Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తుల..
1. Adibatla kidnap case: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిందని ఆ యువతిని ప్రియుడు అపహరించుకుపోయిన సంఘటన రాష్ట్ర రాజధాని శివారు మన్నెగూడలో ఈ నెల 9వ తేదీన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు విడుదల చేసిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. Kalvakuntla Kavitha: భారాసతో భాజపా బ్రెయిన్ డ్యామేజ్: ఎమ్మెల్సీ కవిత
దేశంలో భారత్ రాష్ట్ర సమితి (భారాస)(BRS)తో కొత్త చరిత్ర సృష్టిస్తామని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. మీడియాతో ఇష్టాగోష్టిలో ఆమె మాట్లాడారు. మహిళలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అవహేళన చేస్తున్నారని కవిత ఆరోపించారు. సరైన సమయంలో భాజపాకు బుద్ధి చెబుతామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. Congress: కాంగ్రెస్లో కోవర్టులు.. వారితోనే పార్టీకి తీవ్ర నష్టం: దామోదర రాజనర్సింహ
తెలంగాణ కాంగ్రెస్లో కొత్త కమిటీల చిచ్చు తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి కొండా సురేఖ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మరో సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకి న్యాయం జరగడం లేదని ఆక్షేపించారు. హైకమాండ్ను గౌరవిస్తామని.. కానీ ఆత్మగౌరవాన్ని మించింది ప్రపంచంలో ఏదీ లేదని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. IND vs BAN: బంగ్లాతో టెస్టు సిరీస్కు వేళాయే.. భారత్ సత్తా చూపేనా..?
పసికూన అనుకొంటే బెబ్బులిలా రెచ్చిపోయి బలమైన టీమ్ను ఓడించి వన్డే సిరీస్ను కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. తాజాగా మరో సిరీస్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఆ రెండు జట్లు ఏంటో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందిగా.. ఒకటి టీమ్ఇండియా కాగా.. మరొకటి బంగ్లాదేశ్. బుధవారం నుంచి భారత్-బంగ్లా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. SBI ఖాతాదారులకు గుడ్న్యూస్.. డిపాజిట్ రేట్లు పెంచిన బ్యాంకు
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)’ తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు నేటి (డిసెంబరు 13) నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. కాలపరిమితులను బట్టి వడ్డీరేట్లను 15-100 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త డిపాజిట్లతో పాటు పాత వాటిని పునరుద్ధరించినా తాజా రేట్లు వర్తిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. Amit Shah: చైనా నుంచి కాంగ్రెస్ సంస్థకు డబ్బులు : అమిత్ షా
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా (Amit Shah) నిప్పులు చెరిగారు. లోక్సభలో (Lok Sabha) ప్రశ్నోత్తరాల సమయాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని మండిపడ్డారు. చైనాపై సరిహద్దు వివాదంపై మాట్లాడిన ఆయన.. 1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్నారు. మరోవైపు చైనా రాయబార కార్యాలయం (China Embassy) నుంచి కాంగ్రెస్ నేతల సంస్థకు డబ్బులు చేరాయని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. Pakistan: ఓఐసీ పాకిస్థాన్ బాకాలా పనిచేస్తోంది..: భారత్
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) తీరుపై భారత్(India) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ విశ్వాసాన్ని కోల్పోతోందంటూ విమర్శించింది. ఇటీవల ఓఐసీ సెక్రెటరీ జనరల్ హిస్సెయిన్ బ్రహిమ్ తవా పాక్ ఆక్రమిత కశ్మీర్ను సందర్శించారు. భారత్ (India)జరుపుతున్న షెల్లింగ్తో ప్రభావితమైన వారి కోసం అక్కడ జరిపిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రకటన వెలువడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. Loan written off: 5 ఏళ్లలో ₹10 లక్షల కోట్ల రుణాల రైటాఫ్!
గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10లక్షల కోట్ల (రూ.10,09,511) విలువైన మొండి బాకీలను (NPA) బ్యాంకులు రైటాఫ్ (written off) చేశాయని కేంద్రం పార్లమెంట్కు తెలిపింది. రాజ్యసభలో ఓ సభ్యుడి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) ఈ మేరకు సమాధానమిచ్చారు. నాలుగేళ్లు దాటిన మొండి బకాయిలను బ్యాంకులు (Banks) రైటాఫ్ పేరిట తమ బ్యాలెన్స్ షీట్ల నుంచి తొలగిస్తాయని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. YS Sharmila: వైతెపా అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి
వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. వరంగల్ జిల్లాలో షర్మిల పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు అనుమతి రద్దు చేసిన విషయం తెలిసిందే. పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను ఆదేశించినా పోలీసులు పాదయాత్రకు అనుమతివ్వకపోవడంతో వైతెపా నేతలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతుకుజీవుడా..
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
రాములోరికి పసిడి పుష్పార్చన
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు