TTD: అంతకంతకూ పెరుగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 40గంటలు
క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఆహారం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. శ్రీవారి సేవకులు, విజిలెన్స్ విభాగాలు అన్నప్రసాదం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి బారులు తీరడంతో క్యూలైన్లు ఔటర్ రింగ్రోడ్డు వరకు చేరుకున్నాయి. క్యూలైన్ భారీగా ఉండటంతో తొక్కిసలాట జరగకుండా తితిదే చర్యలు చేపట్టింది. దర్శనానికి వెళ్లే భక్తులను సమన్వయం చేస్తూ బృందాలుగా పంపుతున్నారు. ఏటీసీ నుంచి ఔటర్ రింగ్రోడ్డు వరకు దాదాపు 6 కిలోమీటర్ల మేర క్యూలైన్లు విస్తరించి ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి దాదాపు 40 గంటల సమయం పడుతోందని తితిదే ప్రకటించింది. తితిదే జేఈవో వీరబ్రహ్మం తిరుమలలో భక్తుల రద్దీని పర్యవేక్షిస్తున్నారు.
క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఆహారం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. శ్రీవారి సేవకులు, విజిలెన్స్ విభాగాలు అన్నప్రసాదం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు. ప్రధాన అన్న ప్రసాద సముదాయంలో దాదాపు 50వేల మందికి, వైకుంఠం కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలోని 1.30లక్షల మందికి అన్న ప్రసాదం, ఉప్మా, పొంగల్ పంపిణీ చేసినట్టు తితిదే అధికారులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 6గంటల వరకు దాదాపు 60వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. భారీ రద్దీ కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని తితిదే విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోకుండా వేలాది మంది స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. క్యూలైన్లలో తొక్కిసలాట జరగకుండా తితిదే విజిలెన్స్, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాకుండా జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వచ్చిన యాత్రికులు, కొత్తగా పెళ్లయిన జంటలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇంజినీరింగ్, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్యశాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తూ క్యూలైన్లను నిరంతరం పరిశీలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. -
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మలికా గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడటమే తన మొదటి లక్ష్యమన్నారు. -
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
కిర్గిజ్స్థాన్ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్లోని భారత రాయబారితో మాట్లాడారు. -
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. -
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
రాష్ట్రంలో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమలలో మరోసారి చిరుతల కలకలం.. భయంతో భక్తుల కేకలు
తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపుతున్నాయి. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. -
ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. సిట్ నివేదికలో కీలక అంశాలు!
ఏపీలో ఎన్నికల వేళ 33చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించామని సిట్ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. -
తెలంగాణ మంత్రివర్గం భేటీ ప్రారంభం.. వీటిపైనే చర్చ!
తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ఈసీ అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో మంత్రులు భేటీ అయ్యారు. -
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు
ఎన్నికల హింస ఘటనల్లో బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ కొత్త నియామకాలు చేపట్టింది. -
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీ నాటికి ఒక అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ను దిల్లీలోని ప్రత్యేక కోర్టు పొడిగించింది. -
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 ఉదయం 11 నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 pM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణ ఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్
Telangana ECET Results: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ (TG ECET Results) ఫలితాలు విడుదలయ్యాయి. -
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. అభ్యర్థుల రాకతో వివిధ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
శ్రీశైలం దేవస్థానంలో భక్తుల నుంచి అదనంగా టికెట్ రుసుం వసూలు చేస్తున్నారు. అభిషేక కర్తలతోపాటు అదనంగా వచ్చే వారికి టికెట్ రేటు పెంచి విక్రయిస్తున్నారు. -
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. -
బతుకుజీవుడా..
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక