icon icon icon
icon icon icon

పౌరుషానికి, అహంకారానికి మధ్య యుద్ధమిది

వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఉండిలో ఆయన సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 23 Apr 2024 05:57 IST

తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు

ఉండి, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఉండిలో ఆయన సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్థానంలో ఎన్నికలను గోదావరి జిల్లావాసుల పౌరుషానికి.. జగన్‌ అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. జగన్‌రెడ్డిని తరిమికొట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, తాను కలిసే ఉంటామని.. విజయం కోసం సమష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా తమతో కలిసి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంతెన రామరాజు, నరసాపురం లోక్‌సభ అభ్యర్థి (భాజపా) భూపతిరాజు శ్రీనివాసవర్మ, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img