మొదట పాకిస్థాన్..ఇప్పుడు చైనా..!
భారత్కు ఉత్తర, తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పందించారు.
సరిహద్దు వివాదాలు సృష్టిస్తున్నాయన్న రక్షణ మంత్రి
44వంతెనలను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్
దిల్లీ: భారత్కు ఉత్తర, తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పందించారు. మొదట పాకిస్థాన్, ఇప్పడు చైనా దేశాలు సరిహద్దులో వివాదం సృష్టిస్తున్నాయని స్పష్టంచేశారు. తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చూస్తుంటే.. ఒక మిషన్లో భాగంగానే ఈ రెండు దేశాలు వివాదం సృష్టిస్తోన్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన వంతెనలను ప్రారంభించిన అనంతరం రక్షణశాఖ మంత్రి ఈ విధంగా స్పందించారు.
లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్తో పాటు జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన 44 వంతెనలను రాజ్నాథ్ సింగ్ నేడు ప్రారంభించారు. అనంతరం రెండు దేశాల సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై సైనిక అధికారులతో సమీక్షించారు. ‘మొదట్లో పాకిస్థాన్, ఇప్పుడు చైనా దేశాలు ఒక మిషన్లో భాగంగా ఈ వివాదాలు సృష్టిస్తోన్నట్లు కనిపిస్తోంది. ఇరు దేశాలతో భారత్కు దాదాపు 7వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇప్పటికీ ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి’ అని రక్షణ మంత్రి అభిప్రాయపడ్డారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇలాంటి సంక్షోభాలను దీటుగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టంచేశారు. ఈ ప్రాంతాల్లో చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిర్మాణ పనుల్లో అవిశ్రాంతంగా పనిచేసిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)ను రాజ్నాథ్సింగ్ అభినందించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో గత రెండేళ్లలోనే కొండప్రాంతాల్లో దాదాపు 2200కిలోమీటర్లకు పైగా రహదారులను బీఆర్ఓ నిర్మించిందని రక్షణమంత్రి పేర్కొన్నారు. వీటితోపాటు మరో 4200కి.మీ ఉపరితల రోడ్డు మార్గాలను బీఆర్ఓ నిర్మిస్తోన్నట్లు ఆయన వెల్లడించారు.
అయితే, భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలోనే ఈ వంతెనలు పూర్తికావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఉద్రిక్త వాతావరణమున్న లద్దాఖ్లోని వ్యూహాత్మక ప్రాంతాల్లోనే దాదాపు 7వంతెనలు ఉన్నాయి. వీటి ద్వారా స్థానికులకే కాకుండా సంవత్సరం పాటు భారత సైన్యం తేలికగా ఆయుధ సామాగ్రిని తరలించేందుకు వీలుంటుంది. వీటితోపాటు మంచుకొండలతో నిండివుండే హిమాచల్ ప్రదేశ్లోని డార్చా ప్రాంతాన్ని లద్దాఖ్తో అనుసంధానించే ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.