#2020:ఆనంద్ మహీంద్రా బెస్ట్ ట్వీట్స్ ఇవే..
వ్యాపారం అంటే లాభనష్టాల లెక్కలు.. విస్తరణ ప్రణాళికలు.. ఆదాయం పెంచుకునే వ్యూహాలు. సాధారణంగా ఓ వ్యాపారవేత్త అంటే సాధారణంగా గుర్తొచ్చేవి ఇవే. కానీ ఆయన అందరిలా కాదు. సోషల్మీడియాలో........
ఇంటర్నెట్డెస్క్: వ్యాపారం అంటే లాభనష్టాల లెక్కలు.. విస్తరణ ప్రణాళికలు.. ఆదాయం పెంచుకునే వ్యూహాలు. సాధారణంగా ఓ వ్యాపారవేత్త అంటే గుర్తొచ్చేవి ఇవే. కానీ, ఆయన అందరిలా కాదు. సోషల్మీడియాలో వచ్చే జోకులకు తనదైన చమత్కారం జోడించి నవ్విస్తారు.. ఆసక్తికర ట్వీట్లతో స్ఫూర్తి నింపుతారు.. నిత్య జీవితంలో ఎలా వ్యవహరించాలో జీవిత పాఠాలు నేర్పుతారు. ఈ ఉపోద్ఘాతమంతా ఆనంద్ మహీంద్రా గురించేనని ఈ పాటికే అర్థమై ఉంటుంది. నిత్యం సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఆయనకు 8.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆయన ట్వీట్లకున్న ఫాలోయింగ్ను అర్థం చేసుకోవచ్చు. మరి ఈ ఏడాది ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్లను ఓ సారి పరిశీలిద్దాం.
కంటతడి పెట్టిస్తారు.. అంతలోనే నవ్విస్తారు
ఓ పెద్దాయన రోజూ బరువులు ఎత్తుతూ తంటాలు పడుతుంటాడు. కానీ, ఆయనెందుకు అలా చేశాడనేది క్రిస్మస్ రోజున తెలుస్తుంది. మనవరాలిని ఎత్తుకుని క్రిస్మస్ ట్రీపై స్టార్ను ఆమె చేత పెట్టించేందుకు ఆయన అలా చేశాడనే వీడియో సారాంశం. ఈ వీడియో తనకు ఏడుపు తెప్పించిందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. అది చూసిన నెటిజన్లు కూడా తాము సైతం కంటతడి పెట్టినట్లు చెప్పారు. ఒంటరి చీమ 29 ఏళ్లు బతుకుతుందంటూ ఎవరో చేసి ఫేస్బుక్ పోస్ట్కు.. ‘మరి పెళ్లైన చీమ పరిస్థితి ఏంటి భయ్యా’ అంటూ మరొకరు చేసిన కామెంట్ చూసి తాను పగలబడి నవ్వానంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సైతం నెటిజన్లను ఆకట్టుకుంది.
మహీంద్రా వారి జీవిత సత్యాలు.. స్ఫూర్తి పాఠాలు
కరోనా వేళ ఆనంద్ మహీంద్రా ఎన్నో జీవిత సత్యాలను తన ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ఆనందం ఎక్కడుంటుంది? అనే ప్రశ్నకు సులభంగా సమాధానమిచ్చారు ఆనంద్ మహీంద్రా. అది ఎవరో ఇచ్చేది కాదు.. సొంతంగా పొందాలని ఓ చిన్న కార్టూన్ ద్వారా చెప్పారు. కరోనా కారణంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న అరటి రైతులకు.. తమ క్యాంటీన్లలో అరటి ఆకులు ఉపయోగించి అండగా నిలిచానని చెబుతూనే.. చిన్న ఉపాయంతో ఇతరులకు ఎలా ఉపయోగపడాలో నేర్పించారాయన. కొవిడ్ కారణంగా మన జీవితం ఎలా మారిపోయిందో ఒక చిన్న మీమ్ ద్వారా చెప్పారు. ప్రతిదీ కంప్యూటర్ మయం అవ్వడం పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. భవిష్యత్ ఇలా ఉండకూడదంటూ ఆకాంక్షించారు. ఇవే కాదు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ దివ్యాంగుడు జెండాగా ఎలా మారాడో చూపిన వీడియో.. చిన్న పిల్లాడి పరుగు గురించి.. గుక్క తిప్పుకోకుండా ఓ బాలుడి జాతీయ గీతం ఆలపించిన వీడియోలు.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ఆయన చేసిన ఆసక్తికర ట్వీట్లను తిలకించేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు ప్రజ్వల్ రేవణ్ణ.. అసలేంటీ పాస్పోర్టు..? ఎవరికి ఇస్తారు..?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..