ఆడపడుచులను లక్షాధికారులను చేస్తాం
‘వైకాపాలో అందరూ మోసగాళ్లే ఉన్నారు. ఎన్నికల్లో మళ్లీ వచ్చి మాయమాటలు చెబుతారు. ఆలోచించి ఓటేయాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు మహిళలను కోరారు. ‘ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన నేత ఎన్టీఆర్.
పన్నులు, ధరలు తగ్గిస్తాం
భవిష్యత్తుపై ఆలోచించి ఓటేయండి
బొండపల్లి మహిళా సభలో తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, న్యూస్టుడే - విజయనగరం: ‘వైకాపాలో అందరూ మోసగాళ్లే ఉన్నారు. ఎన్నికల్లో మళ్లీ వచ్చి మాయమాటలు చెబుతారు. ఆలోచించి ఓటేయాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు మహిళలను కోరారు. ‘ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన నేత ఎన్టీఆర్. చెల్లెలికి ఆస్తి ఇవ్వకుండా, అప్పులిచ్చిన నేత జగన్రెడ్డి. అదీ తెదేపాకు, వైకాపాకు ఉన్న తేడా’ అని పేర్కొన్నారు. మహిళలను లక్షాధికారులను చేసే బాధ్యత తమదన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లిలో మంగళవారం ఉదయం మహిళా సభలో చంద్రబాబు ప్రసంగించారు. 2029 నాటికి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తాయని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో జగన్ అధికారం చేపట్టిన తరువాత ఎంతో మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆరోపించారు. ‘మహిళా శక్తి కోసం అన్నిరకాల పథకాలను ప్రవేశపెడతాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున అందిస్తాం. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. ప్రతి మహిళకూ నెలకు రూ.1500 ఇస్తాం. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. రాష్ట్రంలో నిత్యావసర ధరలే కాదు విద్యుత్తు ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు, చివరికి మద్యం ధరలు కూడా పెంచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బాదుడు లేని పాలన చూస్తారు. పన్నులు, అన్ని రకాల ధరలు తగ్గిస్తాం’ అని చెప్పారు. తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్గజపతిరాజు, విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భూ సర్వే పేరుతో దందా..
- హైమావతి, మాజీ సర్పంచి, నెలివాడ
నేను భూసర్వే బాధితురాలిని. పాస్పుస్తకాల్లో ఒకరి పేరు ఉంటే, రికార్డుల్లో వేరొకరి పేర్లు ఎక్కిస్తున్నారు. సర్వే నంబర్లు మార్చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. బెదిరించి, భూములు లాక్కుంటున్నారు.
చంద్రబాబు: ప్రతి గ్రామంలో ఇలాంటి లిటిగేషన్లే ఉన్నాయి. వైకాపా నాయకులు బెదిరించి రాయించుకుంటున్నారు. లేదంటే ప్రభుత్వ భూమి అంటూ 22-ఎలో పెడుతున్నారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం.
వడ్డీ లేకుండా రుణం ఇస్తారా?
- షర్మిల గాయత్రి, తమటాడ
కలలకు రెక్కలు పథకంలో భాగంగా రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణం ఇస్తానంటున్నారు? నేను డాక్టర్ కావాలనుకుంటున్నా. నాకు ఇవ్వగలరా?
చంద్రబాబు: ఆర్థిక పరిస్థితులు సహకరించక చదువుకోలేని వారి కోసమే కలలకు రెక్కలు పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. నాదీ గ్యారంటీ. (చంద్రబాబు ఆ యువతిని వేదికపైకి పిలిచి ఓ ధ్రువపత్రంపై సంతకం చేసి, అందించారు)
బీమా లేకుండా చేశారు..
- హైమావతి, ముచ్చర్ల గ్రామం
మా అమ్మ అనారోగ్యంతో హఠాత్తుగా చనిపోతే చంద్ర]న్న బీమా సాయంగా రూ.2 లక్షలు మా నాన్న ఖాతాలో వేసి ఆదుకున్నారు. వైకాపా వచ్చిన తర్వాత మా నాన్నకొచ్చిన పింఛను, నాకు నిరుద్యోగ భృతి తీసేశారు. మీరొస్తే మమ్మల్ని ఆదుకుంటారని భావిస్తున్నా.
చంద్రబాబు: రూ.2లక్షలున్న బీమాను రూ.5 లక్షలు చేశాం. 2019లో నేను వస్తే రూ.10 లక్షలు చేయాలనుకున్నా. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ నాన్నకు రూ.4 వేల పింఛను, నీకు నిరుద్యోగభృతి అందిస్తాం.
దారి లేకుండా చేశారు..
- పైడిరాజు, గొల్లలపేట, గజపతినగరం మండలం
మా నాన్న తెదేపాలో ఉన్నారని, వైకాపా నాయకులు మా ఇంటికి వెళ్లేందుకు దారి లేకుండా చేశారు. కొన్నిరోజుల క్రితం ఇంటికొచ్చి కొట్టారు.
చంద్రబాబు: మా కార్యకర్తలపై ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. వేధింపులకు పాల్పడుతున్నారు. న్యాయం జరిగేలా నేను చూస్తా.
ఐటీని ఆదుకోవాలి..
- నాగేశ్వరి, ఇంజినీరింగ్ పట్టభద్రురాలు, తమటాడ గ్రామం
రాష్ట్రంలో ఐటీ రంగం నిస్తేజంగా మారింది. నాలా ఇంజినీరింగ్ చదువుకున్నవారు గ్రామాల్లో ఖాళీగా ఉంటున్నారు. మీరు రాష్ట్రంలో ఐటీకి గతవైభవాన్ని తీసుకురావాలి.
చంద్రబాబు: వైకాపా హయాంలో పారిశ్రామికవేత్తల్ని భయపెట్టి, తరిమేశారు. మేం అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితిని మారుస్తాం.ఐటీ రంగాన్ని ఆదుకుంటాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను చేయను: అధిర్ రంజన్
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం