Lok Sabha polls: మోదీ గ్యారంటీ vs కాంగ్రెస్ న్యాయ్ గ్యారంటీ.. 2024 పోరు షురూ!
లోక్సభ ఎన్నికల్లోనూ (Lok Sabha Elections) ‘గ్యారంటీ’ల హవా నడుస్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టిన ప్రధాన రాజకీయ పార్టీలు వీటినే (Guarantee) అస్త్రాలుగా మలుచుకున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల సీజన్ అంటేనే రాజకీయ పార్టీల వాగ్దానాలు. ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని చూడాలని అధికారంలో ఉన్నవారు చెబుతుంటే.. విపక్ష పార్టీలు మాత్రం అధికారంలోకి వచ్చేందుకు కొత్త హామీలను కురిపించే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా లోక్సభ ఎన్నికల్లోనూ (Lok Sabha Elections) ‘గ్యారంటీ’ల హవా నడుస్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టిన ప్రధాన రాజకీయ పార్టీలు వీటినే (Guarantee) అస్త్రాలుగా మలుచుకున్నాయి. హామీలు ఎలా ఉన్నా రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించేవి మాత్రం క్షేత్రస్థాయి అంశాలే. ఈక్రమంలో లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) ప్రచారంలో క్షేత్రస్థాయిలో లేవనెత్తే అవకాశమున్న పలు అంశాలను పరిశీలిస్తే..
మోదీ కీ గ్యారంటీ: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఎన్నికల ప్రచారంలో ‘మోదీ గ్యారంటీ’ నినాదాన్నే ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. యువత, మహిళా సాధికారత, రైతుల సంక్షేమంతోపాటు దశాబ్దాలుగా నిరాదరణకు గురైన అట్టడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ‘మోదీ గ్యారంటీ’లో భాగమని చెబుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఇదే నినాదం తాజా ఎన్నికల్లో అధికార, ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధానికి తెర తీస్తోంది.
కాంగ్రెస్ న్యాయ్ గ్యారంటీ : వరుస ఓటములతో నిరాశలో మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇటీవల హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఊపిరినిచ్చాయి. ‘ఐదు గ్యారంటీ’లతో ఎన్నికలకు వెళ్లిన హస్తం పార్టీ అధికారాన్ని చేపట్టింది. లోక్సభ ఎన్నికల్లోనూ ‘5 న్యాయ్ గ్యారంటీ’ మంత్రాన్ని బయటకు తీసి.. యువత, రైతులు, మహిళలు, కార్మికులు, ఇతర వర్గాలకు న్యాయం పేరుతో హామీలు కురిపిస్తోంది. మణిపుర్ నుంచి ముంబయికి ‘భారత్ జోడో న్యాయ్యాత్ర’ మొదలుపెట్టిన అగ్రనేత రాహుల్గాంధీ ఈ హామీలను ప్రకటించారు. ఈ వాగ్దానాలతోనే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
నిరుద్యోగం, ధరల పెరుగుదల: దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుండటంతోపాటు నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చిన విషయాన్ని కాంగ్రెస్తో పాటు విపక్ష ‘ఇండియా’ కూటమి ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఉద్యోగాలు కల్పించకపోవడమే అతిపెద్ద సమస్య అని విపక్షాలు చెబుతుంటే.. అధికార భాజపా మాత్రం వీటిని తిప్పికొడుతోంది. పెరుగుతోన్న ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ఉదహరిస్తోంది.
ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ అమలు : భాజపా సుదీర్ఘకాలంగా ఇస్తోన్న వాగ్దానాల్లో ఇవి ముఖ్యమైనవి. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోపాటు పౌరసత్వ సవరణ చట్టం అమలులో సాధించిన విజయాన్ని కాషాయ పార్టీ ప్రధానంగా ప్రచారం చేసుకోనుంది. ఉమ్మడి పౌరస్మృతిని జాతీయస్థాయిలో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోన్న భాజపా.. ఉత్తరాఖండ్లో చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రజల్లో విభజన తెచ్చే ప్రయత్నమని విమర్శలు గుప్పిస్తున్నాయి.
