల్గా వస్తుందంటూ సజ్జల ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీరు ప్రజల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తింటున్నారు. ఎన్నికల సంఘం పార్టీలకు అనుకూలంగా మాట్లాడొద్దని చెప్పినా మారరు. అన్నయ్య అజాతశత్రువు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మా అన్నయ్య జోలికి వస్తే సహించేది లేదు. గతంలో మూడు రాజధానుల నిర్ణయం మంచిదేనని ఆయనతో అనుకూలంగా మాట్లాడించినా.. తమ్ముడిగా సహించా. వైకాపా పాలనలో చిరంజీవి, రజినీకాంత్ వంటి గొప్పవారికే మాట్లాడే స్వేచ్ఛ లేదు’ అని పవన్ తెలిపారు. ‘రాష్ట్రంలో 50 స్థానాల్లో బలమైన అభ్యర్థులుండీ పోటీ చేయగలిగే స్థాయిలో ఉండీ మీ భవిష్యత్తు కోసం వెనక్కి తగ్గా. జనసేన పోటీ చేస్తోంది 21 స్థానాలు కాదు.. 175 అని గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీలో వశిష్ట వారధి, డీఎస్సీ, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై చర్చించాలంటే కూటమి ప్రభుత్వం రావాలి’ అని పవన్ పేర్కొన్నారు. సభలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ (భాజపా), ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ (జనసేన), మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు తదితరులు పాల్గొన్నారు.
గ్రంధి శ్రీనుకు డిపాజిట్లు రాకుండా చేస్తాం
‘గ్రంధి శ్రీనివాస్ను ఏం అనకండి. కాపుల ఓట్లు చీలిపోతాయి’ అని మా పార్టీలో వారే అంటుంటే నాకే నీరసం వచ్చేసింది. ఏ కులం వారు చేసినా తప్పు తప్పే. భీమవరంలో 2 ఎకరాలు కొందామని చూస్తుంటే.. అమ్మకందారులను గ్రంధి శ్రీనివాస్ బెదిరించారు. ఆయనకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాం’ అని పవన్ అన్నారు. ‘జగన్ లాగా మూడోతరం రాజకీయ నాయకుడిని కాదు. కింది నుంచి పైకొచ్చిన వాడిని. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడే జగన్ ముఖ్యమంత్రా.. ముర్ఖుడా!’ అని పవన్ నిప్పులు చెరిగారు. ‘జగన్.. నేను భీమవరం నుంచి పారిపోవడం కాదు.. మీరే హామీల నుంచి పారిపోయారు. కోడికత్తితో పొడిస్తే అరిచినట్లు అవ్వలూ.. అమ్మలూ.. అక్కలూ అని దీర్ఘాలుతీస్తూ హామీలిచ్చారు. కరెంటు బిల్లుల వంకతో వేలమందికి పింఛన్లు తొలగించారు. జగన్ గెలిస్తే ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టేస్తారు. డిజిటలీకరణ చేసి మీ ఆస్తులు దోచేస్తారు. ఆలోచించి ఓటేయండి’ అని పవన్ హితవు పలికారు.
జ్వరంతో ఉన్నా మీ కోసం వచ్చా..
‘రాష్ట్రంలో ఏటా 1.3 లక్షల మంది విద్యార్థులు పట్టభద్రులవుతున్నా.. 30 శాతం మందికి కూడా ఉద్యోగాలు దొరకడం లేదు. వైకాపా రూ.5 వేలిచ్చి యువతను వాలంటరు ఉద్యోగాలకు పరిమితం చేయడం దారుణం. 20 రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నా ప్రజల భవిష్యత్తు కోసమే బయటకు వచ్చా’ అని జనసేనాని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
-
పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా