మే 3న తిరుపతిలో అమిత్ షా ప్రచారం?
ఎన్డీయే అభ్యర్థుల తరఫున తిరుపతిలో మే 3న నిర్వహించే ఎన్నికల ప్రచార సభకు భాజపా అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నట్లు సమాచారం.
తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్టుడే: ఎన్డీయే అభ్యర్థుల తరఫున తిరుపతిలో మే 3న నిర్వహించే ఎన్నికల ప్రచార సభకు భాజపా అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నట్లు సమాచారం. ఈ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు. పూర్తి షెడ్యూల్ ఒకట్రెండు రోజుల్లో వెలువడనుందని భాజపా నేతలు తెలిపారు. అంతకుముందు అన్నమయ్య జిల్లాలో జరిగే ప్రచారంలో అమిత్ షా పాల్గొంటారు.
29, 30 తేదీల్లో పిఠాపురంలో పవన్కల్యాణ్ పర్యటన
పిఠాపురం, న్యూస్టుడే: కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ ఈ నెల 29, 30 తేదీల్లో పర్యటించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురంలోని తెదేపా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రచారం ప్రారంభమవుతుందని.. చెందుర్తి జంక్షన్, వన్నెపూడి, కొడవలి జంక్షన్ మీదుగా వెల్దుర్తి, పి.దొంతమూరు, బి.కొత్తూరు, కుమారపురానికి చేరుకుంటుందన్నారు. మంగళవారం చిత్రాడ నుంచి గొల్లప్రోలు మున్సిపాలిటీ వరకూ ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారని ప్రకటించారు.
విద్యుత్ కొనుగోళ్లలో ‘క్విడ్ ప్రోకో’ ప్రభుత్వంపై ఎన్డీయే నేతల ఆరోపణ
ఈనాడు, అమరావతి: వైకాపా పాలనలో 9సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి, ప్రజలపై జగన్ ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపిందని ఎన్డీయే నేతలు మండిపడ్డారు. మంగళగిరిలో శనివారం మీడియాతో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.విజయ్కుమార్, తెదేపా, భాజపా నేతలు జి.వి.రెడ్డి, షేక్ బాజీ మాట్లాడారు. ‘ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్లు జరిపి ‘క్విడ్ ప్రోకో’ ద్వారా రూ.వేల కోట్లను జగన్ మళ్లించారు. అధిక ధరలకు ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేసి తన బినామీ సంస్థ షిర్డిసాయి ఎలక్ట్రికల్స్కు భారీగా లబ్ధి చేకూర్చారు’ అని ఆరోపించారు.
మరోసారి మోసం
-నాదెండ్ల మనోహర్
తెనాలి టౌన్, న్యూస్టుడే: ప్రజలను మరో మారు మోసం చేయటానికి, కేవలం ఓట్ల కోసం మాత్రమే సీఎం జగన్ మ్యానిఫెస్టో విడుదల చేశారని, అందులో బాధ్యత, ప్రజా సంక్షేమం, అభివృద్ధి శూన్యమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, తెనాలి అసెంబ్లీ స్థానం ఎన్డీయే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
మే 1న హైదరాబాద్ పాతబస్తీలో అమిత్షా రోడ్ షో
ఈనాడు, హైదరాబాద్: భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మే ఒకటో తేదీన హైదరాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు చార్మినార్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని గౌలిపురలో అమిత్షా రోడ్ షోలో పాల్గొంటారని పేర్కొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఈ నెల 29న ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబాబాద్ బహిరంగసభల్లో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేటలో రోడ్ షోలో పాల్గొంటారని తెలిపారు.
కులవృత్తిదారులకు మొండిచేయే
ఈనాడు, అమరావతి: కులవృత్తుల ఆధారంగా ఇచ్చే పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పాత విధానానికే కట్టుబడ్డారు. ఆయా వర్గాల్లో కూలి పనులు చేసుకుంటూ బతికే అర్హులైన వారికి నేతన్ననేస్తం, చేదోడు పథకాలను వర్తింపచేయకుండా గత ఐదేళ్లూ అమలు చేసిన విధానాన్నే మళ్లీ కొనసాగిస్తామని ప్రకటించారు. తమకు కూడా పథకాలను వర్తింపచేయాలని పలుమార్లు ఆయా వర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. గతంలో మాదిరిగానే సొంత మగ్గం ఉన్నవారికే నేతన్న నేస్తం పథకాన్ని పరిమితం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మంది చేనేత కార్మికులుంటే అందులో కూలీ మగ్గాలు నేసే వారు, అనుబంధ రంగాలకు చెందిన వారు దాదాపుగా 2.70 లక్షల మంది ఉన్నారు. చేదోడు పథకాన్ని కూడా సొంత దుకాణాలున్న నాయీ బ్రాహ్మణులు, దర్జీలు, రజకులకు మాత్రమే కొనసాగిస్తామని ప్రకటించారు. అక్కడ కూలీలుగా పనిచేస్తూ కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉన్న వారిని మాత్రం విస్మరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.