icon icon icon
icon icon icon

పెమ్మసాని, గళ్లాలపై కేసు నమోదు

గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి, తెదేపా నేత మల్లెల రాజేశ్‌ నాయుడులపై పట్టాభిపురం ఠాణాలో కేసు నమోదైంది.

Published : 07 May 2024 04:56 IST

అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి రజిని ఫిర్యాదు

గుంటూరు(పట్టాభిపురం), న్యూస్‌టుడే: గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి, తెదేపా నేత మల్లెల రాజేశ్‌ నాయుడులపై పట్టాభిపురం ఠాణాలో కేసు నమోదైంది. చంద్రశేఖర్‌, మాధవి, రాజేశ్‌ నాయుడులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో తాను అవినీతికి పాల్పడినట్లు అసత్యాలు ప్రచారం చేశారని మంత్రి విడదల రజిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఆ ముగ్గురిపై పలు సెక్షన్ల కింద ఆదివారమే కేసులు నమోదు చేయగా.. ఆ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img