రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది
‘రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. పథకాలకు సంబంధించి బటన్లు నొక్కినా.. ఖాతాల్లో డబ్బులు పడకుండా కుట్రలు పన్నుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారు.
అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారు
సీఎం జగన్ నిరాశావాదం
మాచర్ల, రేపల్లె, మచిలీపట్నం సభల్లో ప్రచారం
ఈనాడు, అమరావతి, బాపట్ల - ఈనాడు డిజిటల్, మచిలీపట్నం, నరసరావుపేట: ‘రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. పథకాలకు సంబంధించి బటన్లు నొక్కినా.. ఖాతాల్లో డబ్బులు పడకుండా కుట్రలు పన్నుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారు. రూ.2.70 లక్షల కోట్లను నేరుగా మీ ఖాతాల్లో జమ చేశాను. మీ బిడ్డ పరిపాలన కారణంగా అందరి కుటుంబాలకూ మేలు జరిగింది. దీనిని అడ్డుకునే వారితో యుద్ధం చేస్తున్నాం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత చాలా అవసరం. ఇక్కడ ఓటు వేస్తే.. దిల్లీ దాకా ఈ సందేశం వినిపించాలి’ అని సీఎం జగన్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె, పల్నాడు జిల్లా మాచర్ల, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం నిర్వహించిన ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు.
దుష్ప్రచారం చేస్తున్నారు
‘వైకాపా ప్రభుత్వంపై లేనిపోని అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్కు ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయి. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే పేదలకు మేలు చేసిన ఒక్క పథకమూ గుర్తుకురాని పరిస్థితి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ చట్టం కారణంగా యజమానులకు సంపూర్ణ హక్కులు దక్కుతాయి. రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఉన్న భూముల సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకే దీనిని తీసుకొచ్చాం’ అని సీఎం చెప్పారు. ‘2014లో భాజపా, జనసేనతో కలిసి చంద్రబాబు పోటీ చేశారు. అప్పుడు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్నీ అమలు చేయలేదు. మళ్లీ ఇప్పుడు ఆ ముగ్గురూ కూటమి కట్టి సూపర్-6 అని వచ్చారు. వీరిని నమ్మాలా?’ అని ప్రశ్నించారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఆయనకు ఉన్నత పదవి ఇప్పిస్తానని సీఎం చెప్పారు.నరసరావుపేట లోక్సభ అభ్యర్థి అనిల్కుమార్ను గెలిపించాలని ప్రజలను కోరారు.
మండుటెండలో జనానికి ఇక్కట్లు
రేపల్లెలో ఉదయం 9 గంటలకే సభ అని చెప్పి వైకాపా నాయకులు.. గ్రామీణ ప్రాంతాల నుంచి జనాన్ని తరలించారు. సీఎం రెండు గంటలు ఆలస్యంగా చేరుకోవడంతో ఎండవేడికి తాళలేక పలువురు స్పృహ తప్పి పడిపోయారు. వారిని పట్టించుకున్నవారు లేరు. సభ జరిగే చోటు ఇరుకుగా ఉండటంతో ఊపిరాడక కొందరు అస్వస్థతకు గురయ్యారు. తాలూకా సెంటర్ మొదలుకుని పలు మార్గాల్లో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గుంటూరు, పొన్నూరు, తెనాలి, బాపట్ల, చీరాల వైపు నుంచి రేపల్లెకు వచ్చే ఆర్టీసీ బస్సులను సీఎం సభ ఉందని చెప్పి.. పట్టణం వెలుపల అంకమ్మ చెట్టు సెంటర్ వద్ద నుంచే వెనక్కి మళ్లించారు. అక్కడి నుంచి కిలోమీటరున్నర మేర వ్యయ, ప్రయాసలకోర్చి ప్రయాణికులు బస్టాండ్, రైల్వేస్టేషన్లకు చేరుకోవాల్సి వచ్చింది. మాచర్లలో సీఎం జగన్ సభను ఎలాగైనా విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు నియోజకవర్గ వ్యాప్తంగా డబ్బు, బిర్యానీ, మద్యం పంచి, జనాన్ని తరలించారు. జగన్ మధ్యాహ్నం 12.30 గంటలకు రావాల్సి ఉంది. ఆయన ఆలస్యంగా 1.45 గంటలకు వచ్చి ప్రసంగం మొదలు పెట్టగానే అప్పటిదాకా వేచిచూసిన జనం ఇళ్లబాట పట్టారు. జనం వెళ్లి పోతుండటాన్ని చూసిన సీఎం అసహనంతో గట్టిగా గట్టిగా అరుస్తున్న మాదిరిగా ప్రసంగించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్