icon icon icon
icon icon icon

తెదేపా కార్యకర్తల ఇళ్లపై వైకాపా వర్గీయుల రాళ్లదాడి

ఏలూరు గ్రామీణ మండలం ప్రత్తికోళ్లలంకలో వైకాపా వర్గీయులు తెదేపా కార్యకర్తల ఇళ్లపై రాళ్లదాడి చేశారు. వైకాపా ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గ్రామంలో సోమవారం ప్రచారం చేశారు.

Published : 07 May 2024 04:52 IST

అబ్బయ్యచౌదరి ప్రచారంలో ఘటన

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఏలూరు గ్రామీణ మండలం ప్రత్తికోళ్లలంకలో వైకాపా వర్గీయులు తెదేపా కార్యకర్తల ఇళ్లపై రాళ్లదాడి చేశారు. వైకాపా ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గ్రామంలో సోమవారం ప్రచారం చేశారు. తెదేపా కార్యకర్తల నివాసాల సమీపంలోకి రాగానే ఓ ఇంటిపై ఉన్న తెదేపా జెండాను చూసి వైకాపా కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో గ్రామ మహిళలు, తెదేపా కార్యకర్తలు పార్టీ జెండాలు ఊపడం ప్రారంభించారు. వైకాపా కార్యకర్తలు వారి ఇళ్లపై రాళ్లు రువ్వారు. దీంతో ప్రచారరథంపై ఉన్న అబ్బయ్య చౌదరిని చూసి గ్రామ మహిళలు తీవ్ర ఆగ్రహంతో దుమ్మెత్తిపోశారు. మహిళలంటే గౌరవం లేని ఎమ్మెల్యేకి ఎలా ఓటేస్తామని ప్రశ్నించారు. కొల్లేరు నుంచి గ్రామానికి రావాల్సిన రూ.45 లక్షల ఆదాయం దోచుకున్న దొంగను ఎమ్మెల్యేని చేశారంటూ ఆరోపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సర్దుబాటు చేశారు. దీంతో అబ్బయ్యచౌదరి ప్రచారాన్ని నిలిపేసి గ్రామం నుంచి  వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img