రామ మందిరం: శతాబ్దాలుగా ఎదురుచూసిన రామమందిరం నిర్మాణం చివరకు సాకారమైంది. జనవరి 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ (Ayodhya Ram Mandir) వేడుకకు ప్రధాని మోదీ నేతృత్వం వహించడంతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రధాని మోదీ వల్లే ఇది సాధ్యమైందని పార్టీ శ్రేణులు పేర్కొంటుండగా.. ఇది భాజపాకు లబ్ధి చేకూర్చే అంశమేనని విపక్ష పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయి!
ఎన్నికల బాండ్లు : సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం అయ్యాయి. వీటిపై అనేక అనుమానాలు వ్యక్తంచేస్తోన్న కాంగ్రెస్.. ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించడంతోపాటు, భాజపా బ్యాంకు ఖాతాలనూ నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడే కొన్నిరోజుల ముందే తెరపైకి రావడంతో విపక్షాలు దీన్ని ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
‘అమృత్ కాల్’ వర్సెస్ ‘అన్యాయ్ కాల్’ : సుపరిపాలన, వేగవంతమైన వృద్ధి, భవిష్యత్తు కోసం దార్శనికతపై మోదీ హామీ ఇస్తున్నట్లు భాజపా చెబుతోంది. దీన్నే ‘అమృత్ కాల్’గా పేర్కొంటోంది. కానీ, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవస్థల అణిచివేత, రాజ్యాంగంపై దాడి, ఆర్థిక అసమానతలు గత పదేళ్లలో పెరిగాయని చెబుతోన్న కాంగ్రెస్.. ఇది ‘అన్యాయ్ కాల్’ అని విమర్శలు గుప్పిస్తోంది.
రైతుల ఆందోళన : కనీస మద్దతు ధర, ఇతర సమస్యలపై ఉద్యమం చేస్తోన్న రైతులు.. దేశ రాజధానిని మరోసారి ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని లేవనెత్తుతోన్న విపక్షాలు.. రైతులను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శిస్తున్నాయి. భాజపా నేతలు మాత్రం రైతులతో చర్చలు జరుపుతున్నామని, ఇది రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తున్నారు. తాజా లోక్సభ ఎన్నికల్లో ఇది కూడా ఓ ప్రచారాస్త్రంగా మారనుంది.
పార్టీ సిద్ధాంతాలు: ఈ ఎన్నికలు భాజపా, కాంగ్రెస్ల మధ్య ‘సిద్ధాంతాల యుద్ధం’ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రెండు పార్టీలు తమ సైద్ధాంతిక సూత్రాలను ప్రజల ముందు ఉంచనున్నాయని, వీటిలో ఏది కావాలో తేల్చుకోవాలని ఓటర్లను కోరనున్నట్లు చెబుతున్నారు.
వికసిత్ భారత్ విజన్: భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రధాని మోదీ ఉద్ఘాటిస్తున్నారు. 2047 నాటికి లక్ష్యాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెబుతోంది. దీన్నే వికసిత్ భారత్గా భాజపా ప్రచారం చేస్తున్నప్పటికీ.. విపక్షాలు మాత్రం దీన్ని ‘మరో మోసం’ అని ఆరోపిస్తున్నాయి. ఇలా లోక్సభ ఎన్నికల వేళ పలు కీలక అంశాలు క్షేత్రస్థాయిలో ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ‘ఆపరేషన్ ఝాడూ’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. -
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
Swati Maliwal: ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ సొంత పార్టీ నిర్వహించ తలపెట్టిన నిరసనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒకప్పుడు న్యాయం కోసం జరిగిన ఆందోళనలు.. ఇప్పుడు నిందితుణ్ని రక్షించడం కోసం జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Express: ఇంజిన్లో మంటలు చెలరేగటంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం అత్యవసరంగా ల్యాండయ్యింది. -
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
Prajwal Revanna: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!