జగన్ మానసిక స్థితే వేరు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కర్నూలులోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో సోమవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘జగన్మోహన్రెడ్డి మానసిక స్థితిపై ఒక డాక్టర్ కొన్ని విషయాలు చెప్పారు.
ఆయన చెప్పిందే జరగాలన్న మొండిపట్టు
ఇదేంటని ప్రశ్నిస్తే దాడులు
మీ ఆస్తులు కొట్టేసేవారు మీకు కావాలా?
కర్నూలు సభలో చంద్రబాబు ధ్వజం
ఈనాడు, కర్నూలు: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కర్నూలులోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో సోమవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘జగన్మోహన్రెడ్డి మానసిక స్థితిపై ఒక డాక్టర్ కొన్ని విషయాలు చెప్పారు. జగన్కు నార్సిస్టిక్ సమస్య ఉందని తేల్చారు. ఆ సమస్యతో ఉన్నవాళ్లు చెప్పినవే మళ్లీ మళ్లీ చెబుతుంటారు. తాము చేసేదే ఇతరులు కూడా చేయాలని కోరుకుంటారు. ఎదురుతిరిగితే దాడి చేస్తారు. చంపేస్తారు. హిట్లర్, బిన్లాడెన్, తాలిబన్లు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆ కోవకు చెందినవారే. ఆ కిమ్కు తాత మన జిమ్ అని పేర్కొన్నారు. జగన్ కూడా ప్రజలకు పదేపదే అబద్ధాలు చెబుతున్నారా? లేదా? ఆయన అందరినీ మోసం చేస్తూనే ఉంటారు. ఎవరైనా అడ్డొస్తే నరికేస్తారు. ఆయనకు తల్లి మీద కూడా ప్రేమ లేదు. మొన్నటి వరకు వైకాపాకు గౌరవాధ్యక్షురాలైన ఆయన తల్లి ఇప్పుడు ఎక్కడున్నారు? తల్లిని చూసుకోలేని వ్యక్తి ప్రజల్ని చూస్తారా? చెల్లెలికి ఆస్తిలో సమానహక్కు ఇచ్చారా? చెల్లెలు కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడుతున్నారంటే మానసిక వైకల్యమే. ఇలాంటివారు తండ్రిని, పిల్లలను, చివరికి వారిని వారు కూడా ప్రేమించుకోలేరు. నంద్యాల జిల్లాలో నాపై ఏ కేసూ లేదు. అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేస్తామన్నారు. ఎందుకని అడిగితే అరెస్టు చేసిన తర్వాత చెబుతామన్నారు. నాకే దిక్కులేకుండా పోతే మీ పరిస్థితేంటి అని అడుగుతున్నా. పాలించమని అధికారం ఇస్తే ఐదేళ్లపాటు సచివాలయానికే రాలేదు. ఇది అహంకారం కాదా? కర్నూలులో ఒక్క అంగుళం అభివృద్ధి అయినా జరిగిందా? ఇది మోసం కాదా’ అని చంద్రబాబు నిలదీశారు.
చెట్టు, పుట్ట ఏది చూసినా భయమేనా?
‘జగన్కు చెట్టును చూస్తే భయం. పుట్ట చూస్తే భయం. ఇప్పుడు మాత్రం పరదాలు తీసేసి ఓట్ల కోసం వస్తున్నారు. రాయలసీమలో 198 ప్రాజెక్టులను పూర్తిగా రద్దు చేశారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. నాసిరకం మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతుంటే చూస్తూ ఆనందపడుతున్నారు. అదీ మానసిక సమస్యే’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. తనను కూడా చంపాలని ప్రయత్నించారన్నారు. జగన్ 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని చంపేసి తానొక్కడే బతకాలనుకున్నారని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి క్లాస్వార్ అంటున్నారని.. తాను ఆయన దోచేసిన డబ్బులపై క్యాష్వార్ చేస్తున్నానని వ్యాఖ్యానించారు.
పులివెందులలో జగన్కు ఎదురుగాలి
జగన్కు పులివెందులలో కూడా ఎదురుగాలి వీస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్లో అసహనం పెరిగిపోతోందని, ఓటమి తట్టుకోలేక ఆయన ఏం చేస్తారో తెలియదని వ్యాఖ్యానించారు. అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు, గూండాగిరిని అణచివేయడానికి, మళ్లీ పోలవరాన్ని నిర్మించి రైతులకు నీళ్లు ఇచ్చేందుకు, అమరావతిని నిర్మించి ఉద్యోగాలు ఇచ్చేందుకు పొత్తుపెట్టుకున్నామని అమిత్షా కూడా చెప్పారన్నారు. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో వేయించుకున్నారని, ల్యాండ్ టైటిలింగ్ పేరుతో మరో నల్లచట్టం తెచ్చి, ప్రజల భూములన్నీ తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకాల ప్రతులను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతులను ఆయన తగలబెట్టారు. మీ ఆస్తులు కొట్టేసేవారు మీకు కావాలా అని ప్రశ్నించారు.
సూపర్ సిక్స్తో ప్రజల జీవితాలు మారతాయి
సూపర్సిక్స్తో ప్రజల జీవితాలు మారతాయని.. అందుకే ప్రజా మ్యానిఫెస్టోతో వచ్చానని చంద్రబాబు చెప్పారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు వస్తాయన్నారు. బీసీల సంక్షేమానికి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నామని పేర్కొన్నారు. ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లను కాపాడతానన్నారు. వాలంటీర్లు లేరన్న సాకుతో జగన్.. పింఛన్ల కోసం వృద్ధులను బ్యాంకులు, సచివాలయాల చుట్టూ తిప్పించుకుని 33 మందిని పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. సచివాలయంలో ఉండే 14 మంది ఉద్యోగులు ఒక్కొక్కరు 40 మందికి పింఛన్లు ఇచ్చినా పంపిణీ పూర్తయ్యేదన్నారు.
ఉద్యోగుల్లో 80% మంది తెదేపాకే ఓట్లేశారు
ఉద్యోగుల్లో 80%మంది తెదేపాకే వేశారని చంద్రబాబు వివరించారు. ఎండలంటూ ఎవరూ ఓటు వేయకుండా వదిలేయొద్దని కోరారు.ఓటేసి జీవితాలు మార్చుకుందామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం