‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’తో భూదోపిడీ
వైకాపా సర్కారు తీసుకువచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ భూ దోపిడీని ప్రోత్సహించేలా ఉందని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు.
సామాన్యుల హక్కులను హరిస్తున్నారు
జగన్ ప్రభుత్వంపై ఎన్డీయే నేతల ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా సర్కారు తీసుకువచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ భూ దోపిడీని ప్రోత్సహించేలా ఉందని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. భూహక్కు చట్టం-1909లోని ఏ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సీఎం జగన్ ఈ కొత్త చట్టం అమలుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్, తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్రెడ్డి సంయుక్తంగా విలేకర్లతో మాట్లాడారు. ‘లోపభూయిష్ఠంగా ఉన్న చట్టాన్ని కేంద్రం వ్యతిరేకించినా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసి అమలుకు యత్నిస్తోంది. దీనికి వ్యతిరేకంగా ఎన్డీయే పార్టీలు పోరాడాయి. బాధిత భూ హక్కుదారులు కోర్టులను ఆశ్రయించకుండా ఈ చట్టంలో కఠిన నిబంధనలు పెట్టారు. ప్రభుత్వం కేవలం 4 వేల గ్రామాల్లోనే భూసర్వే చేసింది. ఇంకా 13 వేల గ్రామాల్లో సర్వే చేయకుండానే ఆఘమేఘాలపై చట్టాన్ని అమలు చేయడం తగద’ని శివశంకర్ పేర్కొన్నారు.
బినామీలకు భూములు కట్టబెట్టే ఎత్తుగడ
తెదేపా నేత పట్టాభిరామ్ మాట్లాడుతూ ‘జగనన్న భూరక్ష పేరుతో జగన్ భూ భక్షణకు పాల్పడుతున్నారు. సౌర విద్యుత్ పార్క్ పేరిట వేల ఎకరాల ప్రభుత్వ భూములను తన బినామీ సంస్థలైన ఇండోసోల్, షిర్డీ సాయి కంపెనీలను ధారాదత్తం చేశారు. వైకాపా నేతల భూ దాహానికి తాళలేక కడప జిల్లాలో చేనేత వర్గానికి చెందిన సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. భూముల రీసర్వే పేరుతో జగన్ ప్రజల ఆస్తుల చుట్టూ తన ఫొటోతో హద్దు రాళ్లు వేయించుకోవడంలో మర్మమేంటో గ్రహించాలి’ అని కోరారు. భాజపా నేత భానుప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ ‘భూ చట్టాన్ని డిజిటలైజ్ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు తూట్లు పొడుస్తూ, జగన్ భూ హక్కు చట్టాన్ని తెచ్చారు. రెవెన్యూ అధికారుల చేతిలో చట్టాన్ని పెడితే.. ప్రజలకు ఎలాంటి మేలూ జరగదు. తిరుపతిలో రిజిస్టరైన పట్టా భూములను సైతం వైకాపా నేతలు కబ్జా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ చట్టాన్ని రద్దు చేస్తామ’ని స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలికి ‘కోడ్’ వర్తించదా?
కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఎన్నికల ప్రచారంలో కోడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆయన.. నామినేషన్ వేసే రోజే అధికారులు అనుమతించిన మార్గంలో కాకుండా తనకు నచ్చినట్లు వైకాపా శ్రేణులను మళ్లిస్తూ వెళ్లారు. -
ఆర్యవైశ్యుల స్థలాలను కబ్జా చేసిన కొడాలి నాని అనుచరులు
గుడివాడలో ఆర్యవైశ్య సామాజిక వర్గంవారు కొనుగోలు చేసిన 11 ఇళ్ల స్థలాలను స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరులు ఆక్రమించారని తెదేపా రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గోకవరపు సునీల్కుమార్ ఆరోపించారు. -
జగన్ మానసిక స్థితే వేరు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కర్నూలులోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో సోమవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘జగన్మోహన్రెడ్డి మానసిక స్థితిపై ఒక డాక్టర్ కొన్ని విషయాలు చెప్పారు. -
కూటమిలో కొత్త జోష్
కూటమి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన ప్రజాగళం సభ జనసందోహంతో దద్దరిల్లింది. ప్రధాని మోదీ రాక ఎన్డీయే శ్రేణుల్లో మంచి జోష్ నింపింది. సభను విజయవంతం చేసేదిశగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుతోపాటు మూడు పార్టీల నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. -
ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా.. జగన్ ఇక ఇంటికే!
పోస్టల్ ఓట్లు కొనేందుకు వెళ్తున్న వైకాపాను ఉద్యోగులంతా ఛీ కొడుతున్నారని.. రాష్ట్రంలో జగన్ సీను అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ఉద్యోగులంతా ఎన్డీయేకు ఓట్లు వేశారని, ఇంకా వేస్తున్నారని.. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా జగన్ ఇక ఇంటికి పోవడం ఖాయమని స్పష్టం చేశారు. -
వైకాపా కోటను బద్దలు కొడుతున్నాం
ఎన్నికల్లో వైకాపా కోటను బద్దలు కొడుతున్నామని.. ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని జనసేన అధినేత పవన్కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్రెడ్డి పాలనలో మట్టి, ఇసుక దోపిడీ.. మద్యంతో సహా అన్నీ కుంభకోణాలేనని రాష్ట్రాన్ని ఈ విషపు ఘడియల నుంచి అమృత ఘడియల్లోకి నడిపించాలని ప్రధాని మోదీని కోరారు. -
మోసానికి ప్యాంటు, షర్టు వేస్తే అది జగనే
వేమగిరి నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: మోసానికి ప్యాంటు, షర్టు వేస్తే అచ్చం జగన్లాగే ఉంటుందని తెదేపా ప్రధానకార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ పాలనలో మొదటి బాధితులు యువతేనన్నారు. రాష్ట్రానికి కొత్తగా ఒక్క కంపెనీ తీసుకురాకపోగా, ఉన్నవాటినీ తరిమేశారని మండిపడ్డారు. -
ప్రజాకంటకుడిని గద్దె దించడానికే మూడు పార్టీల కలయిక
‘దుష్టపాలనను అంతమొందించేందుకు, ప్రజా కంటకుడిని గద్దె దించేందుకు మూడు పార్టీల కలయిక జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్కల్యాణ్ శక్తి ఈ కలయికలో ఉంది’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి పురందేశ్వరి అన్నారు. -
రాజమహేంద్రవరంలో జన గోదావరి!
