Japan Airlines : ఆ జపాన్ విమానాల్లో లగేజీ సమస్యకు చెక్.. విదేశీయులకు అద్దె దుస్తులు!
తమ విమానంలో ప్రయాణం చేసి జపాన్ (Japan) చేరుకున్న విదేశీయులకు ఆన్ అరైవల్ అద్దె దుస్తులు అందజేస్తామని ‘జపాన్ ఎయిర్ లైన్స్’ (Japan Airlines) కంపెనీ ప్రకటించింది. అసలు ఈ కొత్త పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టింది? ఎలా అమలు చేస్తోంది? తదితర విషయాల గురించి చదివేయండి.
విదేశీ విహార యాత్రలు చేసే వారంతా ఎక్కువగా హోటళ్లలో బస చేస్తుంటారు. అయితే.. ఎక్కడికెళ్లినా వారు దుస్తుల లగేజీ మోసుకెళ్లాల్సిందే. అందుకే ‘జపాన్ ఎయిర్ లైన్స్’(జేఏఎల్) ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. తమ విమానాల్లో ప్రయాణించి జపాన్ (Japan) చేరుకున్న విదేశీ పర్యాటకులకు దుస్తులు అద్దెకిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఆ విశేషాలు తెలుసుకోండి.
అద్దెకు నప్పే దుస్తులు
ఈ నెల 5న జపాన్ ఎయిర్ లైన్స్ ‘ఎనీ వేర్.. ఎనీ వేర్’ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. దాని ప్రకారం జపాన్ చూడాలనుకునే పర్యాటకులు ఎవరైనా సరే రెండు వారాలకు సరిపడా దుస్తులను నెల రోజులు ముందే అద్దెకు తీసుకోవచ్చు. తాము ఆ దేశానికి.. ఏ పని మీద వస్తున్నామో చెబితే నప్పే దుస్తులను నిర్వాహకులు సూచిస్తారు. జపాన్లో ఇల్లు లేదా హోటల్ ఎక్కడ బస చేస్తే అక్కడికే ఎంపిక చేసుకున్న దుస్తులను డెలివరీ చేస్తారు. భారత కరెన్సీలో రూ.2300 నుంచి ఈ ప్యాకేజీలు ప్రారంభవుతాయి. మహిళలు ఎవరైనా బిజినెస్ ట్రిప్ కోసం వెళ్తే రూ.2900 ప్యాకేజీలోనే కావాల్సిన వస్త్రాలు అందజేయనున్నారు.
ఈ సౌకర్యాన్ని అందించేందుకు జపాన్ ఎయిర్లైన్స్ సుమిటోమో అనే సంస్థతో చేతులు కలిపింది. బుకింగ్, లాండ్రీ, సేకరణ, డెలివరీ బాధ్యతలన్నీ ఆ కంపెనీయే చూసుకుంటుంది. అయితే ఈ దుస్తులన్నీ ఎవరో ఒకరు వాడినవి అయ్యుంటాయి. ఒక వేళ వినియోగదారులు వాటికి నష్టం కలిగిస్తే అందుకు అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
Image : Japan Airlines
పర్యావరణహితం కోసం..
తమ విమానాల నుంచి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చామని జపాన్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. ప్రయాణికుల లగేజీ బరువు తగ్గడం వల్ల ఇంధన వినియోగం కూడా తగ్గనుంది. ఈ పథకం ఎంత వరకు విజయవంతం అవుతుందో ఏడాది పాటు పరిశీలిస్తామని వైమానిక సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
వాతావరణ సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలు విడుదల చేసే ఉద్గారాల గురించి అనేక సదస్సుల్లో చర్చలు జరుగుతున్నాయి. నిజానికి విమానయాన రంగం 2 శాతం కార్బన్ డై ఆక్సైడ్ మాత్రమే విడుదల చేస్తోంది. ఇతర ఉద్గారాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే భూగోళం వేడికి విమానయాన సంస్థలు 5 శాతం కారణమవుతున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. అందుకే జపాన్ ఎయిర్ లైన్స్ ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
మార్పుపై డేటా సేకరణ
కొవిడ్ మహమ్మారి కథ ముగియడంతో ఇటీవల జపాన్ను సందర్శించే విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మే నెలలో 19 లక్షల మంది ఆ దేశాన్ని సందర్శించారు. గతేడాది మేతో పోలిస్తే ఈ సంఖ్య 1200 శాతం అధికం. అందుకే 2024 ఆగస్టు వరకు ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అప్పటి వరకు ప్రయాణికుల లగేజీ ఎంత తగ్గింది? ఇంధన వినియోగంలో మార్పులు వచ్చాయా? కర్బన ఉద్గారాల నియంత్రణ జరిగిందా? ఇటువంటి అంశాల డేటాను సేకరించనున్నారు. జపాన్ ఎయిర్ లైన్స్ అంచనా ప్రకారం 10 కేజీల ప్రయాణికుల సామగ్రి తగ్గిస్తే 7.5 కేజీల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించినట్లవుతుందట. అది 78 రోజులపాటు.. రోజూ 10 నిమిషాల పాటు హెయిర్ డ్రయర్ వినియోగిస్తే వెలువడే ఉద్గారాలకు సమానం.
వెల్లువెత్తుతున్న విమర్శలు
జపాన్ ఎయిర్ లైన్స్ చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం సఫలమవుతుందా? లేక విఫలమవుతుందా అనే విషయం తేలాలంటే ఏడాది ఆగాల్సిందే. అయితే ఈ పథకాన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. దుస్తులను అద్దెకివ్వడం వల్ల పర్యావరణానికి ఎలాంటి మేలు జరగదని వారు పెదవి విరుస్తున్నారు. ఈ ప్రక్రియ లాండ్రీ, ప్యాకేజింగ్ వంటి చర్యలతో ముడిపడి ఉందని అంటున్నారు. అందువల్ల జల కాలుష్యం, ప్లాస్టిక్, డిటర్జెంట్ల వాడకం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఒక్కో వ్యక్తికి దుస్తులను డెలివరీ చేయడం కోసం వినియోగించే రోడ్డు రవాణా వ్యవస్థ కూడా కాలుష్యానికి కారణమవుతుందని చెబుతున్నారు. అయితే ఈ నూతన పథకం వల్ల విమానయాన సంస్థ లగేజీ బరువు కోసం ఖర్చు చేసే ఇంధనాన్ని ఆదా చేసుకోనుంది. అద్దె దుస్తుల ఖర్చు మాత్రం ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం