వైకాపాకు కాలం చెల్లింది
రాష్ట్రంలో వైకాపాకు కాలం చెల్లిందని, ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతవుతాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు.
అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతవుతాయి
మార్పు కోరుకుంటున్న ప్రజలు
డోన్, నందికొట్కూరు సభలలో తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, కర్నూలు: రాష్ట్రంలో వైకాపాకు కాలం చెల్లిందని, ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతవుతాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నంద్యాల జిల్లా డోన్, నందికొట్కూరులలో ‘ప్రజాగళం’ సభల్లో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో దొంగలు పడ్డారు. మే 13న వారిని పట్టుకోవాలి. అన్ని వర్గాలు మార్పు కోరుకుంటున్నాయి. ప్రతి ఒక్కరిలోనూ మోసపోయామనే బాధ ఉంది. ఈ ఎన్నికలు విధ్వంస పాలనకు-అభివృద్ధికి, విజన్కు-విద్వేషానికి, ధర్మానికి-అధర్మానికి, రాతియుగం-స్వర్ణయుగం పాలకులకు మధ్య పోరాటం. మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, సైకో జగన్కు అహంకారం ఎక్కువై అన్నింటినీ విధ్వంసం చేశారు. ప్రజల జీవితాలను చీకటిమయం చేశారు. అలాగే శాశ్వతంగా కొనసాగుతామని అనుకున్నారు. ఐదేళ్లకోసారి ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని మరిచిపోయారు. సైకో ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని తిరిగారు. సచివాలయానికి వెళ్లని వ్యక్తి ముఖ్యమంత్రా? చేసిన ప్రగతేంటో విలేకరుల సమావేశం పెట్టి ఒక్కసారైనా ఆయన చెప్పారా? దద్దమ్మ మంత్రివర్గంతో సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఆయన ఆర్థిక మంత్రో, అప్పుల మంత్రో..
‘పరిపాలన అంటే అప్పులు చేయడం, హరికథలు చెప్పడం కాదు బుగ్గనా! అభివృద్ధి చేయడం. ఆర్థిక వ్యవస్థను నడిపించాల్సిన వ్యక్తివి చివరకు సచివాలయాన్ని, ఆసుపత్రిని, మద్యం ద్వారా వచ్చే ఆదాయం రూ.25 వేల కోట్లను తాకట్టు పెట్టారు. బుగ్గన ఆర్థిక మంత్రో అప్పుల మంత్రో తెలియదు..’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘హు కిల్డ్ బాబాయ్’ అన్న ప్రశ్నకు సమాధానాన్ని బుగ్గనకు చెవిలో చెప్పండి. ఆయనకు ఏమి తెలియదంట. నంగనాచి కబుర్లు చెబుతున్నారు’ అని సీఎం జగన్కు సూచించారు. ‘జగన్కు రంగుల పిచ్చి. ఇందుకోసం రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సైకోకు రంగువేసి శాశ్వతంగా ఇంటికి పంపాలి. మీ తాతలిచ్చిన ఆస్తుల పత్రాలపై ముఖ్యమంత్రి ఫొటోలు వేయించుకుంటారా? సర్వే రాళ్లపైనా తన ఫొటో వేయించుకున్నారు’ అని పేర్కొన్నారు. ‘నా జీవితం బీసీలకు అంకితం. ప్రతి బీసీకి న్యాయం చేస్తా. కూటమి తరఫున బలిజలకు తిరుపతి, రాజంపేట టికెట్లనిచ్చాం. రాయలసీమలో బలిజలకు ఒక టికెట్ అయినా వైకాపా వారు ఇచ్చారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
మీ భూమి కొట్టేయడానికి సైకో ప్రణాళికలు
‘భూములను కొట్టేయడానికి సైకో ప్రణాళికలేశారు. ఇది చాలా ప్రమాదకరం. కొన్ని రోజుల కిందట ఓ చేనేత కార్మికుడి భూమిని వేరే వారి పేరిట రాస్తే ఏమీ చేయలేక ఆయన రైలు కిందపడి చనిపోయారు. ఆయన కుటుంబసభ్యులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం వచ్చాక రికార్డులు మారిస్తే ప్రజలు ఏమీ చేయలేరు. ఆత్మహత్య తప్ప గత్యంతరం ఉండదు. ప్రస్తుతం ఏ రైతైనా బాగున్నారా? ఐదేళ్లు వ్యవసాయాన్ని నాశనం చేశారు’ అని పేర్కొన్నారు. ‘దిల్లీ మద్యం కుంభకోణంకంటే ఏపీ మద్యం కుంభకోణం చాలా పెద్దది. జే బ్రాండ్లను రద్దు చేసి దోచుకున్న డబ్బును కక్కిస్తా. నేను ఐటీ ఉద్యోగాలిస్తే జగన్ వాలంటీరు ఉద్యోగాలిచ్చారు. ఆయన ఇచ్చిన ఉద్యోగాలకు జీతం రూ.5 వేలయితే నేను కల్పించిన ఐటీ ఉద్యోగాలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జీతం ఉంటుంది. మళ్లీ జాబు కావాలంటే బాబు రావాలి. కుల, మత, జనాభా గణన ఉంటుంది’ అని వివరించారు. ‘ఆడబిడ్డలకు తెదేపా పుట్టిల్లు. చెల్లికి ఆస్తి ఇవ్వకుండా ఎగ్గొట్టిన సైకో కావాలా? మహిళల కోసం మహాశక్తి పథకం ప్రకటించిన మేము కావాలా?’ అని ప్రశ్నించారు. మహిళలను లక్షాధికారులను చేసేందుకే డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీలేని రుణాన్ని ఇవ్వడానికి నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను చేయను: అధిర్ రంజన్
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం