icon icon icon
icon icon icon

డీజీపీని బదిలీ చేయాల్సిందే

డీజీపీ రాజేంద్రనాథరెడ్డిని వెంటనే బదిలీ చేయాలని భాజపా మరోమారు డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో గురువారం ఫిర్యాదు అందజేసింది.

Published : 26 Apr 2024 04:36 IST

మరోమారు ఈసీకి ఫిర్యాదు చేసిన భాజపా

ఈనాడు, అమరావతి: డీజీపీ రాజేంద్రనాథరెడ్డిని వెంటనే బదిలీ చేయాలని భాజపా మరోమారు డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో గురువారం ఫిర్యాదు అందజేసింది. అనంతరం భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొందరు ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు పొలిటికల్‌ సర్వీస్‌ అధికారుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు జరుగుతున్నా, శాంతిభద్రతలు ఘోరంగా ఉన్నా డీజీపీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. డీజీపీని మార్చాలని కోరుతూ ఇప్పటికే రెండుసార్లు ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలంటే డీజీపీని మార్చాల్సిందేనని డిమాండ్‌చేశారు.

పోస్టల్‌ బ్యాలట్‌ గడువు పెంచాలి

ఎన్నికలు, ఇతర అత్యవసర విధుల్లో ఉన్న వారు పోస్టల్‌ బ్యాలట్‌ను వినియోగించుకునేందుకు విధించిన గడువు శుక్రవారంతో ముగుస్తుందని, దీన్ని పెంచాలని ఎన్నికల అధికారులను కోరినట్లు భానుప్రకాష్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img