AP Inter Results: ఏపీలో ఇంటర్‌ ద్వితీయ ఫలితాలు విడుదల

ఏపీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి .......

Updated : 23 Jul 2021 17:57 IST

అమరావతి: ఏపీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. కరోనా విజృంభణతో ఈ ఏడాది పరీక్షలను రద్దు చేసిన ఇంటర్‌ విద్యామండలి.. పదో తరగతి మార్కులకు 30శాతం, ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి 70% వెయిటేజీతో మార్కులను కేటాయించింది. సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు మొత్తానికి సరాసరి గ్రేడ్‌ పాయింట్లు కేటాయించారు. ద్వితీయ ఇంటర్‌ పరీక్ష ఫలితాలను ‌http://examresults.ap.nic.in, http://results.bie.ap.gov.in, http://results.apcfss.in, http://bie.ap.gov.in  వెబ్‌సైట్లలో పొందవచ్చు. 

వారం ముందుగానే ఫలితాల వెల్లడి

‘‘మే 5 నుంచి 23 వరకు నిర్వహించాల్సిన పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సూచనల మేరకు జూన్‌  25 పరీక్షలు రద్దు చేస్తున్నట్టు సీఎం నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయించిన తేదీ కంటే వారం రోజుల ముందుగానే ఫలితాలు వెల్లడిస్తున్నాం. మార్కులు ఎలా ఇవ్వాలనే దానిపై కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఆధారంగా మొత్తం మార్కులకు పదోతరగతి మార్కుల ఆధారంగా 30శాతం వెయిటేజీ, ఇంటర్‌ ఫస్ట్‌ఇయర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా 70 శాతం వెయిటేజ్‌తో ఫలితాలు విడుదుల చేస్తున్నాం. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులు పరీక్ష  ఫీజు చెల్లించి ఉంటే వారికి కూడా మినిమం 35 మార్కులు ఇచ్చాం. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 5,08,672 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 2,53,138 మంది, బాలికలు 2,55,534 మంది ఉన్నారు. వీరంతా ఉత్తీర్ణులయ్యారు’’ అని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. ఈ ఫలితాలపై సంతృప్తి చెందని వారికి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని