Crime news: అత్యాచారం చేసిన వ్యక్తిని బంధించి.. పోలీసులకు అప్పజెప్పిన ఎయిర్‌ హోస్టెస్‌..!

తనను అత్యాచారం చేసిన వ్యక్తిని ధైర్యంగా బంధించి పోలీసులకు పట్టించిందొక ఎయిర్‌ హోస్టెస్‌. ఈ ఘటన దిల్లీలోని మెహురిల్లీ ప్రాంతంలో చోటు చేసుకొంది.

Updated : 27 Sep 2022 15:43 IST

దిల్లీ: తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని ధైర్యంగా బంధించి పోలీసులకు పట్టించిందొక ఎయిర్‌ హోస్టెస్‌. ఈ ఘటన దిల్లీలో చోటు చేసుకొంది. మహిళపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కాన్పూరుకు చెందిన హర్‌జీత్‌ యాదవ్‌గా గుర్తించారు. అతడొక పార్టీకి చెందిన బ్లాక్‌ అధ్యక్షుడిగా తేలింది.

నిందితుడు హర్‌జిత్‌ యాదవ్‌ బాధితురాలికి నెలన్నరగా పరిచయం. అతడు ఆదివారం మత్తుపదార్థాలు సేవించి సదరు ఎయిర్‌ హెస్టెస్‌ ఇంటికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు నిందితుడిని బంధించి సాయం కోసం 112 నెంబర్‌కు కాల్‌ చేసింది. ఈ ఘటనపై 
దక్షిణ జోన్‌ డీసీపీ చందన్‌ చౌధరీ మాట్లాడుతూ  ఆదివారం కాల్‌ వచ్చిన వెంటనే పోలీసులు స్పందించారని పేర్కొన్నారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. ప్రస్తుతం నిందితుడిని కోర్టు ఆదేశాల మేరకు కస్టడీకి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని