icon icon icon
icon icon icon

రూ.వేల కోట్ల అవినీతి చేసి బెయిల్‌పై తిరుగుతున్నారు

రూ.వంద కోట్ల అవినీతి చేసిన వారిని జైలులో పెడుతున్నారని, రూ.45 వేల కోట్ల అవినీతి చేసిన వారు బెయిల్‌పై బయట ఉంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

Published : 09 May 2024 07:11 IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: రూ.వంద కోట్ల అవినీతి చేసిన వారిని జైలులో పెడుతున్నారని, రూ.45 వేల కోట్ల అవినీతి చేసిన వారు బెయిల్‌పై బయట ఉంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. రూ.15 లక్షల కోట్ల అవినీతి చేసిన వారు విదేశాల్లో హాయిగా ఉంటున్నారని, మోదీకి, భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌లను జైలులో పెట్టారని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం జరగకుండా యంత్రాంగానికి తగిన సూచనలు చేయాలని ఈసీకి లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img