Jharia coalfield : వందేళ్లుగా మండుతున్న బొగ్గు క్షేత్రం.. చుట్టూ మసి బారుతున్న జీవితాలు!
ఝార్ఘండ్లోని ఝరియా బొగ్గు క్షేత్రం గత వందేళ్లుగా మండుతోంది. దాని వల్ల పర్యావరణానికి, ప్రజలకు ఎలాంటి హాని జరుగుతోందో తెలుసుకోండి.
భారత దేశంలోని (India) అతి పెద్ద బొగ్గు క్షేత్రాల్లో ఒకటిగా ఝరియా పేరుగాంచింది. ఇది ఝార్ఘండ్ (jharkhand) రాష్ట్రం ధన్బాద్ జిల్లాలో ఉంది. బొగ్గు (Coal) కారణంగా ఈ ప్రాంతం గత వందేళ్లుగా మండుతోంది. అలా ఎందుకు జరుగుతోంది? దాని వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం వాటిల్లుతోంది? తదితర విషయాలు తెలుసుకోండి.
బ్రిటిష్ హయాంలోనే ఝరియా బొగ్గు క్షేత్రంలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 1916లో ఇక్కడ తొలిసారి మంటలు చెలరేగాయి. అప్పుడు మొదలైన జ్వాల ఇప్పటికీ రగులుతూనే ఉంది. 1973లో ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) ఇక్కడ బొగ్గు తవ్వకాలు చేపట్టింది. అప్పటికే భూగర్భంలో చాలా చోట్ల మైనింగ్ జరిగింది. మరోసారి ఒపెన్ కాస్ట్ మైనింగ్ చేయడం వల్ల మంటలు మరింత అధికమయ్యాయి. మైనింగ్ షాప్ట్లలోకి ఆక్సిజన్ ప్రవహించడం వల్ల పొగలు కక్కుతున్న బొగ్గుల కుంపట్లు ఎక్కువైపోయాయి. ఆ మంటలు కొన్నిసార్లు అరవై అడుగుల ఎత్తు వరకు ఎగసి పడేవని ఆ భయానక దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు చెబుతున్నారు.
37 మిలియన్ టన్నుల బొగ్గు వృథా
ఝరియా బొగ్గు క్షేత్రంలో మంటల కారణంగా ఇప్పటి దాకా 37 మిలియన్ టన్నుల బొగ్గు వృథా అయిందని నిపుణులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో దాని విలువ బిలియన్ల డాలర్లు ఉంటుందట. మంటల వల్ల మరో 1.4 బిలియన్ మెట్రిక్ టన్నులు అందుబాటులో లేకుండా పోయాయి. కర్బన ఉద్గారాలు అధికంగా గాలిలో కలవడం వల్ల కాలుష్యం స్థాయి కూడా పెరిగింది.
షూ వేసుకున్నా నడవలేరు
నిరంతరం బొగ్గు కాలుతుండటం వల్ల ఈ ప్రాంతం అత్యంత వేడిగా ఉంటుంది. వేసవి కాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయి. కొన్ని సార్లు షూ ధరించి కూడా ఇక్కడ నడవలేమని స్థానికులు చెబుతున్నారంటే వేడి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
క్షీణించిన గాలి నాణ్యత
బొగ్గు మండటం వల్ల విడుదలైన వాయువుల కారణంగా గాలి కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. దాంతో ఊపిరి పీల్చుకోవటం కూడా కొన్ని సార్లు కష్టంగా మారుతోంది. ఇక్కడ గాలి నాణ్యతను పరిశీలించగా.. వాటిలో 40 నుంచి 50 హైడ్రో కార్బన్ కాంపాండ్స్ వెలుగుచూశాయి. అవన్నీ విషపూరితం, క్యాన్సర్ కారకాలని పరిశోధకులు తేల్చారు. ఇక మంటలు ఎక్కువ రోజులు కొనసాగడం వల్ల అనేక చోట్ల భారీ గుంతలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
ముసురుతున్న వ్యాధులు
ఝరియా బొగ్గు గనుల చుట్టూ సుమారు 5 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వారిలో చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. చిన్నారుల్లో వైకల్యాలు, మస్తిష్క సమస్యలు బయటపడ్డాయి. తల్లి గర్భంలో ఉండగానే కొన్ని వ్యాధులు సంక్రమిస్తున్నట్లు తెలిసింది.
Image : Ehsan Ahmed khan
పెరుగుతున్న బాల కార్మికులు
బొగ్గు గనిలో పనికి వెళ్తూ అనేక మంది చిన్నారులు చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు కూలి వస్తుందనే ఆశతో తల్లిదండ్రులు వారిని పనికి పంపిస్తున్నారు. పేదరికం కారణంగా దాదాపు 2500-3000 మంది పిల్లలు ఈ పని చేస్తున్నారని కొన్ని స్వచ్ఛంద సంస్థలు పేర్కొన్నాయి.
అదే జీవనాధారం
కేవలం ఝరియాలో మాత్రమే కాదు. ఒక్క అంటార్కిటికాలో తప్ప ప్రపంచంలోని చాలా ఖండాల్లో ఇలాంటి నిప్పు కొండలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఝరియాలో బొగ్గు వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను మరో చోటకు తరలించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే వారు ఇప్పటిదాకా కేవలం 3వేల మందిని మాత్రమే ఝరియాకు 15 కిలోమీటర్ల దూరంలోని బెల్గోరియాకు తరలించగలిగారు. ఎందుకంటే ఇక్కడ ప్రజల జీవితం బొగ్గుతో ముడిపడి ఉంది. బొగ్గు గనిలో పనికి వెళ్తేనే వారికి పూట గడుస్తుంది. అందుకే చావైనా బతుకైనా అక్కడేనని కాలం వెల్లదీస్తున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం