సంక్షిప్తవార్తలు
శ్రమ దోపిడీని ఎదిరించి కార్మిక శక్తి గెలిచిన చారిత్రక దినం.. మే డే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు.
మ్యానిఫెస్టోలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట
మే డే శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: శ్రమ దోపిడీని ఎదిరించి కార్మిక శక్తి గెలిచిన చారిత్రక దినం.. మే డే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. తమ కష్టంతో సమాజ నిర్మాణానికి చేయూతనిచ్చే శ్రామికుల హక్కుల్ని కాపాడటంలో తెదేపా ఎప్పుడూ ముందుంటుందని స్పష్టంచేశారు. వైకాపా ప్రభుత్వంలా ఓ చేత్తో సాయం ఇచ్చి.. మరో చేత్తో పదింతలు జరిమానాల రూపంలో లాగేసుకొనే మాయలు చేయబోమన్నారు. మే డే సందర్భంగా ఎక్స్ వేదికగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్మికులే సౌభాగ్య ప్రదాతలు
జనసేన అధినేత పవన్కల్యాణ్
ఈనాడు డిజిటల్, అమరావతి: కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకునే ఏకైక వేడుక మే డే అని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఎక్కడ కష్టం ఉంటుందో.. ఎక్కడ స్వేదం చిందుతుందో అక్కడ సౌభాగ్యం విలసిల్లుతుందనేది జగమెరిగిన సత్యమని బుధవారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. ‘కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు. శ్రమైక జీవనంలో తరించే ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నాను. కార్మికులను చూసినప్పుడల్లా గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పిన... డ్యాములు ఎందుకు కడుతున్నానో.. భూములు ఎందుకు దున్నుతున్నానో నాకే తెలియదు! నా బతుకొక సున్నా.. అయినా నడుస్తున్నా! చెట్టుగా ఉంటే ఏడాదికొక్క వసంతమైనా దక్కేది... మనిషినై అన్ని వసంతాలూ కోల్పోయాను... అనే పద్యం గుర్తుకొస్తుంది’ అని అన్నారు.
గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించొద్దు
సీఈవోకు తెదేపా నేతల ఫిర్యాదు
ఈనాడు డిజిటల్, అమరావతి: హైకోర్టు ఆదేశాల మేరకు గాజు గ్లాసు గుర్తును జనసేన అభ్యర్థులు మినహా.. ఇతరులకు కేటాయించొద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్మీనాను తెదేపా నేతలు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను బెదిరిస్తున్న వైకాపా అభ్యర్థులు మేకపాటి రాజగోపాల్రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, అనంతపురంలో వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఈవోకు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తదితరులు బుధవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎంవీవీ సత్యనారాయణ, మేకపాటి రాజమోహన్రెడ్డి అడ్డుఅదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉండదు’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.
ముద్రగడ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్
ఈనాడు డిజిటల్, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్పై ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ విమర్శించారు. కాపు ఉద్యమ నేతగా చెప్పుకొనే పద్మనాభం వారి అభ్యున్నతికి ఏం చేశారో చెప్పాలని బుధవారం ఓ ప్రకటనలో డిమాండు చేశారు. ‘కాపులకు రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని స్పష్టం చేసిన సీఎం జగన్ పంచన చేరి వారికి ఎలా న్యాయం చేస్తారో చెప్పాలి. వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే ముద్రగడ పవన్పై విమర్శలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం. కాపు ఉద్యమాన్ని రాజకీయ పునరావాసంగా మార్చుకున్న ఘనుడు ముద్రగడ. ఆయన సవాలు చేసినట్లు ఎలాగూ పవన్ను ఓడించలేరు. అందుకే ముందుగానే ముద్రగడ పేరు మార్చుకోవాలి’ అని అన్నారు.
ఒక్క పరిశ్రమైనా కట్టారా?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్న
రాజమహేంద్రవరం (దేవీచౌక్), న్యూస్టుడే: అధికారంలోకి వచ్చిన ఈ అయిదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ అయినా కట్టారా? కనీసం ఒక్క రోడ్డు అయినా వేశారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. బుధవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో, కేంద్రంలో అరాచక, నియంతృత్వ పాలన సాగిందన్నారు. సొంత చెల్లెలికే న్యాయం చేయలేని జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తారని ప్రశ్నించారు. సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
‘వైకాపాకు ఓటెయ్యకపోతే చంపేస్తారా?’
ఈనాడు డిజిటల్, అమరావతి: సైకిల్ గుర్తుకు ఎవరూ ఓటెయ్యకూడదని.. తెదేవా వాళ్లను చంపేస్తానని బహిరంగంగా హెచ్చరిస్తున్న ఉదయగిరి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డిపై ఏం చర్యలు తీసుకున్నారని ఎన్నికల సంఘాన్ని, పోలీసుశాఖను తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
ఎన్డీయేతోనే రైతు సంక్షేమం: మర్రెడ్డి
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రైతు సంక్షేమం సాధ్యమవుతుందని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయంతో కర్షకులందరికీ మేలు జరుగుతుందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను చేయను: అధిర్ రంజన్
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం