ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా.. జగన్ ఇక ఇంటికే!
పోస్టల్ ఓట్లు కొనేందుకు వెళ్తున్న వైకాపాను ఉద్యోగులంతా ఛీ కొడుతున్నారని.. రాష్ట్రంలో జగన్ సీను అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ఉద్యోగులంతా ఎన్డీయేకు ఓట్లు వేశారని, ఇంకా వేస్తున్నారని.. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా జగన్ ఇక ఇంటికి పోవడం ఖాయమని స్పష్టం చేశారు.
పోస్టల్ ఓట్లకు డబ్బిస్తామన్న వైకాపాను ఛీ కొడుతున్న ఉద్యోగులు
అనకాపల్లి సభలో విరుచుకుపడిన చంద్రబాబు
కూటమిదే పీఠమని ధీమా
ఈనాడు, అనకాపల్లి: పోస్టల్ ఓట్లు కొనేందుకు వెళ్తున్న వైకాపాను ఉద్యోగులంతా ఛీ కొడుతున్నారని.. రాష్ట్రంలో జగన్ సీను అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ఉద్యోగులంతా ఎన్డీయేకు ఓట్లు వేశారని, ఇంకా వేస్తున్నారని.. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా జగన్ ఇక ఇంటికి పోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఎన్డీయే గెలుపును ఎవరూ అడ్డుకోలేరని.. 160 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లిలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘వైకాపా వాళ్లు వెళ్లి డబ్బులిస్తున్నా ఉద్యోగులు వద్దని ఛీ కొడుతున్నారు. ఒంగోలులో ఒక మహిళకు వైకాపా వాళ్లు ఓటుకు రూ.5 వేలు ఇస్తామన్నా వద్దన్నారు. అంతేకాకుండా ఆమె తెదేపా నేతలకు రూ.10 వేలు ఇచ్చారు. వాటిని ఖర్చు పెట్టి తెదేపాను గెలిపించాలని కోరారు. ఉద్యోగుల్ని చూస్తుంటే కడుపు నిండిపోయింది’ అని చెప్పారు.
కల్లోలానికి, కలలకు పోటీ
‘రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి.. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి.. విధ్వంసానికి, అభివృద్ధికి.. కల్లోల ఆంధ్రప్రదేశ్కు, కలల ఆంధ్రప్రదేశ్కు మధ్య జరిగే పోరాటం’ అని చంద్రబాబు అభివర్ణించారు. ఉత్తరాంధ్ర ప్రగతి తెదేపా, జనసేన, భాజపాలతోనే సాధ్యమని వివరించారు. పవన్ కల్యాణ్ విశాఖపట్నానికి వస్తే.. అడుగడుగునా ఆటంకాలు కల్పించడమే కాకుండా, ఉన్నపళంగా వేరే ప్రాంతానికి తరలించి వేధించారని చంద్రబాబు మండిపడ్డారు. ‘విశాఖపట్నం వీళ్ల జాగీరా? అధికారం ఉందని విర్రవీగుతారా? ఉత్తరాంధ్రపై వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పెత్తనమేంటి? ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకనా? విశాఖపట్నం వైకాపా నేతల దోపిడీకి బలైంది. భూములపై కన్నేశారు. అభివృద్ధి ఆపేశారు’ అని విరుచుకుపడ్డారు. మోదీ గ్యారంటీలు, తెదేపా- జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ముందు వైకాపా మ్యానిఫెస్టో వెలవెలబోయిందన్నారు.
మోదీ నాయకత్వంలో దేశం ముందుకు..
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, అభివృద్ధిని పట్టాలెక్కిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘నరేంద్ర మోదీ గడిచిన పదేళ్లలో దేశాన్ని ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. రాబోయే ఐదేళ్లలో మూడో స్థానానికి తీసుకెళ్లాలని సంకల్పించారు. 2047 నాటికి వికసిత్ భారత్ అనేది మోదీ కల. వికసిత్ ఆంధ్రప్రదేశ్ పవన్ కల్యాణ్, చంద్రబాబు కల. మోదీ నాయకత్వంలో దేశం ముందుకెళ్లాలి. ప్రపంచంలో భారతదేశం, భారతీయులు నంబర్ 1 కావాలి. తెలుగుజాతి ప్రపంచంలో నంబర్ 1 కావాలి. పేదరికం లేని దేశం, రాష్ట్రం మా కల.. అందుకే ఈ కలయిక’ అని చెప్పారు.
పవన్ నిజమైన హీరో
‘జగన్ పోవాలి, ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి.. ఇందుకు ఏ త్యాగానికైనా సిద్ధమని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆయన సీట్ల కోసం ఆలోచించలేదు. సినీ జీవితంలో లేని గౌరవం ఇక్కడొస్తుందని కాదు. నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచించారు. పొత్తు ఉంటుందని మొట్టమొదట చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. సినిమాల్లోనే కాదు.. ప్రజాజీవితంలోనూ ఆయన నిజమైన హీరో’ అని చంద్రబాబు కొనియాడారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