icon icon icon
icon icon icon

30 నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో లోకేశ్‌ పర్యటన

ఈ ఎన్నికలకు యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ నెల 30 నుంచి మే 6 వరకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌... రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పర్యటించనున్నారు.

Published : 29 Apr 2024 05:43 IST

ఒంగోలు నుంచి ప్రారంభం
యువతతో ముఖాముఖి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఈ ఎన్నికలకు యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ నెల 30 నుంచి మే 6 వరకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌... రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పర్యటించనున్నారు. 30న ఒంగోలులో ప్రారంభం కానున్న పర్యటన, మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు, 6న ఏలూరు లోక్‌సభ నియోజకవర్గాల్లో సాగనుంది. ఆయా ప్రాంతాల్లో నిర్వహించే సభలు, రోడ్‌షోల్లో లోకేశ్‌ పాల్గొంటారు. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు యువతతో ముఖాముఖీ నిర్వహిస్తారు. వారి సందేహాలు నివృత్తి చేయడంతో పాటు జగన్‌ అరాచకాల పై ప్రజల్ని చైతన్యం చేయడం, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీయే ప్రభుత్వం ఆవశ్యకతను వారికి వివరించడం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, మెగా డీఎస్సీ నిర్వహణ, నిరుద్యోగ యువతకు భృతి తదితర హామీలపై వారికి అవగాహన కల్పిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img