గంటల తరబడి వాదనలా?కట్టలుగా పత్రాలా?
గంటల తరబడి వాదనలు వినిపిస్తుండడం, కట్టల కొద్దీ పత్రాలు సమర్పిస్తుండడంపై గురువారం సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
సంక్షిప్తంగా ఉంటే వేగంగా తీర్పులు
న్యాయవర్గాలు చర్చించాలి
ఫేస్బుక్ కేసు తీర్పులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
దిల్లీ: గంటల తరబడి వాదనలు వినిపిస్తుండడం, కట్టల కొద్దీ పత్రాలు సమర్పిస్తుండడంపై గురువారం సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మౌఖిక వాదనలకు సమయ పరిమితి విధిస్తే ఎలా ఉంటుందని అభిప్రాయపడింది. ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్-సీయీవో అజిత్ మోహన్కు దిల్లీ శాసనసభ శాంతి-సామరస్య కమిటీ సమన్ల వ్యవహారమై ఇచ్చిన తీర్పులో ఈ సూచన చేసింది. దిల్లీలో జరిగిన అల్లర్లపై విచారణ జరుపుతున్నందున తమ ముందుకు హాజరై సమాచారం ఇవ్వాలని ఆ కమిటీ నోటీసు పంపడంతో దీనిని సవాలు చేస్తూ ఆయన వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ హృషికేశ్ రాయ్లతో కూడిన ధర్మాససం ఈ కేసును విచారణకు చేపట్టింది. వినతిని తిరస్కరించింది. వాదనలు జరిగే తీరులో మార్పులు రావాలని, దీనిపై న్యాయవర్గాలు చర్చలు జరపాలని సూచించింది. దీంట్లోని ముఖ్యాంశాలు...
ప్రస్తుత కేసులో...
‘‘ఈ కేసును పరిశీలిస్తే ఇరు పక్షాలు 26 గంటల పాటు వాదనలు వినిపించాయి. దానికితోడు లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాయి. అదనపు లిఖితపూర్వక వాదనలు అంటూ మరికొన్ని పత్రాలు ఇచ్చాయి. పాత తీర్పుల ఉదాహరణలు అంటూ చాలా పత్రాలు ఇచ్చాయి. వీటిని పరిశీలించడమే చాలా కష్టంగా మారింది. అందువల్ల పాత పద్ధతులను విడనాడి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంది. ముందుగా వాదనల సారాంశాన్ని సంక్షిప్తంగా లిఖిత పూర్వకంగా ఇవ్వాలి. దానికి అనుగుణంగానే మౌఖిక వాదనలు వినిపించాలి. పాత తీర్పులో ఏ భాగం అవసరమో అంతవరకే తీసుకోవాలని జూనియర్లకు సూచించండి. సాధారణ కేసుల్లో కూడా సుదీర్ఘ వాదనలు ఉంటున్నాయి. దాంతో ముఖ్యమైన చట్టపరమైన అంశాలకు వివరణ ఇవ్వడం ఆలస్యమవుతోంది. అందుకే కోర్టులు విచారణకే పరిమితమవుతున్నాయి. తీర్పులు తరాల తరవాత వస్తున్నాయి’’ అని పేర్కొంది. ప్రధాన వ్యాజ్యంపై తీర్పు ఇస్తూ శాసనసభ కమిటీ నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఏమీ అయిపోలేదు కదా అని వ్యాఖ్యానించింది. ఇలా విచారణ జరిపే అధికారం దిల్లీ అసెంబ్లీకి లేదని కూడా స్పష్టం చేసింది. కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని పేర్కొంది.
దాంపత్య హక్కుల పునరుద్ధరణ వివాదం..
దిల్లీ: విడిపోయిన దంపతులు మళ్లీ సహజీవనం చేయాలని, దాంపత్య జీవితాన్ని కొనసాగించాలంటూ ఆదేశించే అధికారాన్ని న్యాయస్థానాలకు కల్పించిన వైవాహిక చట్ట నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో ప్రస్తావించిన అంశాలు ‘ప్రాధాన్యం గలవి’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిషనర్లు లేవనెత్తిన విషయాలపై స్పందనను కేంద్ర ప్రభుత్వం పది రోజుల్లోగా లిఖితపూర్వంగా సమర్పించాలని కోరింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించేందుకు జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.ఆర్.గవాయ్ల ధర్మాసనం అనుమతించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో తమకు సహకారం అందించాల్సిందిగా అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ను ధర్మాసనం గతంలోనే కోరింది. గురువారం కొద్ది సమయంపాటు జరిగిన విచారణకు హాజరైన ఆయన..న్యాయస్థానం కోరిన సమాచారాన్ని సమర్పించడానికి మరికొంత వ్యవధి కోరారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9, ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 22, ఇతర నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ గుజరాత్ నేషనల్ లా యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు ఓజశ్వా పాఠక్, మయాంక్ గుప్తా పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరికొన్ని పిటిషన్లు కూడా న్యాయస్థానం ముందుకు వచ్చాయి.-సర్కారు స్పందన కోరిన సుప్రీంకోర్టు
సహకార సంఘాలపై కేంద్రం చట్టాలు చేయవచ్చా?
దిల్లీ: సహకార సంఘాలపై చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు గురువారం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. సహకార సంఘాల నిర్వహణ అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో పలు విధానాలను రూపొందిస్తూ 2011 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం 97వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది. ఇది 2012 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. దీనిపై గుజరాత్ హైకోర్టులో దావాలు దాఖలు కాగా, రాజ్యాంగ సవరణలోని కొన్ని అంశాలను కొట్టివేస్తూ 2013లో తీర్పు ఇచ్చింది. సహకార సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని, దీనిపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకు లేదని స్పష్టం చేసింది. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ కె.ఎం.జోసఫ్, జస్టిస్ బి.ఆర్.గవాయ్లతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ దీని ద్వారా రాష్ట్రాలకు మార్గదర్శనం చేశామే తప్ప, వాటి అధికారాలను తీసుకోలేదని తెలిపారు. - తీర్పు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
ఫేస్బుక్లో పరిచయమైన మహిళ కోసం ఓ వ్యక్తి సైనిక రహస్యాలను పాక్కు చేరవేశాడు. వీటిల్లో కీలకమైన డ్రోన్ల వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
Mani Shankar Aiyar: పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే భారత్ దాయాదిని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో హస్తం పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. -
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ (Narendra Dabholkar) హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది. -
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)పై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించిన విషయాలు చర్చకు దారితీశాయి. -
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?