మరిన్ని చైనా కాన్సులేట్లు మూసేస్తాం: ట్రంప్
అమెరికాలో మరిన్ని చైనా రాయబార కార్యాలయాలను మూసివేసే అవకాశం ఉందని, ఈ అంశాన్ని కొట్టిపారేయలేమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
సంకేతాలిచ్చిన అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్: ప్రపంచదేశాలను సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మహమ్మారికి కారణం చైనానే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శిస్తూనే ఉన్నారు. దీనికి కారణమైన చైనాపై చర్యలు ఉంటాయని పలుమార్లు హెచ్చరించారు. తాజాగా అమెరికా ఆ వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హ్యూస్టన్లోని చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో మరిన్ని చైనా రాయబార కార్యాలయాలను మూసివేసే అవకాశం ఉందని, ఈ అంశాన్ని కొట్టిపారేయలేమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హ్యూస్టన్లో చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలన్న ఆదేశంపై ట్రంప్ స్పందించారు. హ్యూస్టన్లోని చైనా కార్యాలయంలో మంటలు చెలరేగాయని వెల్లడించారు. అక్కడ వారు పత్రాలు తగులబెట్టినట్లు భావిస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే వారు అలా ఎందుకు చేశారో తెలియదని, ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయినట్లు ట్రంప్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని చైనా రాయబార కార్యాలయాలు సైతం మూసివేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. శ్వేత సౌధంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ విషయాలు వెల్లడించారు.
గూఢచర్యం ఆరోపణలు..
అమెరికాలో తన రాయబార కార్యాలయం నుంచి చైనా అక్రమంగా గూఢచర్యానికి పాల్పడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా మేధో సంపత్తిని, అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడంలో భాగంగానే చైనా కాన్సులేట్ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా సమర్ధించుకుంటోంది. ఈ సందర్భంలోనే హ్యూస్టన్లోని కార్యాలయాన్ని 72గంటల్లోగా మూసివేయాలని ఆదేశించిన విషయాన్ని చైనా స్వయంగా వెల్లడించింది. ఇది ఇరుదేశాల దౌత్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించింది. అమెరికా చర్యను తీవ్రంగా ఖండించిన చైనా.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సరైన రీతిలో స్పందిస్తామని స్పష్టం చేసింది.
చైనా ప్రతీకార చర్య..!
అమెరికా తీరును ఖండించిన చైనా ప్రతీకారచర్యకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా చైనాలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తొలుత చెంగ్డూ నగరంలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని చైనా స్థానిక మీడియా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చైనాను దోషిగా చిత్రీకరించడానికే అమెరికా ప్రయత్నం చేస్తోందంటూ చైనా మీడియా అభిప్రాయపడింది. అమెరికాలో మొత్తం ఐదు నగరాల్లో చైనా రాయబార కార్యాలయాలు ఉన్నాయి. చైనాలోనూ అమెరికాకు చెందిన ఐదు రాయబార కార్యాలయాలు ఉన్నాయి. వీటికి అధనంగా హాంగ్కాంగ్లోనూ అమెరికా రాయబార కార్యాలయం ఉంది.
ఇవీ చదవండి..
ఆ చైనా కాన్సులేట్ మూసేయండి..అమెరికా ఆదేశం
చైనాపై చర్యలు తప్పవు..ట్రంప్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM