రాజమహేంద్రవరంలో జన గోదావరి!
గోదావరి తీరం పులకరించింది. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో సోమవారం జరిగిన ఎన్డీయే సభ దిగ్విజయమైంది. సభా ప్రాంగణంలోని గ్యాలరీలు నిండిపోగా, కార్యకర్తలతో వేమగిరి ఉప్పొంగింది.
భారీగా తరలివచ్చిన తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు
రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేక ప్రతినిధి: గోదావరి తీరం పులకరించింది. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో సోమవారం జరిగిన ఎన్డీయే సభ దిగ్విజయమైంది. సభా ప్రాంగణంలోని గ్యాలరీలు నిండిపోగా, కార్యకర్తలతో వేమగిరి ఉప్పొంగింది. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ సభలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పేర్లు మైకులో వినిపించగానే సభకు హాజరైన వారి నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెలుగుదేశం, జనసేన, భాజపా కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రజాగళం సభకు తరలివచ్చారు. సభ దిగ్విజయం కావడంతో ఎన్డీయే నేతల్లో సంతోషం పెల్లుబికింది. నిర్దేశిత సమయం కంటే ప్రధాని మోదీ అరగంట ఆలస్యంగా వేదిక వద్దకు రాగా..70 నిమిషాల్లో సభ ముగిసింది. ప్రధాని మోదీ.. ‘నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో మాట్లాడుతూ రెండు చేతులూ పైకెత్తి సభికులకు అభివాదం చేశారు. ఆ తరవాత హిందీలో రాజమహేంద్రవరం వాసులకు నమస్సులు. గోదావరి మాతకు ప్రణామాలు. ఈ నేలపైనే తెలుగు కవి ఆదికవి నన్నయ్య తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు. ఈ మహత్తర నేల నుంచి ఇప్పుడు కొత్త చరిత్ర ప్రారంభమవుతుంది’ అని పేర్కొన్నారు. ఆ తరవాత ఆయన వైకాపా ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
తాపేశ్వరం కాజా రుచి చూడాలని మోదీని కోరిన లోకేశ్
నారా లోకేశ్ తన ప్రసంగంలో..‘నాకు అన్న సమానమైన పవన్ అన్నకు’ అని అనగానే సభ హోరెత్తింది. ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా రుచి చూడాలని మోదీని ఈ సందర్భంగా లోకేశ్ కోరారు. ఫిర్ ఏక్బార్.. మోదీ సర్కార్ అని లోకేశ్ అనడంతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.
పవన్ పేరు చెప్పగానే విశేష స్పందన
సభలో పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే అనూహ్య స్పందన కనిపించింది. రాజమహేంద్రవరానికి సుమారు 10 కి.మీ. దూరంలో వేమగిరి ఉంది. సభ కోసం సుమారు 50 ఎకరాల్లో జర్మన్ హ్యాంగర్లను ఏర్పాటుచేశారు. రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, ఏలూరు, నరసాపురం లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని మూడు పార్టీల కార్యకర్తలు సోమవారం ఉదయం 11 గంటల నుంచే వేమగిరికి రావడం మొదలైంది. ప్రధాని మోదీ వేదిక వద్దకు చేరుకున్న తరవాత కూడా కార్యకర్తలు వస్తూనే ఉన్నారు. పోలీసులు బందోబస్తు పేరుతో కొంత అతిగా వ్యవహరించారు. బస్సులను హెలిప్యాడ్కు దూరంగా నిలిపివేయడంతో కార్యకర్తలు ఎండలో ఇబ్బందులు పడుతూ సభాస్థలికి చేరుకున్నారు. పోలీసులు ప్రధాన రహదారిని పర్యవేక్షిస్తూ రాకపోకలను నిలిపివేశారు. దీంతో వేల మంది అవస్థలుపడ్డారు.
ప్రధాని మోదీకి పవన్ పాదాభివందనం
పాదాభివందనం చేస్తున్న పవన్కల్యాణ్ను వారిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ప్రధాని మోదీ వేదికపైకి రాగానే నిల్చొని ఉన్న నేతల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. ఈ సందర్భంగా మోదీని పవన్ కల్యాణ్ శాలువాతో సత్కరించి పాదాభివందనం చేశారు. స్పందించిన ప్రధాని పాదాభివందనం వద్దంటూ వేలు చూపిస్తూ ఆప్యాయంగా ఆయనను వారించారు. ఈ సమయంలో పీఎం మోదీ కూడా ప్రతీ నమస్కారం కింద కాస్త వంగారు. అంతకుముందు వేదికపై పవన్ను భుజం తట్టి పలకరించారు. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా శాలువాతో ప్రధానిని సత్కరించి జ్ఞాపిక అందజేశారు. లోకేశ్ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారు. నరసాపురం భాజపా లోక్సభ అభ్యర్థి శ్రీనివాస వర్మ తదితరులు మోదీకి ధనస్సును అందించారు. ఈ బహిరంగ సభ కవరేజీకి జాతీయ మీడియా ప్రతినిధులు, అమెరికా నుంచి కాలమిస్టులూ వచ్చారు.
- రాజమహేంద్రవరం తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, సిటింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీలను ప్రధాని మోదీకి లోకేశ్ పరిచయం చేశారు.
- రాజమహేంద్రవరం సభలో ఆయన ప్రసంగం వీడియోను మోదీ ఎక్స్లో ఉంచారు. ఎన్డీయేకు లభిస్తున్న మద్దతు ఏపీలో కూటమేతర పక్షాలకు నిద్రలేని రాత్రులు ఇస్తోందంటూ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!