సంక్షిప్త వార్తలు(6)
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే అవకాశం ఈ నెల 11వ తేదీ వరకు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల ఐక్యవేదిక ఛైర్మన్ సూర్యనారాయణ ఓ ప్రకటనలో కోరారు.
11వ తేదీ వరకు బ్యాలట్ వినియోగించుకునే అవకాశం కల్పించాలి
ఈనాడు డిజిటల్, అమరావతి: పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే అవకాశం ఈ నెల 11వ తేదీ వరకు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల ఐక్యవేదిక ఛైర్మన్ సూర్యనారాయణ ఓ ప్రకటనలో కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతీ ఉద్యోగి ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలని అన్నారు.
ఎన్డీయే కూటమి వెంటే ప్రజలు: మోదీ
ఈనాడు డిజిటల్, అమరావతి: ‘ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం. మీ ఉత్తేజపరిచే ప్రసంగం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’ అని తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం ఉదయం ఎక్స్లో పోస్టు చేశారు. దీనికి ప్రధాని మోదీ స్పందించారు. ‘ధన్యవాదాలు మిత్రమా.. ఆంధ్రప్రదేశ్కు చేరుకుని రాజమహేంద్రవరం సభకు వెళ్తున్నాను. మరో సభ అనకాపల్లిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీయే కూటమితోనే ఉన్నారు’ అని బదులిచ్చారు.
ఆ మహిళా ఉద్యోగి మనందరికీ స్ఫూర్తి : చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: జగన్ పాలన, జగన్ నోట్లు..రెండూ వద్దని ఛీకొట్టిన ఒంగోలుకు చెందిన మహిళా ఉద్యోగే మనందరికీ స్ఫూర్తి అని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఓటుకు రూ.5 వేలు తీసుకుని వైకాపాకు ఓటేయమని అధికార పార్టీ నాయకులు పెట్టిన ప్రలోభాలకు ఆమె లొంగలేదని తెలిపారు. ‘ఓట్లేయలేం.. మీ నోట్లు మాకొద్దు’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని ఎక్స్లో పోస్టు చేశారు.
తెదేపా రాష్ట్ర కమిటీలోకి పలువురి నియామకం
ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా నలుగుర్ని.. కార్యదర్శులుగా ముగ్గుర్ని ఆ పార్టీ నియమించింది. కార్యనిర్వాహక కార్యదర్శులుగా జీవీఎన్ శేఖర్రెడ్డి (కోవూరు), కసుకుర్తి హనుమంతరావు (గుంటూరు పశ్చిమ), మన్నెం శ్రీనివాసులునాయుడు (తిరుపతి), కొండవీటి భావన (అనంతపురం అర్బన్).. కార్యదర్శులుగా గుల్లపల్లి సుదర్శన్రావు (కురుపాం), తోట రత్నం (విశాఖపట్నం పశ్చిమ), రాయల్ మురళి (అనంతపురం అర్బన్)ని నియమించారు. తెలుగుయువత కార్యదర్శిగా అనిల్చౌదరి (కళ్యాణదుర్గం)ని ఎంపిక చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.
ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా ఏమిచ్చారో చెప్పండి..?: డూండి రాకేష్
ఈనాడు డిజిటల్, అమరావతి: ఆర్యవైశ్యులను అణగదొక్కడమే లక్ష్యంగా సీఎం జగన్ అయిదేళ్ల పాలన కొనసాగించారని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ మండిపడ్డారు. అయిదేళ్ల వైకాపా పాలనలో 12 మంది ఆర్యవైశ్యులను హత్య చేశారని, 100కి పైగా దాడులు చేశారని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘గత ఎన్నికల హామీల్లో ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులిస్తామని చెప్పి మొండిచేయి చూపించారు. పైగా కార్పొరేషన్కు నిధులిచ్చామని బూటకపు మాటలు చెబుతున్నారు. వారికి సత్రాలు నడిపే హక్కులు ఇస్తామని మోసం చేశారు. ఈ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్యవైశ్యుల ఊసే లేదు. అందరికీ ఇచ్చేవి కాకుండా ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా నిధులు, పథకాలు ఎప్పుడు ఇచ్చారో చెప్పాలి. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం’ అని సవాల్ చేశారు.
సామాన్యుల ఆస్తులకు సంకెళ్లు: కె.రామకృష్ణ
విజయవాడ(అలంకార్కూడలి), న్యూస్టుడే : ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం అమలుకు జగన్ ప్రభుత్వం ఉవ్విళ్లూరడం దుర్మార్గమని, ఈ చట్టం సామాన్యుల ఆస్తులకు సంకెళ్లు వేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం వేగవంతంగా ఈ చట్టాన్ని అమలు చేసేందుకు సిద్ధమైందని, పలు వివాదాలకు తావిస్తోందన్నారు. ఈ చట్టం వల్ల తన తల్లిదండ్రుల భూముల మ్యుటేషన్కు సంబంధించి ఎదుర్కొంటున్న ఇబ్బందులను విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.పి.వి.రమేష్ వెల్లడించారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పెద్ద వారే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంటే.. సామాన్యుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుందని పేర్కొన్నారు. భూ యాజమాన్య హక్కు చట్టం సామాన్యుల ఆస్తులకు సంకెళ్లుగా గోచరిస్తోందని, ఇది ప్రజల ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర పాలకుల పెత్తనంలా మారిందని రామకృష్ణ ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..