గోదావరి తీరం పులకరించింది. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో సోమవారం జరిగిన ఎన్డీయే సభ దిగ్విజయమైంది. సభా ప్రాంగణంలోని గ్యాలరీలు నిండిపోగా, కార్యకర్తలతో వేమగిరి ఉప్పొంగింది. -
విమర్శలను విధానాలకే పరిమితం చేయండి
ప్రచార సభల్లో ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు... ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది. -
పెమ్మసాని, గళ్లాలపై కేసు నమోదు
గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి, తెదేపా నేత మల్లెల రాజేశ్ నాయుడులపై పట్టాభిపురం ఠాణాలో కేసు నమోదైంది. -
డబ్బులిచ్చి.. వాలంటీర్లతో రాజీనామా చేయించి
తాము ఏమి చెప్పినా వాలంటీర్లు వింటారనుకుంటున్న వైకాపా నాయకులకు వారు ఝలక్ ఇస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు మండలంలో 14 గ్రామ సచివాలయాల పరిధిలో 142 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. -
మంత్రి జోగి రమేశ్ కుమారుడు, వైకాపా నేతలపై కేసు
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాకలో దళితులపై వైకాపా నేతల దాడి ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈ దాడిపై ‘ఈనాడు’లో వెలువడిన కథనాన్ని రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులకు సోమవారం ఆదేశాలు జారీ అయ్యాయి. -
తాడిపత్రిలో ఓటర్లకు వైకాపా ప్రలోభాలు
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వైకాపా నాయకులు అనంతపురం జిల్లా తాడిపత్రిలో డబ్బుల పంపిణీకి స్లిప్పులను ఇస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఒక్కో ఓటరుకు రూ.2 వేలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. -
తెదేపా కార్యకర్తల ఇళ్లపై వైకాపా వర్గీయుల రాళ్లదాడి
ఏలూరు గ్రామీణ మండలం ప్రత్తికోళ్లలంకలో వైకాపా వర్గీయులు తెదేపా కార్యకర్తల ఇళ్లపై రాళ్లదాడి చేశారు. వైకాపా ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గ్రామంలో సోమవారం ప్రచారం చేశారు. -
11వ తేదీ వరకు బ్యాలట్ వినియోగించుకునే అవకాశం కల్పించాలి
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే అవకాశం ఈ నెల 11వ తేదీ వరకు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల ఐక్యవేదిక ఛైర్మన్ సూర్యనారాయణ ఓ ప్రకటనలో కోరారు. -
వైకాపాది మాఫియా రాజ్యం
ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైకాపాను పూర్తిగా తిరస్కరిస్తోంది. వైకాపాకు 5 ఏళ్ల పాటు పాలించే అవకాశం ఇచ్చారు. వాళ్లు ఆ అవకాశాన్ని వృథా చేశారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వెనక్కి మళ్లేలా చేశారు. ఖజానాను ఖాళీ చేసి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. -
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది
‘రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. పథకాలకు సంబంధించి బటన్లు నొక్కినా.. ఖాతాల్లో డబ్బులు పడకుండా కుట్రలు పన్నుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారు. -
జగన్ ఓ ఊసరవెల్లి.. నోరు తెరిస్తే అబద్ధాలే
వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్రెడ్డిని తీసుకొచ్చి కడపలో నిలబెట్టడం జగన్కు అధికారం ఉందన్న అహంకారంతోనే. అవినాష్రెడ్డిని చట్టసభలకు వెళ్ల్లకుండా చూడాలనే అక్కడ పోటీ చేస్తున్నాను. న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో గెలిచేది నేనే. -
రూ.4000 - రూ.3000 ఏది కావాలో తేల్చుకోండి!
రాష్ట్రంలో రాజకీయం పింఛను చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇదే ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండా... పార్టీలకు ముఖ్య ప్రచారాస్త్రం ఆసరాగా నిలవాల్సిన పింఛన్ల విషయంలో న్యాయం చేసిందెవరు? మోసం చేసిందెవరు? -
పోస్టల్ బ్యాలట్ పోలింగ్పై అదే నిర్లక్ష్యం
నాలుగు రోజులుగా పోస్టల్ ఓట్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. సమస్యలను పరిష్కరించడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోంది. ప్రతి ఓటు విలువైనదేనని చెప్పే ఎన్నికల సంఘమే ఉద్యోగుల ఓట్లపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
తాజా వార్తలు
-
మా ఇంట్లో ఓట్లు.. అమ్మకానికి లేవు
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)